Friday, 17 May 2024

ఆయనకొఱకు తపన ఆవేదన

ఆయనకొఱకు తపన ఆవేదన

 రచన-శ్రీ రవికుమార్, ప్రశిక్షకులు,రాయచూర్. 
అనువాదం :- శ్రీ పి. సుబ్బరాయుడు, ప్రశిక్షకులు, కడప

సహజమార్గదర్శన మను పుస్తకమున పూజ్యబాబూజీ మహరాజ్ యిలా సెలవిచ్చారు. "సృష్టిజరుగుట అవసరమైనపుడు, భగవంతుడు ఉనికిలోనికి వచ్చెను. భగవంతుడు సృష్టిచేయవలునను యోచనచేయగనే, కేంద్రము లేక భూమాచుట్టూ నిగూఢమైయున్న చైతన్యము, కుదుపువలన, దైవీయశక్తి విశ్వనిర్మాణమునకై విడుదలైనది. కేంద్రమునుండి వేరుపడిన కారణమున వ్యధగలిగి, ఆవ్యధ మనిషిని తన మూలమును గూర్చి జ్ఞాపకము చేసుకొనుటకు దారితీసినది.

కనుక, సృష్టి దాని పరిణామక్రమములో తన ఉత్పత్తికి కారణమైన మూలమువైపునకు తిరిగి వెళ్ళుట, మనిషి ఆత్మయొక్క సహజత్వమైయున్నది. సంస్కారములచేత చుట్టబడిన పట్టుపురుగుప్యూపా వలెనున్నఆత్మ, మూలము లేక కేంద్రమునకు తిరిగివెళ్ళుటకు హృదయములో ఆతృత కలిగియున్నది.

లోతైనవిషయములు గల బాబూజీవారి దశాదేశములవ్యాఖ్యానము అను పుస్తకమున, మొదటి‍ఆదేశము తొమ్మిదవ ప్యారాలో యిలా వ్రాశారు. "మనిషి తను అంతర్గతముగా తన ఉత్పత్తిస్థానమునకు తిరిగి వెళ్ళవలెనను ఆకాంక్ష రేకెత్తుటకు కారణము, అతడు తనవంతుగా గైకొన్న ఆ సత్యసారము శక్తివంతమై, ఆవైపునకది ఆకర్షించుటే. సృష్టికికారణమై, ఉనికిలోనికి వచ్చిన ఆచైతన్యములో అతని వంతు భాగం అతనిలో (మనిషిలో) ప్రవేశించినది. మనిషిలో ఆ నిశ్చలస్థితికి తిరిగివెళ్ళవలెనను ఆలోచన వచ్చినంతనే, తనలోనికి ప్రవేశించి అంతర్గతముగా నిద్రాణమైయున్న శక్తి ఉత్తేజితమై, తనశక్తికొలది తిరుగుప్రయాణమునకు ప్రయత్నించినది. 

దివ్యశక్తిమూలంనుండి ఆవిర్భవించిన మానవమనస్సు తనమూలమునకు తిరిగివెళ్ళుటకు ఆవేదనతోను, ఆతృతతోనూ తహతహలాడుచున్నది. అది అందులకు తగు విధానము, పద్దతికై అన్వేషించుచున్నది.  అభ్యసి తన లక్ష్యముసాధించుటకు (అన్వేషణ ఫలించుటకు)  గురువు అతని హృదయలోనాటిన బీజరూప సత్యసత్వమును భక్తి ప్రేమలతో సక్రమముగా చేయు ధ్యానముద్వారా, పొంగివచ్చిన నిరంతరస్మరణ యనెడు జలమునందించి, బీజరూపమున తనలో నిక్షిప్తమైయున్న గురుశక్తిని పోషించును.  నిశ్చితమైన ఇచ్ఛాశక్తి, నిజమైన మానవ జీవితగమ్యమును చేరవలెనను ఆతృతగలిగి ఆమహాప్రభువగు గురువర్యుల దీవెన, దయ ప్రాప్తమైనయెడల మానవుని తిరుగుప్రయాణము సుగమమమగును.  

మనిషి కోరికలగు దాసుడై, ప్రాపంచికవస్తుసముపార్జనలో  వ్యధ లకులోనై  మానవజన్మ కలిగినందులకు నిజమైన లక్ష్యసాధన కొఱకు పాటుబడుటను విస్మరించినాడు.

ఆధ్యాత్మిక ప్రయాణము

తీవ్రమైన ఆకాంక్ష లేక ఆతృతతో లీనమవ్వడం, వ్యాప్తిజెందడం  మరియు  తననుతాను శూన్యునిజేసుకోవడమన్నది, పురోగమనానికి నిదర్శనము. సహజమార్గవిధానాన్ని సక్రమంగాపాటించడం,  ముఖ్యంగా ఆత్మపై యేర్పడిన ముద్రలను (సంస్కారములను) అంతఃశుద్ధీకరణద్వారా తొలగించుకోవడం వల్ల ఆమహాప్రభువు (గురువు)నకు శరణుజొచ్చి, మనస్వస్థానమునకు (భూమకు) తిరిగివెళ్ళుటకు తగు అర్హతనుబొందును.

అభ్యాసి గురువును ధ్యేయంగా నిశ్చయించుకొని (తూహీ హమారీ జిందగీకా మక్సద్ హై) ఆయనపైనే ధ్యాసవుంచినట్లైన, బాబూజీ  మనగమ్యము మనకు జ్ఞాపకముండేట్లు చేస్తారు. బాబూజీ వివరించినట్లు అంతరంగమున సృష్టికర్తతో తిరిగి ఐక్యమగుట కొఱకు ఆత్మపడు వ్యధ, ఆతృత కంటే, అనంతమువైపుసాగు ఆధ్యాత్మికప్రయాణములో కలుగు ప్రశాంతత, ఆనందము యేమంత గొప్పకాదు.  

మన స్వప్రయత్నమున వేలజన్మలకైనను మన నిజస్థానమునకు తిరిగివెళ్ళుట సాధ్యముకాదు. మన బాబూజీవంటి సద్గురువు, మనము అంతిమసత్యముతో ఐక్యమగునట్లు చేయగలరు. ఆ అంతిమసత్యమే సమస్తమునకు మూలము.

మన అదృష్టవశమున దివ్యత్వము మానవరూపమున శ్రీరామచంద్రజీ మహరాజ్ షాజహాన్‍పూర్‍గా అవతరించినది. ఆయన అవతరణతో మొదటిసారిగా ఆధ్యాత్మికచరిత్రలో వ్యక్తికి సహజంగా  సులువుగా జీవితసమస్యాపరిష్కారము లభ్యమైనది.

కర్ణాటకలోని రాయచూర్ నివాసియైన పూజ్యశ్రీ రాఘవేంద్రరావ్ (ఆప్యాయతతో ఆయనను అప్పాజీ యని పిలుచుకొందుము) ఆయనొకసారి చెబుతూ, "నిర్వచింపబడిన ఆధ్యాత్మికసాధనలన్నింటిలో స్థిమితముకోల్పోయిన ఆతృతస్థితి మహోన్నతమైనది" అన్నారు.

ఉర్దూకవిత

1961 వ సంవత్సరం జనవరి 30 న బాబూజీ, అప్పాజీకి వ్రాసిన ఉత్తరంలో యిలా వున్నది. "నీవు చాలా అందమైనవాక్యం వ్రాశావు. నీవు నాచెంత లేకపోయినప్పటికిని నాదర్శనంకోసం తహతహలాడు చున్నావు. ఇది సత్యతత్త్వసామ్రాజ్యమందు నీవందుకున్న మహోన్నతస్థితిని సూచించుచున్నది. దీనినొక ‍ఉర్దూకవితలో, యిలా యిమడ్చబడింది. "రహే తలాబ్ మే ఐసే ఖుద్ రఫ్‍తా హోరహేహై మంజిల్ పహుంచ్‍కర్ మంజిల్ డూండ్‍తేహై" అనగా నేనెంతగా లీనమై మైమరచిపోయానంటే, నేను నాగమ్యం చేరుకొనికూడా యింకా గమ్యంకోసం వెతుకుతూనే వున్నాను.

దేవవాణి పుట 188 లో పూజ్యబాబూజీ యిలా చెప్పారు. "బాధ లేక ఆతృత, సత్యతత్త్వం వైపునకు దృష్టిమరల్చిన వారి కొఱకైతే, సత్యతత్త్వపుమత్తు నాకాంక్షించు వారికొఱకు శాంతి ప్రశాంతత వున్నవి" అన్నారు. మొదటిది పొందుటంత  కష్టమూగాదు, రెండవది సాధించుటంత సులువూగాదు. ఇప్పుడొక్కింత ఆలోచించండి. వ్యధ శాంతికన్నా వెయ్యిరెట్లు విలువైనది. నిజానికి బాధ (వ్యధ) అరుదైన మహనీయుల నీలోకమునకు దెచ్చిన నిర్మాణమునకాధారమై యున్నది.

 నేను బాధ, తీవ్రవాంఛ, ఆతృత లేక అశాంతిని హృదయపూర్వకముగా కోరుకొంటిని. వాటి కొఱకు నా వేయిజీవితములను సైతము త్యాగముచేయగలను. నా స్వరూపమంతయు  ఆ విధానముననే నిర్మితమైనది. ఈకారణముననే, మీఅందరిలోనూ యిట్టిబాధ ఉత్పన్నముకావలెనని నేను ఆతృతతో యెదురుచూచుచుందును. అదే నాకు సంతృప్తినిచ్చు విషయము.

