Showing posts with label సహజమార్గంలో శిక్షణావిధానము. Show all posts
Showing posts with label సహజమార్గంలో శిక్షణావిధానము. Show all posts

Friday, 17 February 2023

సహజమార్గంలో శిక్షణావిధానము

 సహజమార్గంలో శిక్షణావిధానము

                                                                                                    --- శ్రీరామచంద్రజీ

ఉనికియొక్క చైతన్యమొనర్చబడిన భాగమే జీవము. మనమెప్పుడు మనవంతు చైతన్యస్థితిని బహిర్గతమొనర్చితిమో అప్పుడే భౌతిక నికి తనపన్నులంటినీ ప్రారంభించినది. తొలుత అది దివ్యత్వముతో అధికాధికముగా అనుసంధింపబడి వుండినది. అందుండే జీవము పొడసూపినది. జీవమువృద్ధిచెంది క్రియాశీలత మొదలై దానినైజమునకణుగుణముగా మున్ముందుకుసాగి రానురానూ యిప్పటికి మనం మన సమత్వగుణం కోల్పోయి, సమతదప్పినస్థితికి చేరితిమి.


జీవమునకు అనుసంధింపబడియున్నది గనుక చైతన్యము చాలాశక్తివంతమైనది. కనుకనే దాని దురుపయోగము అప్రయోజనకరమై ప్రతికేంద్రమూ తననిజతత్వమును గోల్పోయి వైరుధ్యములను గ్రహించనారంభించినది. తత్కారణమున శరీరనిర్మాణమంతయూ మానవపరిశ్రమాలయమై, మనమంతవరకు గ్రహించినదంతయూ బహిర్గతమొనర్చ మొదలిడినది. ఈప్రక్రియ అనేక సంవత్సములు కొనసాగినది. జీవితకాలము ముగియగానే, మనము సమకూర్చుకొన్న జడత్వప్రభావమునంతయూ గైకొని మరొకదేహధారులమైతిమి. ఈవిధంగా ప్రతిపుట్టుకయందునూ జడత్వచర్యలు హెచ్చించుకొనుచూ తుదకాచర్యలే మనమైపోతిమి. ప్రతినరములకూడలీ ఒకద్రువమై వ్యతిరిక్తవాతావరణముతోకూడిన మార్పుల నుత్పాదిస్తూ పోతిమి. ఈవిధంగా మనచేష్టలు వరుసగా మిక్కుటమై మనదేహకేంద్రములు  బలపడిపోయినవి. తత్ఫలితముగా మనము ఒక్కోవిషయమున ఒక్కోరీతిగా మనకేంద్రముల యొక్క ఆజ్ఞలకు దాసులమైపొతిమి. 


మనజీవితము ఆధ్యాత్మికతనుండి దూరమునకు జరుగుతూ,కడకు జడమై పూర్తిగా చెడిపోతిమి. పరిస్థితులప్రభావముననో లేక భక్తజన సహవాసముచేతనో దివ్యత్వపుతెమ్మెర నాస్వాదించి,మనమున్న యీస్థిని తొల్లింటిస్థితితో పోల్చిచూడ నారంభించితిమి. అప్పుడు మనకింతకంటే మహత్తరస్థితులున్నవన్న విషయ మర్థమైనది. 


