Sunday, 21 April 2024

ఇది-అది

 

ఇది-అది

వాస్తవానికి మనశరీరము , ప్రాపంచికవస్తు సముదాతము, యిదంతా "ఇది" యని,ఆత్మ ,సత్యతత్త్వ సారాశమును "ఆది" యని అనవచ్చును. ఈ"అది", "ఇది"చేతకప్పబడుతూ, ఒకపద్దతిప్రకారం ఒకటితో మొదలై పెక్కుపొరలుగా చుట్టివేస్తూ వెనక్కు నెట్టబడుతూ, ఇప్పటి పరిస్థికి వచ్చినది. నిజమైనప్రయాణం ,"అది"గా వున్న టువంటిది తనచుట్టూ చుట్టుకపోయిన "ఇది" యనెడిపొరలను ఒకటొకటిగా ఛేదించుకుంటూ, తిరిగి తన తొల్లింటి "అది" స్థితికి చేరడమే. అక్కడున్నది మనదైన, మన కనుకూలమైన స్వదేశనుభవమే. ఈఅనేకత్వం నుండి యేకత్వమునకు వచ్చుప్రయాణం సామాన్యముగా బహుదూరం. అయితే యీప్రయాణదూరం తగ్గిపోవా లంటే మహోన్నతుడైన గురువుపై పూర్తిగా ఆధారపడటమొక్కటే మార్గము. ఈదూరభారాలు, పెరగడం తగ్గడ మనేది యెంతకష్టమో అంతేసులభం. ఈ సమస్యకు పరిష్కారం, సత్యతత్త్వమైన ,కేంద్రము లేక మూలముతో అనుబంధమేర్పరచుకోవడమే. ఈఅనుబంధం ద్వైతభావం లేకుండ "ఇది" "అది" కి కూడా అతీతమైయుండాలి. తొలిప్రయాణం, మన సంపద ధనం ఆస్తిపాస్తులరూపంలోనున్న స్థూలపొరలతో చుట్టివేయబడియున్న అసలు సున్నా లేక శూన్యస్థితిని ప్రభువుకు నివేదించి తిరుగుప్రయాణానికి సిద్ధమవ్వటమే. అదే మనముందున్న లక్ష్యం. తొలుత అది దూరప్రయాణం. తర్వాత అదికష్టతరం. అదెలాగంటే, సూదిబెజ్జమునుండి ఒంటెను దాటించడమంత కష్టం. 

సున్నా (శూన్యం) ఒకటి కావడానికి జరిగిన ప్రయాణం విస్తరించిన వస్తుప్రపంచపు శాస్త్రవిజ్ఞానంవంటిది. అదే తిరుగుప్రయాణం,  ఒకటి సున్నా (శూన్యం) అవ్వడం, ఆధ్యాత్మిక విపులత్వానికి దర్పణం పడుతున్నది. ఈ "ఇది" "అది" కావల యేమున్నదో ఉన్నది (అనిమాత్రమే చెప్పగలుగుదుము). శూన్యమన్నది మానవుని మేధస్సు కందనిదైయున్నది.  మన ఉనికిలో యీ"ఇది" "అది" అనునవి మనజ్ఞానపరిమితికి ఒకహద్దు. "ఇది" కి సంబంధించి నేటివిజ్ఞానశాస్త్రము చాలానే ఆవిష్కరించినది. కానీ "అది" పరిపూర్ణమైనప్పటికి ,దాని అన్వేషణ అసంపూర్ణముగనే మిగిలిపోయినది. 

 "ఇది" "అది"ని సైతమధిగమించి అవిభాజ్యమైన 'ఏకంసత్”లో లీనమై పోవుటకు (మానసాధ్యమైన మహోన్నతస్థితికి జేరి మహాప్రళయ కాలమున కేంద్రములో అతిసహజంగా సులభముగా ఆత్మ తన ఉనికిని కోల్పోయి లీనమగుటకు) నిరీక్షిస్తున్న స్థితికి జేర్చుటలో దోహదకారియై సహజమార్గ విధానమున్నది. ఈవిధానము సంపూర్ణమైన వెలుగులోనికివచ్చుటకు ప్రతియొక్కరి సహాయసహకారములవసరమై యున్నవి. "ఇది" "అది" కి మధ్య సమతనుసాధించడమే ప్రతియొక్కరి వ్యక్తిగత సంస్యలపరిష్కారము నకు గల యేకైక మార్గము. సంస్థసక్రమ పూరోగతికిగాని ఉన్నత మానవత్వ విలువలకుగానీ మూలమదియే. ఇదే సహజమార్గ సందేశము.

 వందలాది మానవత్వపు సంస్కృతీవిలువల పరిరక్షించు ఆశయమును, నెర వేర్చు హామీతో దేశకాలపరిమితుల కతీతముగా హద్దులు, అవరోధముల నధిగమించి, సహజమార్గవిధానము వచ్చినది. సహజమార్గ ఆవిష్కర్త (శ్రీ రామచంద్ర, షాజహాన్ పూర్ వారి ) కృప, వ్యక్తిత్వపుపరిధులను దాటి, నిత్య సత్య మూలకారణమై, ప్రతియొక్కరికీ అందుబాటులో యుండుటేగాక ఆ మహనీయుని ప్రేమించువారికీ, ఆయనను గుర్తించి, ఆయనపై ఆధార పడినవారి కందరికీ సర్వకాలసర్వావస్థలలో సన్నిహితుడై (వారి హృదయములలో వెలుగై) వారి జీవితలక్ష్యమును నెరవేర్చుటకు సంసిద్ధులై    ఉంటారు.

 (డా:శ్రీవాత్సవ గారి Divine Messages అను పుస్తకము లో ఆంగ్లములో ప్రచురించిన This And That అను పాఠమునకిది తెలుగు అనువాదము)               

 

No comments:

Post a Comment

పూజ్యలాలాజీ మరియు మన ఆధ్యాత్మికప్రగతి

  పూజ్యలాలాజీ మరియు మన ఆధ్యాత్మికప్రగతి సోదరీసోదరులమైన మనమంతా యిక్కడ యీదినం (ఫిబ్రరవరి 14/ బుధవారం 2024) మన ఆదిగురువులైన పూజ్యలాలాజీవారి 1...