ఈవిషయమున నన్ను సంతృప్తిపరచుట మీకర్తవ్యముకాదా! నాయెడల రవ్వంతైనా భక్తిప్రపత్తులున్న వ్యక్తి సహజంగా నాకు శాంతి, ఓదార్పు కలిగించుపని చేయుటకు పూనుకుంటాడు. అదేగదా! నాజీవితపరిశ్రమ, నా తీవ్రఆకాంక్ష. శాంతికంటే యీ తీవ్ర ఆతృత (అశాంతి) యొక్క శోభ (ఆకర్షణ) చాలా గొప్పదని నిశ్చితమగా మీకు నొక్కివక్కానిస్తున్నాను.    

ఇది తీపిలేని బహుతియ్యనిబాధ. ఒకసారి మీరు దీనిని రుచిచూస్తే చాలు ఒక్కక్షణమైనా  అదిలేకుండా వుండలేరు.  ఈస్థితిని వదలుకొనుటకంటే ప్రాణత్యాగమే మేలని తలంతురు. ఇది ధ్యానమున కావలనున్న స్థితి. ఈస్థితికి గొంపోవుటకు నిరంతరస్మరణ ఒకవాహనముగా పనిచేయును.

ఇది ప్రగాఢవిశ్వాసముతోగూడిన భక్తి ప్రేమల ఫలితము.

సదా సంబంధము గలిగియుండుట

ఇది తీవ్రమైన వాంఛతో ఆతృతతో ఆరాటముతో, విశ్వేశునికొఱకు  పడుతపన. నిరంతరం సజీవముగా మండుతున్న అగ్ని. ఆయనతప్ప మిగిలినదేదియు జ్ఞాపకములేని వాడుగా మారిపోవుట. ఆయనతోనే సంబంధమేర్పరచుకొని విడువకుండుట.

ప్రియసోదరీ సోదరులారా! దివ్యదీవెన వల్ల మనము, బాబూజీ మహరాజ్ వారి పవిత్రపాదముల చెంత చేరితిమి. ఒక నిముషమైననూ వృధాపరచుకొనక యీసదవకాశమును సద్వినియోగ పరచుకొందుము గాక! సహాయపడుటకు మన గురువర్యులు సదా మనకందుబాటులో నున్నారు. ఆయన దయానంద సాగరము. మనహృదయములలో నిత్యము సత్యమునై యున్నారు. ఆయనకోసం మనము ఆతృతతో వుండటంకన్నా మేలైన విషయమేమున్నది? ఆయనకృప మనలనందరిని ఆహ్వానిస్తూ, ఆయన హృదయంలో జీవించమంటున్నది. ఆయన జీవితమే ప్రశస్తజీవితం. ఆయనకొఱకు ఆతృత (తొందర) పడండి. బాబూజీ ఉత్తరం అప్పాజీకి వ్రాస్తూ, ఒక అద్భుతవాక్యాన్ని ఉదహరించారు. ఆవాక్యంతో నా యీప్రసంగాన్ని ముగిస్తాను.

"జో దర్డ్  అస్నా, దిల్ వహీహై కైసేకి ముహబ్బత్‍కి  ఖాబిల్ వహీహై"

అంటే "బాధకలవాటుపడిన హృదయమే ప్రేమించుటకర్హమైనది".---పుట 172

(2-12-2023 న సోలాపూర్ ఫౌండేషన్ డేలో ఆంగ్లములో యిచ్చిన ఉపన్యాసము. ఆధ్యాత్మజ్ఞాన్ జనవరి-మార్చ్ పత్రికనుండి గ్రహించడమైనది)

 


Sunday, 12 May 2024

స్వార్థము

 

స్వార్థము

రచన:  డా: విజస్యకుమార్ వైకుంఠ్, గుల్బర్గా, కర్ణాటక      అనువాదం :  శ్రీ పోలిచర్ల సుబ్బరాయుడు, ప్రశిక్షకులు, హైదరాబాద్.

శ్రీరామచంద్రజీ మహరాజ్ షాజహాన్‍పూర్ వారు రచించిన దశాదేశముల వ్యాఖ్యానము అను పుస్తకములోని ఆరవ ఆదేశమిలా వున్నది. "అందరిని సోదరులుగాభావించి, వారినట్లే ఆదరింపుము".

మొత్తముమీద  సత్యసంధతలో యేకమగుటకు దైవీయపిలుపుగా యీఆదేశము మన కనిపించుచున్నది. ఈవాక్యమునకు, మనము ప్రతిస్పందించినప్పటికిని, విషయమింకను, చర్చనీయాంశముగనే మిగిలియున్నది. పూజ్యగురువర్యులు అహంకార (స్వార్థ) సమస్య, దానికిగల కారణము, పరిష్కారమును గురించి వ్యాఖ్యానమున చర్చించిరి. "ఇందులో అంతర్గతముగానున్న నున్న విషయ మెవ్వరూ అర్థము చేసుకోలేదు" అన్న సూచన అర్థవంతమైనది. ఇప్పుడీ  విషయమునర్థము జేసికొనుట కొక్కింత ప్రయత్నింతము.

స్వార్థం పుట్టుక
గురువుగారు ఒక వంశవృక్ష ఉదాహరణతో దీనిని వివరించిరి. ఒకేతల్లికి జన్మించిన సోదరీసోదరులందరూ, ఒకరికొకరు దగ్గరిసంబంధము కలిగియుందురు. తొలుత వారందరూ ఒకజట్టు. ఆతర్వాత వారందరూ వారివారి కుటుంబములను యేర్పాటు చేసికొందురు. వారిబిడ్డలు  దాయాదులుగా బంధుత్వాన్ని కలిగియుందురు. అంతేగాని బహుదగ్గరి సంబంధము కలిగియుండరు. కాలముగడిచేకొద్దీ, మరియు కుటుంబముపెద్దదై సంఖ్యపెరిగేకొద్దీ, ఒకరికొకరు దూరమైఅన్యులైపోతారు

 వంశపరంగాచూస్తే, మనందరి మూలం కొక్కటే. చూడటానికిమాత్రం ఒకరివలె మరొకరుండక, ఆకారంలోను ఒడ్డూపొడవులోనూ వేరువేరుగా వున్నాము. మరోమాటలో చెప్పాలంటేమూలంలో ( ఉత్పత్తిస్థానంలో )           మనమంతా ఒకటేగానివ్యక్తిత్వమేర్పరచుకుంటూ వేరైపోతున్నాముసోదరభావమునకు మూలమైన తొల్లింటి 
  (నిజ  (అసలుస్థితి మానవ మేధస్సునుండి తొలగిపోయింది.  

 మానవునిదృష్టి  స్థూలరూపంవరకే పరిమితమైనదిఅతనిప్రేమ అంతవరకే పరిమితంస్థూలరూపాన్ని ప్రేమించడంవల్ల  కలిగేఫలి తం ద్వైతమైనదిఅంటే ప్రేమకలదన్నంతనేతద్విరుద్ధ ( వైర ) భావనకూడ   అందులో నిక్షిప్తమైయున్నదిమనిషియీమూలసత్యాన్ని గ్రహించలేక పోతున్నాడు

అందువల్ల అతడు, బంధువులు మిత్రులు అన్నభావననుండి దూరమై పోతున్నాడు . అతని ఆలోచనాస్వరూపము వైవిధ్యగాను, గందరగోళముగాను తయారయింది. ప్రతిదీ భిన్నముగా కనిపించడం ప్రారంభమైనది. ఇవన్ని వ్యక్తిగత (అల్లికకు (నిర్మాణమునకు తోడ్పడినవి. ఇది స్వార్థమునకు మరోపేరు. స్వేచ్ఛామార్గమున యిదొక ప్రతిబంధకము. ఈప్రతిబంధకమునుండి మనిషి తప్పించుకొనవలసి యున్నది.  
 పరిష్కాము
స్వార్థము, ఇచ్చట అచ్చట అన్నతేడాలేకుండా అంతట ఉండనేవున్నది. భావన విషయంలో ఒక్కొక్కరిలో ఒక్కొక  రకంగా వుండవచ్చును. అయితే దీనిమూలకారణం వ్యక్తిగత‍అల్లికపై ఆధారపడియున్నది. అభ్యాసి తన వ్యక్తిగత‍ అల్లికను విచ్ఛిన్నము జేసికొన యత్నించి, నిజస్థితికిసమీపించేకొద్ది అతనిలోని సోదరభావము పొంగిపొరలును. మరోవిధంగా చెప్పాలంటే, అభ్యాసి సక్రమసాధనవల్ల, వారం వారం సత్సంగంలో  పాల్గొనడంవల్ల, ఇది సుసాధ్యమగును. నిజంచెప్పాలంటే, యిది అనుభవపూర్వక మార్గదర్శకత్వ పరిణామము. వ్యాఖ్యానములో నేరుగా విషయము చర్చింపబడనప్పటికి, లోతైన సూచనచేయబడింది. సహజమార్గ బోధనలలో యీవిషయంపై  నిశ్చితాభిప్రాయమైతే  తెలియజేయడం జరిగింది.
 వారంవారం సత్సంగము
సహజమార్గసాధనావిధానములో (శ్రీరామచద్ర మిషన్‍లో) వారానికొకసారైనా సత్సంగము నిర్వహించుట తప్పనిసరియై యున్నది. అందులో పాల్గొనడము సభ్యులందరి విధి. పాల్గొను అభ్యాసులందరితో గురువుగారీ సత్సంగమును నిర్వహింతురు. మార్గదర్శకములను సక్రమముగాపాటించినట్లయిన ఫలితము చాలా ప్రతిభావంతముగా నుండును.

(1) దైవీయ‍ఉనికిపై విశ్వసము. (2) రాజయోగపద్దతిలో ఆలోచన గలిగియుండుట. (3)మస్పూర్తిగా స్వేచ్ఛగా సత్సంగమున పాల్గొనుట. (4)సభ్యత మర్యాదగలిగి వ్యవహరించుట.   

