రచన: డా: విజస్యకుమార్ వైకుంఠ్, గుల్బర్గా, కర్ణాటక అనువాదం : శ్రీ పోలిచర్ల సుబ్బరాయుడు, ప్రశిక్షకులు, హైదరాబాద్.
స్వార్థము
శ్రీరామచంద్రజీ మహరాజ్ షాజహాన్పూర్ వారు రచించిన దశాదేశముల వ్యాఖ్యానము అను పుస్తకములోని ఆరవ ఆదేశమిలా వున్నది. "అందరిని సోదరులుగాభావించి, వారినట్లే ఆదరింపుము".
మొత్తముమీద సత్యసంధతలో యేకమగుటకు దైవీయపిలుపుగా యీఆదేశము మన కనిపించుచున్నది. ఈవాక్యమునకు, మనము ప్రతిస్పందించినప్పటికిని, విషయమింకను, చర్చనీయాంశముగనే మిగిలియున్నది. పూజ్యగురువర్యులు అహంకార (స్వార్థ) సమస్య, దానికిగల కారణము, పరిష్కారమును గురించి వ్యాఖ్యానమున చర్చించిరి. "ఇందులో అంతర్గతముగానున్న నున్న విషయ మెవ్వరూ అర్థము చేసుకోలేదు" అన్న సూచన అర్థవంతమైనది. ఇప్పుడీ విషయమునర్థము జేసికొనుట కొక్కింత ప్రయత్నింతము.
స్వార్థం పుట్టుక
గురువుగారు ఒక వంశవృక్ష ఉదాహరణతో దీనిని వివరించిరి. ఒకేతల్లికి జన్మించిన సోదరీసోదరులందరూ, ఒకరికొకరు దగ్గరిసంబంధము కలిగియుందురు. తొలుత వారందరూ ఒకజట్టు. ఆతర్వాత వారందరూ వారివారి కుటుంబములను యేర్పాటు చేసికొందురు. వారిబిడ్డలు దాయాదులుగా బంధుత్వాన్ని కలిగియుందురు. అంతేగాని బహుదగ్గరి సంబంధము కలిగియుండరు. కాలముగడిచేకొద్దీ, మరియు కుటుంబముపెద్దదై సంఖ్యపెరిగేకొద్దీ, ఒకరికొకరు దూరమై, అన్యులైపోతారు
వంశపరంగాచూస్తే, మనందరి మూలం కొక్కటే. చూడటానికిమాత్రం ఒకరివలె మరొకరుండక, ఆకారంలోను ఒడ్డూపొడవులోనూ వేరువేరుగా వున్నాము. మరోమాటలో చెప్పాలంటే, మూలంలో ( ఉత్పత్తిస్థానంలో ) మనమంతా ఒకటేగాని, వ్యక్తిత్వమేర్పరచుకుంటూ వేరైపోతున్నాము. సోదరభావమునకు మూలమైన తొల్లింటి
పరిష్కాము
స్వార్థము, ఇచ్చట అచ్చట అన్నతేడాలేకుండా అంతట ఉండనేవున్నది. భావన విషయంలో ఒక్కొక్కరిలో ఒక్కొక రకంగా వుండవచ్చును. అయితే దీనిమూలకారణం వ్యక్తిగతఅల్లికపై ఆధారపడియున్నది. అభ్యాసి తన వ్యక్తిగత అల్లికను విచ్ఛిన్నము జేసికొన యత్నించి, నిజస్థితికిసమీపించేకొద్ది అతనిలోని సోదరభావము పొంగిపొరలును. మరోవిధంగా చెప్పాలంటే, అభ్యాసి సక్రమసాధనవల్ల, వారం వారం సత్సంగంలో పాల్గొనడంవల్ల, ఇది సుసాధ్యమగును. నిజంచెప్పాలంటే, యిది అనుభవపూర్వక మార్గదర్శకత్వ పరిణామము. వ్యాఖ్యానములో నేరుగా విషయము చర్చింపబడనప్పటికి, లోతైన సూచనచేయబడింది. సహజమార్గ బోధనలలో యీవిషయంపై నిశ్చితాభిప్రాయమైతే తెలియజేయడం జరిగింది.
వారంవారం సత్సంగము
సహజమార్గసాధనావిధానములో (శ్రీరామచద్ర మిషన్లో) వారానికొకసారైనా సత్సంగము నిర్వహించుట తప్పనిసరియై యున్నది. అందులో పాల్గొనడము సభ్యులందరి విధి. పాల్గొను అభ్యాసులందరితో గురువుగారీ సత్సంగమును నిర్వహింతురు. మార్గదర్శకములను సక్రమముగాపాటించినట్లయిన ఫలితము చాలా ప్రతిభావంతముగా నుండును.
(1) దైవీయఉనికిపై
విశ్వసము. (2) రాజయోగపద్దతిలో ఆలోచన గలిగియుండుట. (3)మస్పూర్తిగా స్వేచ్ఛగా సత్సంగమున పాల్గొనుట. (4)సభ్యత
మర్యాదగలిగి వ్యవహరించుట.
(అ) అభ్యాసి తన అంతర్గతకోశముల లో యేర్పరచుకున్న వ్యక్తిగత అల్లికల ప్రభా వమునధిగమించ గలుగును .
(ఇ ) సత్సంము యొక్క ఆరోగ్య వాతావరణము వలన పరిస్థితుల ప్రభావమున యేర్పడిన సమస్యలు సమసిపోవును లేదా వాటి తీవ్రత తగ్గిపోవును
స్వార్థచింతన, మనిషితనకైతానే యేర్పరచుకున్నాడన్న, విషయమతడెరుగడు. ఇది అతడంగీకరించకపోయినా యిదే వాస్తవం. ఇది ఒకచిత్రమైన పరిస్థితి. ఇది పతనావస్థ (దిగజారుడు స్థితి). ప్రారంభంలో అభ్యాసి, “మనందరం ఒకటి” అన్నభావన, తనమనసుకు తానే మరిమరి సూచనలిచ్చుకొనవలెను. ఇది అతడు భక్తిపరిధిలో వున్నాడని, అలానే వుండటానికి ప్రయత్నిస్తున్నాడనడానికి నిదర్శనము. ఈవిషయవివరణము వ్యక్తిగతము. ఈవిషయమును గురించి చర్చించుకొనవవచ్చును . మీఅభిప్రాయములు నాకు తెలియజేయనూ వచ్చును.