 వారంవారం సత్సంగములవలన రెండువిధముల ప్రయోజనమున్నది.
 (అ) అభ్యాసి తన అంతర్గతకోశముల  లో యేర్పరచుకున్న వ్యక్తిగత అల్లికల  ప్రభా వమునధిగమించ గలుగును .
(ఇ ) సత్సంము యొక్క ఆరోగ్య వాతావరణము వలన  పరిస్థితుల ప్రభావమున  యేర్పడిన సమస్యలు  సమసిపోవును  లేదా  వాటి తీవ్రత తగ్గిపోవును
 
    సారాంశము

స్వార్థచింతన, మనిషితనకైతానే యేర్పరచుకున్నాడన్న, విషయమతడెరుగడు. ఇది అతడంగీకరించకపోయినా యిదే వాస్తవం. ఇది ఒకచిత్రమైన పరిస్థితి.  ది పతనావస్థ (దిగజారుడు స్థితి).  ప్రారంభంలో అభ్యాసి, “మనందరం ఒకటి” అన్నభావన, తనమనసుకు తానే మరిమరి సూచనలిచ్చుకొనవలెను. ఇది అతడు భక్తిపరిధిలో వున్నాడని, అలానే వుండటానికి ప్రయత్నిస్తున్నాడనడానికి నిదర్శనము. ఈవిషయవివరణము వ్యక్తిగతము. ఈవిషయమును గురించి చర్చించుకొనవవచ్చును . మీఅభిప్రాయములు నాకు తెలియజేయనూ వచ్చును


Saturday, 27 April 2024

ఆఒకటికై అన్వేషణ

 

ఆఒకటికై అన్వేషణ

 "యోగము" అంటే అసలైన అర్థం "కలయిక".  రెండువుండి అవి ఒకవిధానంప్రకారం పయనించి ఒకదానితో ఒకటి కలవడమే యోగము. ద్వైతం, అద్వైతంరెండూ తొలుత వుంటేనే యీ యోగము నకు అర్థము సిద్ధిస్తుంది. ఒక్కటైయున్న దానికై సాగే అన్వేషణే యోగముయొక్క సారంశము.

 ప్రకృతిపరిధిలో ఉన్నది, కానున్నది అన్న వాదం ప్రక్కనబెడితేయోగసాధనానుభవమున ఒకటికైసాగే అన్వేషణ ముందుకు సాగుతుంది. లక్ష్యమునకు ఒకపేరిడి, దాని వివరణలివ్వవవచ్చును. కాని ప్రభువు అన్నమాట విషయగ్రహణకు చక్కగా సరిపోతుంది. ప్రభువు అన్నమాటకు భగవంతుడు లేక లక్ష్యము అన్నమాటగా అనువదించుటగాకదాని బదులుగా యిదమిద్దమని చెప్పుట భాషాపరంగా కష్టమగుచున్నది.

ప్రభువు అన్నమాటను గ్రహించి, ఒప్పుకున్నతర్వాత, ఇక ఆయనతో కలయికప్రక్రియ మొదలుపెట్టగనే, ముడి తర్వాత ముడిగా ఆటంకములు కలుగుచున్నవి. అనగా వ్యక్తి ఆశలు మరియు ముందేయేర్పరచుకున్న భావనలు అను అడ్డంకులను అధిగమించి పురోగమించవలసి యున్నది. ముడులనువిప్పి, కేవలం కలయిక మత్రమే గాకుండా, లక్ష్యంలో లీనమగునట్లు జేయు సరియైన మార్గము ప్రేమ మాత్రమే. కానీ ప్రేమ అన్నింటికంటెను బహుమోసకారి. వ్యక్తి ముందుగనే యేరికోరి వాంఛాపరితృప్తికై యేర్పరచుకున్న ప్రేమవలన ఉన్నముడులు మరింతగా బిగుసుకపోయి, ప్రభువుకృపా మహిమకు కూడా సడలనివైపోవును. ప్రేమ సహజరీతిలో ఉత్పన్న మైనదైతే, అది సరళము సులభమునై యుండును. అదే  ప్రయత్నపూర్వకముగా తెచ్చుకొని చూపెడి ప్రేమ సంక్లిష్టముగానూ, సంకుచితముగానూ వుండును.

 ప్రేమమార్గము చాలా యిరుకైనది. అందులో ఇద్దరు ఒకేసారి యిమడరు. నిజమైనప్రేమ ఒకరిని చచ్చేట్లుచేసి, ప్రభువును మాత్రమే సజీవంగానుంచును. వికటప్రేమ ప్రభువును చావనిచ్చి తానొక్కడే ఒంటిగా జీవిస్తాడు. ఒక కర్రయొక్క రెండుకొసలవద్ద ఒకేఒకదానికై అన్వేషణజరుపు యోగప్రక్రియను విషదపరచునవే యీరెండు విధానాలు.

 వాస్తవానికి ప్రేమించడం వ్యకియొక్క ముఖ్యవిధి. కాని ప్రభువే ప్రేమించాలనడం అసంబద్ధం. అయినా ప్రేమ ప్రభువు (గురువు) నుండే మొదలవ్వాలలి మరి. ఈవిషయంలో ప్రభువు (గురువు) స్వేచ్ఛకు, యెన్నికకు ఆటంకము కలుగరాదు. ముఖ్యముగా ఆయనకిష్ట మొచ్చిన రీతిలో, ఆయన యిష్టపడి యెన్నుకున్న వారిపై, ప్రేమ స్వేచ్ఛగా ప్రసరిస్తుంది. ప్రభువుప్రేమ వర్షముకురిసినట్లు అందరియెడ సమానమే. కాని ప్రభువు యేబరువు బంధనము లేకుండా, సర్వము గ్రహించి గగనమున తేలిపోవు (తేలికయైపొయిన) వానినే యెన్నుకొనును. ఆయనతప్ప మరెవ్వరును ఆయన యెన్నికను అర్థముచేసుకొనజాలరు. గురువుయొక్క హృదయవేదన, పరితాపమునకు యెయ్యదియును సాటిరాదు. అత్యంతోన్నత స్థాయి గురువర్యులనేకులు, తాము విదుదలచేసిన శక్తిని సంపూర్ణముగ గ్రహించగల యోగ్యునికొఱకు తమదేహత్యాగం తరువాత వందల సంవత్సరములు నిరీక్షించ వలసి వచ్చినది.

 ప్రభువు (గురువు) ప్రేమద్వార ఉన్నముడులన్ని విప్పబడి, ఆయనలో లీనమగుట సంభవమై, యోగము లేక ఒక్కటికై అన్వేషణతో సహా సమస్తస్థితుల నధిగమించి, మరింతగా పురోగమింతురు. ప్రభువు (గురువు) ప్రస్తుతం సమాన్యజనం ఆరాధించు దేవునివలె వివిధరూపాలలో విడివిడిగానుండగా, విడివిడిగావున్న ఆమొత్తం ఒక పాత్రలో యిమిడిపోయి ఒక్కటైనరీతి, తగినట్లుగామారి సరియగువిధానమున ప్రభువు (గురువు) ప్రేమకు పాత్రు (యోగ్యు)లౌదురు. స్వార్థమెరుగని నిశ్చితబుద్ధితో ఒకేఒక్కదానినే (ఏకంసత్ నే  ) నమ్మియున్నట్లైన, అదే సరియైన దారి నేర్పరచి, జీవన్ముక్త (బ్రతికియుండియు మరణించిన వానివలెనుండు) స్థితికి చేర్చి, అన్వేషణను సఫల మొనర్చి, మన‍ఉనికియైన ఒకటిని ఒక్కటైయున్న దైవము (ఏకంసత్) వైపుకుత్రిప్పిమున్ముందుకు నడిపి, యీఒకటి ఆఒకటితో ఐక్యమొనర్చును.             

  (డా:శ్రీవాత్సవ గారి Divine Messages అను పుస్తకము లో ఆంగ్లములో ప్రచురించిన Search for One అను పాఠమునకిది తెలుగు అనువాదము)               

 

 

Sunday, 21 April 2024

ఇది-అది

 

ఇది-అది

వాస్తవానికి మనశరీరము , ప్రాపంచికవస్తు సముదాతము, యిదంతా "ఇది" యని,ఆత్మ ,సత్యతత్త్వ సారాశమును "ఆది" యని అనవచ్చును. ఈ"అది", "ఇది"చేతకప్పబడుతూ, ఒకపద్దతిప్రకారం ఒకటితో మొదలై పెక్కుపొరలుగా చుట్టివేస్తూ వెనక్కు నెట్టబడుతూ, ఇప్పటి పరిస్థికి వచ్చినది. నిజమైనప్రయాణం ,"అది"గా వున్న టువంటిది తనచుట్టూ చుట్టుకపోయిన "ఇది" యనెడిపొరలను ఒకటొకటిగా ఛేదించుకుంటూ, తిరిగి తన తొల్లింటి "అది" స్థితికి చేరడమే. అక్కడున్నది మనదైన, మన కనుకూలమైన స్వదేశనుభవమే. ఈఅనేకత్వం నుండి యేకత్వమునకు వచ్చుప్రయాణం సామాన్యముగా బహుదూరం. అయితే యీప్రయాణదూరం తగ్గిపోవా లంటే మహోన్నతుడైన గురువుపై పూర్తిగా ఆధారపడటమొక్కటే మార్గము. ఈదూరభారాలు, పెరగడం తగ్గడ మనేది యెంతకష్టమో అంతేసులభం. ఈ సమస్యకు పరిష్కారం, సత్యతత్త్వమైన ,కేంద్రము లేక మూలముతో అనుబంధమేర్పరచుకోవడమే. ఈఅనుబంధం ద్వైతభావం లేకుండ "ఇది" "అది" కి కూడా అతీతమైయుండాలి. తొలిప్రయాణం, మన సంపద ధనం ఆస్తిపాస్తులరూపంలోనున్న స్థూలపొరలతో చుట్టివేయబడియున్న అసలు సున్నా లేక శూన్యస్థితిని ప్రభువుకు నివేదించి తిరుగుప్రయాణానికి సిద్ధమవ్వటమే. అదే మనముందున్న లక్ష్యం. తొలుత అది దూరప్రయాణం. తర్వాత అదికష్టతరం. అదెలాగంటే, సూదిబెజ్జమునుండి ఒంటెను దాటించడమంత కష్టం. 

సున్నా (శూన్యం) ఒకటి కావడానికి జరిగిన ప్రయాణం విస్తరించిన వస్తుప్రపంచపు శాస్త్రవిజ్ఞానంవంటిది. అదే తిరుగుప్రయాణం,  ఒకటి సున్నా (శూన్యం) అవ్వడం, ఆధ్యాత్మిక విపులత్వానికి దర్పణం పడుతున్నది. ఈ "ఇది" "అది" కావల యేమున్నదో ఉన్నది (అనిమాత్రమే చెప్పగలుగుదుము). శూన్యమన్నది మానవుని మేధస్సు కందనిదైయున్నది.  మన ఉనికిలో యీ"ఇది" "అది" అనునవి మనజ్ఞానపరిమితికి ఒకహద్దు. "ఇది" కి సంబంధించి నేటివిజ్ఞానశాస్త్రము చాలానే ఆవిష్కరించినది. కానీ "అది" పరిపూర్ణమైనప్పటికి ,దాని అన్వేషణ అసంపూర్ణముగనే మిగిలిపోయినది. 

 "ఇది" "అది"ని సైతమధిగమించి అవిభాజ్యమైన 'ఏకంసత్”లో లీనమై పోవుటకు (మానసాధ్యమైన మహోన్నతస్థితికి జేరి మహాప్రళయ కాలమున కేంద్రములో అతిసహజంగా సులభముగా ఆత్మ తన ఉనికిని కోల్పోయి లీనమగుటకు) నిరీక్షిస్తున్న స్థితికి జేర్చుటలో దోహదకారియై సహజమార్గ విధానమున్నది. ఈవిధానము సంపూర్ణమైన వెలుగులోనికివచ్చుటకు ప్రతియొక్కరి సహాయసహకారములవసరమై యున్నవి. "ఇది" "అది" కి మధ్య సమతనుసాధించడమే ప్రతియొక్కరి వ్యక్తిగత సంస్యలపరిష్కారము నకు గల యేకైక మార్గము. సంస్థసక్రమ పూరోగతికిగాని ఉన్నత మానవత్వ విలువలకుగానీ మూలమదియే. ఇదే సహజమార్గ సందేశము.

 వందలాది మానవత్వపు సంస్కృతీవిలువల పరిరక్షించు ఆశయమును, నెర వేర్చు హామీతో దేశకాలపరిమితుల కతీతముగా హద్దులు, అవరోధముల నధిగమించి, సహజమార్గవిధానము వచ్చినది. సహజమార్గ ఆవిష్కర్త (శ్రీ రామచంద్ర, షాజహాన్ పూర్ వారి ) కృప, వ్యక్తిత్వపుపరిధులను దాటి, నిత్య సత్య మూలకారణమై, ప్రతియొక్కరికీ అందుబాటులో యుండుటేగాక ఆ మహనీయుని ప్రేమించువారికీ, ఆయనను గుర్తించి, ఆయనపై ఆధార పడినవారి కందరికీ సర్వకాలసర్వావస్థలలో సన్నిహితుడై (వారి హృదయములలో వెలుగై) వారి జీవితలక్ష్యమును నెరవేర్చుటకు సంసిద్ధులై    ఉంటారు.

 (డా:శ్రీవాత్సవ గారి Divine Messages అను పుస్తకము లో ఆంగ్లములో ప్రచురించిన This And That అను పాఠమునకిది తెలుగు అనువాదము)               

 

Thursday, 18 April 2024

దేహత్యాగానంతర ఆధ్యాత్మికశిక్షణ

 

దేహత్యాగానంతర ఆధ్యాత్మికశిక్షణ

 ప్రతియొక్కరు విహారయాత్రలో ప్రకృతిఅందాలను చూడటానికి యిష్టపడ తారు. అందులోనూ వసంతఋతు శోభ, పూదోటలు చూచి ఆనందిస్తారు. శాంతస్వభావులు అలాచూస్తూ ప్రశాంతంగా ప్రకృతిలో తిరిగివస్తారు. చపలచిత్తంగలవారు సంగీతవద్యాలను జోరుగావాయించి వింటూ కాలంగడిపేసి విహారయత్ర ముగిసిం దనుకుంటారు. ప్రియుని (భగవంతుని) ద్యాసలో పూర్తిగా మునిగిపోయినవారు విహరయాత్రను మరోవిధంగ తిలకిస్తారు. ప్రేయసికి యీ అరుపులు గందరగోళముతో పనేముంటుంది? ప్రియుని (భగవంతుని) స్థానంనుండి తీసుకొనిరాబడిన చిరుగాలితెమ్మెరలే అతనికానందదాయకమౌతాయి. వారి మజిలీ మనవినోదం ముగిసి ఆ వినోదపుమోహాన్నధిగమించిన తర్వాతే వస్తుంది.

 ఒక కుటుంబపెద్ద జబ్బుపడితే, అతనిధ్యాస పిల్లలబాగోగులపై యెక్కువగా వుంటుంది. అందుకుకారణం బహుశా అతనిజబ్బుయొక్క బాధ, ఆజబ్బు వలన కలిగిన దిగులు కావచ్చును. ఇతరఆలోచనలు అతన్ని బాధించక పొవచ్చును. ఇకపోతే తనచుట్టూ సన్నిహితంగ తిరుగుచున్న, తనబిడ్డలతో బంధమేర్పడి యుండవచ్చును. బిడ్డలు తనయెదుటనే కనబడుతున్నందున వారియెడ మరింత మమకారం కలిగియుండవచ్చును. ఇదే మరణ సమయమున మనిషికి బంధనమైపోవును. అత్యాశ (ధనంపై) అత్యంత హేయమైనది. అది పాపాలన్నింటికి తల్లివంటిదని నాభావన. ఆవ్యామోహం చాలాగట్టిబంధనమునకు దారితీయుచున్నది. నేను చెప్పదలచుకున్న దేమంటే, బాధ (నొప్పి) పడుతున్న సమయంలో యేదో అత్యవసర ప్రత్యేక సందర్భములలోతప్ప మిగతా సమయములలో ఆధ్యాత్మికకార్యము సహజంగా జరుగదు. ఆధ్యాత్మికకుటుంబముపై యెక్కువగా దృష్టి మరలుతుంది. ఎందుచేతనంటే, నావిషయంలో నేను అభ్యాసుల ఆలోచన, స్మరణతో వెంటనే ప్రభావిత మౌతాను. సాధారణంగా నాఆధ్యాత్మిక కార్యనిర్వహణలో నాసంబంధీకుల స్వరం సరిగ్గావినబడదు. అటువంటప్పుడు నేనే స్వప్రయత్నంతో వారిని జ్ఞాపకంచేసుకుంటూ వుంటాను. దీనర్థమేమంటే, నాజబ్బువల్ల సోదరీసోదరులంతా మేలు పొందుతారు. అయినప్పటికీ జనులు మాత్రం నేను ఆరోగ్యంగా వుండాలనీ, శారీరకబాధలేవీ లేకుండా వుండాలనీ ఆశిస్తారు. నేను అనారోగ్యంతో బాధపడుటవల్ల వారి ఆధ్యాత్మికప్రగతి వేగవమ్తమౌతుందని పాపమాదీనజనులకు తెలియదు.     

               నాబాధ యిబ్బంది వలన, నాసహచరులుపొందే, యీ ప్రయొజనమేగాకుండా నేనుయీ భౌతికదేహం వదలివెళ్ళుటవల్ల కలిగే ప్రయోజనం మరింత మిక్కుటంగా వుంటుంది. అంతేగాక దేహత్యగం చేసినవారికి సహితం యిది ప్రయోజనకరమే. శరీరం వదలిన తర్వాతనే నిజానికి పరిపూర్ణత సిద్ధిస్తుంది. ఎందుకంటే, శరీరంతోవున్నప్పుడు వుండే కొన్నిఆటంకాలు శరీరంతోపాటే తొలగిపోయి యే హద్దులూలేకుండా కార్యనిర్వహణ సాగిపోతుంది.

 కబీరుమహనీయుడు యిలా ప్రకటించాడు. "ప్రపంచం మరణభయంతో వ్యధజెందుచున్నది. కానీ నాకుమాత్రం అది ఆహ్లాదదాయకం. నేను మరణించటంతో నాకు బ్రహ్మానందం ప్రాప్తిస్తుంది"

 మనసంస్థకు గల ప్రత్యేకసదుపాయమేమంటే , సశరీరియైయున్నప్పుడు కూడా సంపూర్ణ ప్రయోజనం కలిగించుటే. ఇది మనగురువర్యుల అపూర్వ ఆవిష్కరణ. అయినప్పటికీ అంతటిమహోన్నతస్థాయి నందుకొన్న వారిపై ప్రాణాహుతిప్రసార సమయములో కొంతవరకు హద్దులు విధించబడ్డాయి. అందువల్ల దైవీయశక్తి ప్రసారము సంపూర్ణస్థాయిలో అభ్యసిలోనికి దూసుకొనిపోయి అతనినరములు విచ్ఛిన్నముగాకుండా కాపాడు కోవటం జరుగుతుంది. అట్టిమహోన్నతాస్థాయి నాకనుగ్రహింపబడినప్పుడు, నానుండి ప్రవహించు ప్రాణాహుతిని అభ్యాసులు అరనిముషముకూడా భరింపజాలరు. నాపైగల సౌజన్యమువలన లాలాజీవారు నాకలాంటి హద్దులేవీ విధించలేదు. అయితే నేను ఆస్థితిలో యెవరికీ శిక్షణనిచ్చుటకు వీలుపడలేదు. అప్పు డాయనను ప్రార్థించాను. ఆయన కొన్ని హద్దులేర్పరచి, ఆహద్దులనుసైతం నేనుకోరితే తొలగించ బడతా యన్నారు. అలాఆయన విధించిన హద్దులను తొలగించమని కోరే అవసరం నాకెప్పుడూ కలుగలేదు.

 శరీరంవీడినతర్వత గురువునుండి దీక్షపొందిన శిష్యులు తండ్రిఆస్తిని బిడ్డలు పొందినట్లు వారివారి వాటాను వారు పొందుతారు. అంతే గాకుండా, ప్రేమాతిశయంతో గురువులో లీనమైయున్నవారు అందుకు తగినట్లు యెక్కువవాటా పొందుతారు. గురువు శరీరంవదలిన తర్వాత కూడా యేశిష్యులైతే ధారతెగిపోకుండా తమఆలోచనలో గురువును నిలుపుకొనివుంటారో, వారు గురువునుండి ప్రయోజనం పొందుతూనే వుంటారు. లీనమైపోవడం, అనేకప్రయోజనాలను సమకూరుస్తుంది. అందుకు కారణం, అతని అహం పూర్తిగా నిర్మూలింపబడి వుంటుంది. అతడాశించిందే (దైవమే) అతనిలో విరాజమనమై వుంటుంది. అభ్యాసి తను యెంతగా గురువులో లీనమైయుంటాడో, అంతగా అతడు ప్రయోజనం పొందుతాడు. అందుకేనేను ప్రతియొక్కరినీ లీనమవ్వమని పదేపదే ప్రోత్సహిస్తూవుంటాను. కానీ జనులు మాకు తిరుబడిలేదని చెబుతూ, ఆవైపునకే తిరుగలేకున్నారు. ప్రతియొక్కరూ నేనే నాశక్తితో వారిపనులన్నీ చేసిపెట్టాలంటారు. కానీ వాస్తవంచెప్పాలంటే, అది అభ్యసి కర్తవ్యము. లినమవ్వడమటుంచి, వారికోసం యెంతోకొంత చేస్తూనేవుంటాను. మొగమాటంతో త్రోసిపుచ్చలేక కూడ కొంతచేయవలసి వస్తున్నది. మొత్తంమీద గమనిస్తే, వారిలో పనికిమాలిన ఆలోచనలు వారిచుట్టూ పేర్చుకొని వున్నట్లు నేను కనుగొన్నాను. నేను వారిని శుభ్రపరుస్తూవుంటే, వారు తిరిగీ మలినాలను రుద్దుకుంటూవుంటే, నాశ్రమకు ఫలితమే మున్నది? వారు వారి క్రమమైనసాధనతో ముందుకుసాగుతూవుంటే నేను ప్రసాదించే వెలుగును అడ్డుకునే అవాంఛనీయ మబ్బునైనను కనీసం వారు తొలగించుకుంటారు.

 శిక్షకుడు శరీరం వదలినతర్వాత శిష్యునకుకలుగు ప్రయోజనం మరొక టున్నది. అదేమంటే, శిష్యుడు స్వచ్ఛమైన దైవీయప్రసారన్ని పొందుతాడు. శిక్షకుడుసైతం అటువంటి స్వచ్ఛమైన దైవీయప్రసారం చేస్తున్నట్లు శరీరం విడచిన తర్వాతనే గమనించగలడు. ఈవిషయంలో ఒకటిరెండు అంశాలు ఇంకనూ చెప్పవలసినవున్నవి, గానీ అవి మాటల కందని అంశములు. నేను నాకథనే చెబుతాను వినండి. మా గురువర్యులు శరీరంవదలినతర్వాత యిప్పుడు నేనున్న స్థితికి తీసుకొని వచ్చుటకు 12 సంవత్సరముల దీర్ఘ కాలము పట్టినది. అప్పటికీ ఆయన సందేశమిస్తూ, నేను యింకనూ కొంత సమయం తీసుకుందా మనుకున్నాను. కానీ యింకఆలస్యం చేస్తే, నీవు యెవ్వరికీ శిక్షణయివ్వలేని దశకు చేరుకుంటావని తెలిసి తొందరపడవలసి వచ్చిందన్నారు. నాకు తెలిసినంత వరకూ చెబుతున్నాను. అసలువిషయమే  మంటే, నేను శూన్యానికే శూన్యమైన స్థితిలోనికి పోవడం అప్పుడు ప్రారంభ మైంది. అందువల్ల నేను అనుభవరీత్యా శూన్యమైపొతున్నాను. ఇకనేను ఆస్థితిదాటి అవతలిస్థితిలోనికి ప్రవేశిస్తే, శూన్యానికేశూన్యస్థితినిసైతం మరచిపోయేట్లై, భౌతికశరీరంలోని ప్రాణంజారిపోయేది (ప్రాణం పోయేది).

 నాఅనారోగ్యము మరియు దేహత్యగమువల్ల నాసహచరులకు కలిగే ప్రయోజనం మరొకటున్నది. అదికుడా చెప్పేస్తే యీ విషయం పూర్తవు తుంది .

 ఒకగురువు యీ ప్రపంచం విడచి వెళ్ళిన 150 సంవత్సరములకు తన ఉత్తరాధికారిని నియమించినట్లు నేను కనుగొన్నాను (మైనే దేఖా కి ఎక్ గురు నే అపనీ దునియాసే జానేకె డేడ్‍సౌవర్ష్ బాద్ అపనే ప్రతినిధి కాయం కియా)

 నా అనారోగ్యము మరియు దేహత్యాగానంతరము నాసహచరులకు కలుగు అనేక ప్రయోజనములతోపాటు మరొకటికూడా చెప్పదలచు కున్నాను. శిక్షకుడు మహోన్నతశక్తిమంతుడైనప్పుడు, అతని ఉత్తరాధి కారుని నియమించవలసి యున్నది. అయితే తన భౌతికదేహత్యాగ సమయానికి తనశిష్యులలో తగినవాడొక్కడూ లేనట్లైన, అతడువేచి యుండక తప్పదు. గురువు తను యీప్రపంచము విడచివెళ్ళిన తరువాతనే తన ఉత్తరధికారిని నియమించిన సంఘటనలూ నేను గమనించాను. వివేకానందస్వామి వారి మహాసమాధి తరువాత తనప్రతినిధిని నియమించడానికి చాలాకాలమే పట్టింది. తను తగినవాడకున్న వ్యక్తి తనసంస్థలో దొరకనప్పుడు, మరోసంస్థతో సంబంధమేర్పరచుకొని అక్కడనుండి తనప్రతినిధినెన్నుకోవలసి వచ్చింది. వాస్తవానికి నియమింపబడ్డ ప్రతినిధి, గురువు (నిజమైన గురువు) జీవితములో సంపాదించిన శక్తినంతటినీ గ్రహించగలిగిన సమర్థుడైయుండాలి. ఒకవేళ అట్టివాడు సమయానికి లభించని పక్షంలో గురువు ఆశక్తినంతటిని ఒకచోట భద్రపరచివుంచుతాడు. ఇప్పుడు దీనర్థమేమంటే, శిష్యులు తమగురువు జీవించివుండగనే, సమర్థులై వుంటే వారిలో ఒకరిని గురువు తనప్రతినిధిగా యెన్నుకుంటారు. నావిషయానికొస్తే నేను నాదినచర్య పుస్తకంలో, నన్నుగురించి వ్రాసిపెట్టాను. లాలాజీవారు మహాసమాధియైన తరువాత ఒకేసారి నా బాహ్యాంతరాలలో సంపూర్ణశక్తి నిండిపోతున్నట్లు అనుభూతిచెందాను. అదినాకు బదిలీచేయబడిన శక్తియని గ్రహించాను. ఆతర్వాతనే మాగురువర్యుల దేహత్యాగవార్త నాకందింది. ఆశక్తిని నేను భరించడంలో నా నాడీమండలవ్యవస్ఠ చెదిరిపోయింది. తీవ్రమైన అనారోగ్యంతరువాత నానరములన్నీ సర్దుకొని కొంత శాంతించిన తరువాత ఆశక్తి నాలోయిమిడిపోయింది. ఆయన సంపాదించినశక్తి మొత్తం నాలోవున్నది. నేనేదైతో సంపాదించానో అదికూడా నాలోవున్నది. మాగురువర్యులనుండి గ్రహించినదానికి నేనెటువంటి చేర్పులు తీసివేతలు చేయలేదు. ఇప్పుడు నాతదనంతరం యిదంతా మరోచోటికి బదిలీ చేయ వలసి యున్నది. ఈపనిచేయుటకు నేనెంతో ఆతృతతోవు న్నాను.  అయితే ఒక్క అభ్యాసికూడా సంపూర్ణముగా యీశక్తిని భరించగల స్థితిలోలేడు. కారణం వారు ఆస్థితివరకు వచ్చుటకు ప్రయత్నమే చేయుటలేదు. బహుశా నేనుకూడా సంవత్సరములతరబడి యోగ్యునికొఱకు నిరీక్షించవలసి యుండునేమో!

 గురువు సంపాదించినదంతయూ, అతని ప్రతినిధిలోనికి ప్రవేసించును. అతనిద్వార దీక్షగైకొన్న అభ్యాసు లందరికీ వారివారివాటా వారికి సంప్రాప్త మౌతుంది. ప్రతినిధి శక్తియొక్క నిలువ స్థానం (నిధి) అయివుంటూ, తన గురువుతో తప్పనిసరిగా అనుబంధం కలిగియుంటాడు. ఆవిధంగా అత్యవసరమై గురువుగారితో అనుబంధింపబడియుండి, గురువుగారి ఆజ్ఞలను పాటిస్తూ, గురుకార్యమును నిర్వర్తిస్తూ వుంటాడు. ఇతరులు కూడా గురువుగారిఆజ్ఞలను పాటిస్తూవుంటారు. ఇతరశిష్యులు తగినంత అభివృద్ధి సాధించినట్లైన, వారుకూడా గురువునుండి సూచనలు పొందుతూ వుంటారు. ప్రతినిధిసాధించిన స్థాయిని యితరసహచరులుసైతం అందు కుంటారు. ఉన్నతేడాఅంతా, ప్రతినిధి గురువర్యులశక్తికి కేంద్రమై యుండి, గురువర్యులే ప్రతినిధిలో ఐక్యమై వుంటారు.             

   గురువర్యుల భౌతికశరీరం వీడినతర్వాత కలుగు ప్రయోజనాలు తెలియ జేసితిని. గురుపదవిని గురించి ప్రజలేమనుకుంటున్నారు యెలాఅర్థంచేసు కుంటున్నారో దేవుడెరుగు. నిజమైన గురువుయొక్క ఉనికి మైనపు వొత్తివలె దహించుకపోతూ, అందరికి వెలుగునిచ్చుట వంటిది. వెలుగువల్ల ప్రయోజనంపొందేవారు వారి స్వప్రయోజనమే చూసుకుంటారు. ఎక్కడ యెప్పుడు యెవరు ఆవెలుగుకాధారమై కాలుతున్న వత్తియొక్క సంరక్షణా బాధ్యత నిర్ణయిస్తారు. నావిషయంలో నిర్ణయం, నేను మొదటిసారి మా గురువును కలవకమునుపే తీసుకొనబడింది. యీవిషయానికి సంబందించిన జ్ఞానం బయల్పడనీ బయల్పడకపోనీ, ఎప్పుడు యెవరికి యీబాధ్యత అప్పజెప్పబడిందో ఆభగవంతునకెరుక. ఆధ్యాత్మికరంగ సాంప్రదాయం యిలాగే వుంటుంది. తనుదహించుకపోతూ, వెలుగులు విరజిమ్మడంగాక ఆదీపానికి వేరేపనేముంటుంది? ఆరిపోయిన మంటలో పడి ఆత్మాహుతిచేసుకోగల శలభమువంటివారు చాలా చాలా అరుదుగా వుంటారు. నావిషయానికొస్తే, నేను మాగురువు దయతో చూపిన మార్గంలో పయనించుచున్నప్పుడు, ఆధారపడటానికి ఆయనొక్కరే నాకు కనిపించారు. ఆతర్వాత జనులు రావడంమొదలై యాత్ర మున్ముందుకు సాగిపోయింది.

 లాలాజీ వాత్సల్యానికి అవధులేలేవు. ఆయన చాలాముందుగానే నా ప్రతినిధిని నియమించారు. లాలాజీ చేపట్టిన కార్యములన్నింటిలో నాకు పూర్తిస్వాతంత్ర్యమున్నా, యిప్పటివరకు నాప్రతినిధి (ఉత్తరధికారి) యెవరో నాకు లియదు. నాఉత్తరాధికారి యొక్క ఉత్తరాధికారిని నన్ను తయారు చేయమని సెలవిచ్చారు. లాలాజీవంటి సాటిలేని గురువు లభించడం యెవరి కైనా అది అదృష్టమే. నేనందుకే ఆయనంతటి మహోన్నత శిక్షకులు గా తయారవ్వాలని పదేపదే చెబుతుంటాను. ఈవిషయంలో నన్ను ఉదాహరణగా గైకొనడం మీకు అత్యంత ఉపయోగకరంగా వుంటుంది.

 (ఇది ప్రచురించని బాబూజీ ఉత్తరాలనుండి గ్రహించి ఆంగ్లంలో డా:సూర్యప్రసాద్ శ్రీవాత్సవగారి డివైన్ మెసేజెస్ అను పుస్తకములో ముద్రించబడినది)     

Monday, 15 April 2024

అభావము - ఆభావాతీతము

 

అభావము - ఆభావాతీతము

మనము భగవంతుడననేమియో, బహుకాలమునుండి యోచించు చుంటిమి. కొందరు భగవంతుదు లేడందురు. ఇది నాస్తికవాదన. భగవంతుడు లేడను వాదన. నేను భగవంతుదు లేడంటే, అది సరియైన దనే నాభావన. ఎందుకంటే దీనివెనుక సత్యతత్త్వము దాగున్నది. మనమెప్పుడు "లేదు" అంటామో, ఉన్నదన్నభావన దానివెనుకే వుంటుంది. అది సత్య తత్త్వభావనౌతుంది. ఒకవేళ "ఉన్నది" అంటే దానివెనుకే "లేదు’ అన్నభావన వుంటుంది. అటువంటప్పుడు లేదనేవారు సరియైన ఆలోచన లోనే వున్నట్లు సాధారణముగా నీవు నిర్ధారణకు వత్తువు. మనం లేదన గానే ఆఆలోచన నుండి అవతలకు దుమికి సత్యతత్త్వన్ని అందుకుంటాము. "లే" మరియు "దు" అను రెండక్షరములు కలిసి అభావాభిప్రాయానికి వత్తుము.లేదు లేక లేడు అన్నపదం ఉత్పన్నంచేసిన ప్రకంపనలతో మనం అభావమైపోతాము. అభావమైపోతే సత్యతత్త్వం మన ముందుంటుంది. అందులో యేవిధమైన స్థితివుండదు. లేడుఅన్న పదప్రకంపనలలో, మనం లీనమైనప్పటికి తత్సంబంధమైన చర్య యొక్క ప్రకంపనల ఆనుభూతి యేమాత్రముండదు. అది అభావస్థాయి యొక్క రెండవస్థితి. మూడవ స్థాయిని నేను వివరింప గలను. కానీ నావివరణ యెంత స్పష్టముగా నున్నను, జనులు దూరముగా పారిపోవుదురు. కనుక చర్చించ దలచుకోలేదు.

 అభావమై పోవుటెట్లు? నేటిగురువుల వలెనేను నాలుగడుగులు ముందుకేసినట్లైన మీకుబాగా అర్థమై యుండెడిది. నేటిగురువులు దీక్షనిచ్చేసమయంలో వారుకొన్ని పాత్రలు వస్త్రములు అధమంలో అధమం ఒకరూపాయి దక్షిణైనా సమర్పించమంటారు. చదువుకున్నవారు యీ కారణంగ ఆగురువులను తిరస్కరిస్తారు. మీకున్నదంతా నాకిచ్చేయండి అని నేనడిగితే, నన్నుమాత్రమెందుకు తిరస్కరించరు? జనులునన్ను గజదొం గ యని అనుకోకుండ వుండగలరా? నన్నునేను సమర్థించుకొనుటకు, నాఆలోచనను కొద్దిగా మార్చుకొని కొన్నిసార్లు "మీరందరు కలసి నన్ను దోచుకపొండి"అంటాను. ఇచ్చిపుచ్చుకోవడం దీపిడీ కాదగదా? నేను మీకున్నది దోచేసి, నావద్ద కలదంతయు అదేవిధంగా మీరూ దోచుకపొండి అనినేనంటే, నామీద నమ్మకం గలవారు యేవిధమైన అడ్డంకి చెప్పరను కుంటాను. ఇప్పుడు కొంత ముందుకెళితే తెలుస్తుంది. నేనుమీకున్నది దోచేసి దానికి బదులుగా మీరునన్ను దోచుకోండి అనడంవల్ల, నష్టానికి యెవరొప్పుకుంటారు? బహుశా యిందులో మీరే నష్టపొతారు. ఎందు కంటె, నేనిప్పటికే మాగురువర్యులచే దోచేయబడ్డాను. అటువంటప్పుడు మీరెవరిని దోచుకున్నారు? అనినన్నడగవచ్చు. ఇప్పటికే మీకర్థమయిందను కుంటాను. మీరునన్ను దోచుకుంటే మీరు చాలామందివ్యక్తుల (నేను దోచుకున్న అనేకుల) సంపదకు అధిపతులౌతారు. కానీ నేను తొలి పందెంలోనే ఓడిపోయాను. దోచుకున్నదంతా నన్నుగెలిచిన ఆయన (దైవాని) దైపోయింది. అటువంటప్పుడు యీ యిచ్చిపుచ్చుకోవడంలో మీకు లభించేదేముంటుంది, శూన్యం,సున్నా.

 జీవులందరికి "పూజ" జీవితంలో ఒకభాగం. అంతేగాదు, అది వారివిధి. వారు ఆస్థాయి దాటి, అటువంటిదే మరొక విధి (కర్తవ్యం) నిర్వహింపవలసి వస్తే, అంటే మరోమాటలోచెప్పాలంటే, సాధారణంగ ప్రకృతి యేదోఒక పనిలో జీవులను (మనుషులను) నిమగ్నంచేస్తుంది. ప్రపంచం తగుస్థాయికి చేరుకున్నట్లైతే, ప్రకృతి నిస్తేజ మౌతుంది. ఆత్మచలనము వలన చైతన్యము నిత్యమై సంరక్షింపబడుతూ సమత కొనసాగింపబడుతుంది. మనిషి ప్రకృతివలెనే, ప్రకృతితోపాటే నిస్తేజమైతే, అప్పుడతడు జనులకొఱకు చైతన్యాన్ని ఉత్పన్నంచేస్తాడు. అతడు ప్రకృతి యొక్క యంత్రమై పనిచేస్తాడు. ప్రకృతిలో అతడు, తగుస్థానంలో యిమిడిపోతాడు. ప్రకృతిశక్తి కొంతవరకు యిట్టి యంత్రములపై (ప్రకృతి కార్య నివాహకులపై) పనిచేస్తుంది, ఆశక్తి, వ్యక్తి సంపాదించిన స్థాయి కనుగుణంగా వుంటుంది. ఆస్థాయి అతని కెక్కడనుండి సంప్రాప్తమైనది, యెలా ఉత్పన్నమైనది? ఈస్థాయి అతని సక్రమ కార్యనిర్వహణకనుగుణంగా లభిస్తుంది. అతని అలవాట్లలోని మితత్వము (సమన్వయము) వలన కలుగుతుంది. మళ్ళీయిది ప్రకృతి నియమముల సక్రమానుసరణవల్ల కొనసాగుతుంది. ఎవరైతే ప్రకృతి నియమాలను చక్కగా పాటిస్తారో, వారికి ప్రబలమైన సహాయ మందుతుంది. ఈప్రకృతినియమాలు యెచట యేర్పడతాయో ఆ హద్దు వరకు చేరిన తర్వాత కేంద్రమునుండి తగినంత సహాయం అందుతుంది. ప్రకృతినియమాలను చక్కగా అనుసరించితేనే, అతడు ధర్మబద్ధంగా యేర్పరుపబడియున్న ఒకరేఖ  ఆధారంగా కాస్తా అటూయిటూ పైకిక్రిందికి అతడు కదులుతూవుంటాడు.   

 కనుక మనమందరం ప్రకృతికి సమాంతరంగా పయనించవలసి వుంటుంది. తద్వార ప్రకృతిసహాయం పొందగలుగుదుము. లేదా పురోగతి కొఱకు మనం అనుసరిస్తున్న మార్గంలో ప్రకృతి సహాయం పొందియున్న మహ నీయుని సహాయం పొందవలసి యున్నది.

   నీవు తెలియజేసినదాన్నిబట్టి గమనిస్తే, నీవునా యెడబాటును సహించలేక పోతున్నట్లు తెలియుచున్నది. బహుశా నీవునా శరీరానికిమాత్రమే దూర మయ్యావు. నీ అంతర్గతంగా లోలోతులకువెళ్ళి గమనిస్తే అంతటా నేనే కనబడతాను. కాస్త ఆలోచిస్తే నీహృదయమందే నన్ను నీవు దర్శింపగలవు. ఇప్పటి నీజీవితంలో సరైన జీవనవిధాననికి కట్టుబడితేచాలు నీవిపరీత స్వప్రాంతచింత వదలిపోతుంది. అలాకాకపోతే, నేను సదా నీవెంటనున్నా నన్న తలంపుతో నీవు కొనసాగితే, చాలావరకు నీసమస్య తొలగిపోతుంది. నేను దక్షిణ భారతానికి పయనమై వెళ్ళినరోజులు జ్ఞాపకానికి వస్తున్నాయి. అప్పుడు మాగురువర్యులు యెల్లవేళలా నాతో మాట్లాడుతున్న నాసహచరుల వలె నాలోనే వున్నాడన్న తలంపుతో వుండిపోయాను. ఆయన బాహ్య రూపాన్ని చూడలేకపోయినా నేనొక అంధునివలె నున్నాననిపించింది. అంధుడు తనసహచరుని రూపంచూడలేడుగాని, అతడు తన సహచరునితో పరస్పరం మాట్లాడుకుంటూ సమయం గడపగలడు. నీవు పరిపూర్ణస్థాయికి యింకనూ చేరలేదు గనుక కనీసం నేను నీదగ్గరేవున్నానన్న భావనతోనైనా వుండు. భగవంతుడు నీకనుకూలుడై యుండుగాక! నీకు ఆధ్యాత్మిక పురోగతి కలుగజేసి, ప్రస్తుతం నేనున్న స్థితినిసైతం అధిగమించి మున్ముందుకునీ ఆధ్యాత్మిక ప్రయాణం సాగుగాక.

 (శ్రీరాంచంద్రజీ వారు ఒక అభ్యాసికి వ్రాసిన లేఖయొక్క సారాంశమిది. డా:శ్రీవాత్సవగారి "డివైన్ మెసేజెస్" అను పుస్తకమునుండి గ్రహింప బడినది)  

Monday, 25 March 2024

నాకార్యము – నావిధానము

 

నాకార్యము – నావిధానము

                                                             రచన:-పూజ్యశ్రీ రామచంద్రజీ మహరాజ్ , షాహజాన్ పూర్  

 నేనేమంత గొప్ప అనుభవముగల వాడినికాను. నాకేమీ తెలియదన్నదే నాకు తెలిసిన విషయము. నేను నాస్వంతపుస్తకము మాత్రమే చదివితిని. అందులో జ్ఞానము అడుగంటి యున్నది. నేను గ్రుడ్డిగా ముందుకుసాగితిని. నేనేమిచేయువున్నానో, ఏదారిన తిరుగాడు చున్నానో కూడా నాకుతెలియదు. నేను మీకోసం యిప్పుడు సూచించినంత మాత్రంకూడా  నాధ్యేంపై నాకవగాహనలేదు. నాదృష్టి కేవలం ఆపవిత్రమూర్తిపై మాత్రమే నిలచియుండినది. ఆయనకే నాహృదయమర్పించితిని. నా దృక్పదంలో వేరొక ప్రయోజనమే లేక ఆయనకే నన్ను నేనర్పిపించుకొంటిని. ఇప్పటికీ నాస్థితి అలాగేవున్నది. కానీ ఒకచిన్న వ్యత్యాసమున్నది. అదేమంటే, అప్పటి విచక్షణకూడా యిప్పుడు లేదు.

 అంధుడు యేమీ చూడలేడు. నేనూ అంధుడనై, యేఅనుభూతిగానీ, చూడాల్సిందిగానీ లేకుండా పోతుంది. చూడకూడని వాటిని చూడకుండా వుండటానికి భక్తసూరదాసు తనకళ్ళను పొడిచేసు కున్నాడు. నేను నాదృష్టినంతా ఆయనవైపునకే మరల్చాను. తద్వారా ప్రాపంచిక విషయభారము నాహృదయముపై పడలేదు.

 మనము (మానవులము) యెక్కడున్నామో, అక్కడనుండి యేవిధమైన జ్ఞానము మనకు లభ్యముగాదు. కడకు అక్కడ మనల్నిగురించి కూడా మనకేమీతెలియదు. మరోవిధంగా చెప్పాలంటే, ఆ స్థంభించిపోయినస్థితి లేక చైతన్యరహితస్థితి సహజంగానే మనలో వుంది. అయితే ఆస్థితి సంపూర్ణసమత్వంలో లేశమైనా మన మనసునకనిపించియుంటే, లేక అనుభవమునకు వచ్చియుండియుంటే, అర్థమైయుండేది. దీని తర్వాతే ప్రతిదీ ఉనిలోనికి వచ్చినది. ఈగమ్యం మనంచేరడానికి మనలో వినమ్రత నెలకొనాలి. ఆ వినమ్రతకూడా మనయెఱుకలో లేకుండా పోవాలి. మనము గొప్పతనానందుకోవాలి, కానీ అదేమిటో కూడా మనకసలే తెలియకుండా వుండాలి. మనకైమనం గొప్పతనాన్ని సాధించి, గొప్పవారనుకుంటే, ఆ ఆలోచనే మనదారిలో అడ్డంకియైనిలచి మనల్ని ముందుకు సాగనివ్వదు. ఎవరుకూడా తనకైతాను యెవరికంటెను, యేవిధంగాను, దేనిలోనూ, యెప్పుడూ గొప్పవాడినని భావింప రాదు. ఈమహద్వాక్యం గమనించండి. "ఏలోపం లేని లోపమసలే వుండదు". ఈ వాక్య మర్థమవ్వడానికి, కొంతవరకు సహాయపడు మరోమాట చెబుతాను, గమనించండి. "నాస్థితి నాకుతెలియదుగానీ, ఒక్కోసారి నాకానందంగానూ, మరోసారి బాధగానూ వుంటుంది. అప్పుడు నేను నిద్రలో కలగన్నబిడ్డవలె యేడుస్తాను లేదా నవ్వేస్తాను.

 ఇతరులకు శిక్షణనిచువారు, అందుకుతగిన స్థాయివరకు చేరకుండానే శిక్షణ నిచ్చినట్లైన, అది వారిపతనానికి దారితీయును. ప్రశిక్షకునికి అనుమతినిచ్చేముందు, అతని హృదయములో నేను ప్రశిక్షకుడను, అధికుడను అనుభారము హృదయముపై వుండరాదు. ఈస్థితి అతడు తన అహాన్ని జయించినపుడు కలుగుతుంది. భగవంతుని ఆజ్ఞలను అమలుజరుపుట తప్ప, యితర మేమియు అతనికవసరమై వుండదు. అతనికి మంచి చెడు, తనవారు పరాయివారు అన్నతేడా వుండనే వుండదు. ఆజ్ఞ అంటేఆజ్ఞ అనునట్లతడు వ్యవహరించును.    

 గురుదేవులకార్యము ఆగదు. ఆధ్యాత్మిక‍ఉద్యమం సంపూర్నస్థయిలో ముందుకు సాగిపోనున్నది. తనుచేరిన యేఆద్యాత్మిక స్థాయితోనూ సంతృప్తిచెందక పురోగమింపవలెను. ఇకచాలుఅన్న భావనను విసరి కుక్కలకు పడవేయవలెను. నేనునాజీవితకాలములో యెప్పుడు సంతృప్తి చెందలేదని మా గురువర్యులు చెప్పిరి. ఆతర్వాత అత్యున్నతస్థాయి చీకటిలో మున్ముందుకు యీదుట తటస్థించినది. వాస్తవానికి యెవ్వరుకూడ అనంతమైన ఆద్యాత్మిక సాగరాన్ని యీది దాటజాలరు. ఇది మహోన్నతస్థాయి ఆత్మలస్థితి. ఇక‍అల్పుల విషయం చెప్పవలసిన పనిలేదు.                                                 

    "పచ్చిగానున్నది పరిపక్వతజెందాలంటే ప్రయాణం చాలాకాలం సాగాల్సిందే"’

 అంతర్గతశక్తి నుపయోగించి సమస్తదోషములను నిర్మూలించవచ్చును. మనిషి తనలోని కొన్నిదోషములను నిర్మూలింపదలచియూ నిర్మూలింప వీలుకాలేదన్నమాట వుండదు. ఒకపురాతన వాక్యం యిట్లున్నది "మనిషికి ధైర్యముంటె భగవంతుని సహాయం వుండనే వుంటుంది". నాకు ఓడజను సార్లకంటె యెక్కువసార్లు మాగురుదేవులను భౌతికంగా కలవడానికి వీలుపడలేదు. కానీ నాఆలోచననుండి ఆయన దూరమైన సంఘటన నా మనస్సుకెప్పుడు కలుగలేదు. నాకుతెలిసి యెల్లప్పుడు ఆయనకు సన్నిహితంగానేవున్నాను. ఆయనకు నచ్చనిపని నావల్ల జరుగుతుందేమోనని భయపడుతూవుండేవాడిని. ఎల్లవేళల నాగురువర్యుల చింతన నాలో వుండటమనేది, సంపూర్ణవిస్వాసముతో గూడివుండేది. నాజీవితభవిష్యత్తు నిర్మాణమునకు యీఅంశములు స్థితులు సహాయకారులైనవి. నేనొక విధానమును మీకుచెబుతాను, అదేమంటే మీకునచ్చనిదేదైనా సంభవిస్తే, అది నాకు వెంటనే తెలియజేయండి , లేదా అదినాదేననుకొనండి. లేదా ఒరోవిధంగా చెప్పాలంటే, అదినా తప్పుగానో లేక లోపంగానోభావించండి. ఈవిధానం చాలాసులువైనది, ప్రతిభావంతమైనది. ఈవిధానం నాసోదర‍అభ్యాసి గురువునెడ తగదని, అమర్యాదకరమని, అసంబద్ధమైనదని వాదించెను. నేను నానీతిని, సద్గుణాలను నాగురుదేవులకు సంబంధంలేకుండా నావేనని తలచి, లేక నాగురువు సంపూర్ణుడుకాదని తలచినట్లైన, నీవుచెప్పినది సబబేనని నేను సమాధాన మిచ్చితిని.

 ఏవిధంగానైనా సరే, ఒకరికొకరం సహాయంచేసుకోవడం మనవిధి. మనుషులు ఒకరికొకరు సహకరించడమంటే, ఒకజీవిలోని వివిధ‍అంగములు పనిజేసినట్లే యగును. వారు ఒకరిపై ఒకరు ఆధారపడియుందురు. నేను హృదయపూర్వకముగా అందరిబాగుకోసం ప్రార్థిస్తున్నాను. మాటసాయంచేస్తాను. ఇంకా అవసరమైతే, అందరికీ తెలిసేటట్ట్లు సహాయపడతాను. ఆధ్యాత్మికస్థితియన్నది సహజంగా హృదయాధారితమైనది. అది భగవంతునిసృష్టిలోని జీవులందరి మేలునకు క్షేమమునకై యున్నది. సరియైనప్రార్థనలో ప్రార్థిస్తున్నానన్న యెఱుకవుండదు. ప్రార్థినామయస్థితి నిరంతరం కొనసాగుతూనే వుంటుంది. ఎఱుకేవుంటే, అందులో అహంకారానికి ఆహుతైపోయే ఆశీర్వాదాంశం వుంటుంది. అంటే నేను దీవించే వాడిని అనే అహం వుంటుంది. ఒకవేళ దీవించు లేక ప్రార్దించువారు కోరినట్లు జరిగిందంటే, ఆప్రార్థించువారు లేక దీవించువారు తమనితాము ప్రత్యేకమైన పూజనీయులమని, యెన్ను కొనబడిన ఘనులమని తలంతురు. ఇక్కడకూడ ఉద్దేశ్యం మంచిదైతే అవశ్యంగా వచ్చేహాని యేమీవుండదు, అసలిట్టిచోట్లన్నిట హృదయమే ప్రాధాన్యత వహించి, అదే గణింపబడుతుంది.

 తనకైతాను ఉత్తమస్థాయి కెదగాలనుకోవడం, యిప్పటి అవసరం. దేనికే గట్టిగా కట్టుబడి వుండాలి. అప్పుడు గమనించి చూడండి, యేమిజరుగుతుందో. అహో! ఇది హిందువులలో అంతర్గతంగా వున్నదే. అయినా వారు యీవిషయం అర్థంచేసుకోలేకపోతున్నారు. కారణం, తెసుకోవడానికి వారికి తీరికాలేదు, తెలుసుకోవాలనే కుతూహలమూలేదు. ముస్లింల ఆలోచన, నమ్మకం ప్రకారం మహమ్మదుప్రవక్త విచారణదినంనాడు నమ్మినవారిని స్వర్గంవెళ్ళుటకు, కానుకగా సిఫారసుచేస్తాడు. వాస్తవానికి విచారణదినం గడచిన తర్వాత అనుగ్రహించబడే స్వర్గంఅనేది అసలుందో లేదో కూడా తెలియదు. 

ఆధ్యాత్మికరంగమునకు వైవిద్యము విషము. మహోన్నతమైనది (దైవం) కలదను భావనకలిగి యుండి కూడా గొప్పవారమనుకుంటే, యిక ప్రేమ విరాజమానంకాదు. అలా కాకుండా మనల్నిమనం అల్పులమనుకుంటే, మన హృదయం ఉన్నతుని సేవించడానికి ఒప్పుకుంటుంది. ఇది శుభకరమైనది. ఒక సాధుపుంగవుడు సెలవిచ్చినట్లు "ఒకవేళ తననుతాను మరొకరికంటే గొప్పవాడననుకొని యితరులను, తక్కువ, హీనులు అనుకుంటే, అతడు తానున్న స్థితినుండి క్రిందకుపడిపోవును . మనము కులమునుబట్టి అంచనావేసి గౌరవించు పద్దతిలో నున్నాము. అన్నికులములు ఒకపెట్టెలోని అరలవంటివి. అవసరమొచ్చినపుడు, పెట్టెనుతెమ్మంటాముగాని అందులోని అరలనుతెమ్మనము. అన్నితెగలు పనివాని చేతిపనులే. కులములన్ని సంఘము యొక్క అనుకూలతకోసం యేర్పడినవే. నీవుపెట్టెను తెరిస్తే, అందులో అరలలోని వస్తువులన్నీ ఒకదానితో మరొకటి సంబంధం గలిగేవుంటాయి. అవికొన్ని చెక్కవైతే, మరికొన్ని ఉక్కు లేక యినుమువై వుంటాయి. కబీరుమహనీయుడు యిలా చక్కగా సెలవిచ్చారు. "అల్పులందరు పవిత్రసాధువుల  పాదములనాశ్రయించి, మోక్షముపొందగా, కులమురీత్యా ఘనుల మను కొన్నవారు, గర్వముతో పతనమై పోయారు.

 కులమనేవేరువద్ద ప్రకృతి గొడ్డలినుంచింది. కాలక్రమంలో కులం తప్పక సమసిపోయుంది.

 మీచూపును అంతరంగంవైపునకు మరల్చండి. మీముందున్న యీప్రపంచం నాది. కనుక మీరు స్వేచ్ఛను అనుభవించండి. నాస్వర్గం యితరులకొఱకు వదలివేశాను. ఇతరులకష్టములు, వేదనలను నావిగా గ్రహిస్తున్నాను. నేనునామోక్షన్ని గురించి పట్టించుకోవడంలేదు. నావద్ద ఒకతెల్లని, మరొకనల్లని పత్రము వున్నవి. నల్లనిదంటే, యితరుల కష్టములు వ్యధలు. నేను వారి శిక్షకునిగా వ్యవహరిస్తున్నాను గనుక ఆనలుపును నేనుపులుముకున్నాను. మీవ్యధలు, బాధలుఅనే పొరలను తొలగించుకోండి. వాటిని నన్ను భరించనీయండి. అవన్నీ నానల్ల పత్రమునకు జమచేయండి, మీరు తెల్లనిపత్రమే స్వీకరించండి.

 గురువర్యుల కార్యము నిరంతరంగా, యేఅడ్డంకులులేకుండా కొనసాగాలి. నాప్రియతములు ఆయన విధానమును పాటించడముద్వారా ఆయన కార్యక్రమములో పాల్గొనండి. ఆయనచూపిన మార్గము సయైనది. అది మాత్రమే మోక్షము, ఆపైపైస్థితులన్నిటిని మీక.నుగ్రహించగలదు         

  (S.P శ్రీవాత్సవగారి డివైన్ మెసేజెస్ అను పుస్తకమునుండి గ్రహించి, ఆంగ్లమునుండి తెలుగునకు అణువదించడమైనది )    

 

 

పూజ్యలాలాజీ మరియు మన ఆధ్యాత్మికప్రగతి

  పూజ్యలాలాజీ మరియు మన ఆధ్యాత్మికప్రగతి సోదరీసోదరులమైన మనమంతా యిక్కడ యీదినం (ఫిబ్రరవరి 14/ బుధవారం 2024) మన ఆదిగురువులైన పూజ్యలాలాజీవారి 1...