మనపూర్వపు వాస్తవస్థితిని తిరిగిపొందుటకు మార్గమన్వేషింప మొదలిడితిమి. తగినవ్యక్తికై వెదకితిమి. ఈఆలోచన అంతర్గతకేంద్రములను స్పృశించి తుదకది అన్నికేంద్రములలో కాననైనది. మరోమాటలో చెప్పాలంటే,మమాధ్యాత్మికతను స్పృశించినంతనే కేంద్రమునందలి మూలపదార్తముతో ఒకవిధమైన కదలికగలిగి తదైనరీతిలో ప్రతిస్పందించి, తత్ఫలితముగా నిజమైన ఆధ్యాత్మిక్కగురువు కడకు దారిచూపుతుంది. అట్లుగాక మనం తప్పుదారిపడితే, ఆధ్యత్మికముసుగులోనున్న మోసగానివైపునకు మరలుదుము. భగవత్సాక్షాత్కారముకొఱకే మనమారాటపడుచున్నట్లైన సరియైనగురువు లభించితీరును. అదృష్టవశాత్తూ మనకు సంపూర్ణమైన ఆధ్యాత్మికగురువు లభించియున్నారు. ఇకమనం మన సమతదప్పిన ఆలోచనలతో నిర్మించుకున్న ద్రువములన్నిటిని నశింపజేయు కర్తవ్యము గురువుదేయగును. అందువల్ల దూర్తవర్తనము నిలచిపోయి మనం సరైన ఆధ్యాత్మికవిధానమున పురోగమింతుము. ప్రతిదీ క్రమబద్ధమై తొల్లింటి నిజస్థితికి గొంపోవు బాధ్యత గురువుగైకొనుటద్వారా మనలో దివ్యత్వపుటెఱుక గలుగనారంభించి అదిమనవాటాగా మనకు లభించును.   


   శరణాగతి మరియు సహకారం

గురువు తనకర్తవ్యముగాభావించి స్వచ్ఛము, దివ్యమునైన తనస్థితిని అభ్యాసిలో ప్రవేశపెట్టి పురోగమింజేయును. ఆయన యీపనుకై మననుండి సహాయ సహకారములాపేక్షించి కొన్నిపద్దతులను నిర్దేశించెను. అందులో అతిముఖ్యమైనది ధ్యానము. ఈవిషయంలోకూడా ఆయన అభ్యాసికి సహాయపడును. ధ్యానమనగా మనసు యెక్కడెక్కడో తిరుగుటమాని కేంద్రముపై నుండునట్లలవాటుచేయుట. దీనికొఱకు హృదయముపై ధ్యానముచేయుటను నిర్ధారించిరి. అలా ఎందుకుచేయమనిరో మనపుస్తకములలో వ్రాయబడియున్నది.కనుక మరలాయిక్కడ నేను చెప్పదలచుకోలేదు.


నేను నిర్దేశించినట్లు అభ్యాసి హృదయముపై ధానముచేయును. అయినప్పటికినీ గురువుపై ఆధారపడు తత్వము తప్పక అభ్యాసికలిగియుండును. ఈ సక్రమమైన మార్గంలో కష్టమేదైనా వున్నదంటే, అది శరణాగతియే. అదికూడా నేరుగా గైకొనుటయందున్నది. జనులు మామూలుగా ఆలయమునకెళ్ళి అందలి విగ్రహమునకు సాగిలబడి శరణుజొచ్చితిమని మాటలలో పలుకుచుందురు. ఇది శణాగతి కానేకాదు. పులివెంటబడగా ఒకబాలుడు పరుగెత్తి తల్లిఒడిచేరినట్లున్నది. తల్లి అతనిని పులిబారినుండి రక్షించగదోలేదో తెలియదు. భగవంతునిపై సంపూర్ణముగా ఆధారపడితినన్న దృఢనిశ్చయమే అత్యుత్తమ శరణాగతి. నేను తొలుతచెప్పినట్లు సమర్థుడైన గురువుపైసమర్పితభావముననుండుట ముఖ్యము. శరణాగతియందు సామాన్యముగా తాను, శరణాగతి పొందుచున్నాననని తెలియుచుండును. ఇక్కడ ముఖ్యముగా నేను అన్నభావముకలిగి ప్రవర్తించుచుందుము. ఈ నేనెను విదళించివేయవలెను. లేనియెడల యీవిధానమున నేను అన్న అహము పెంపొందునేగానీ శరణాగతివుండదు. సరైనభావనతో దైవముపైగల భక్తియొక్క ఫలితమే శరణాగతి.


ఉనికియొక్క అంతర్గత అనుసంధానమే నిజమైన భక్తి. భక్తియే అతిముఖ్యమైన సాధనము. అత్యంతవిశేషమైన పరమభక్తిలో అభ్యాసి ప్రేమిస్తున్నాడనిగాని, అసలెందుకు ప్రేమిస్తిన్నాడో కూడా యెఱుగనిస్థితిలో నుండును. ఇటువంటి సంఘటనలు మనపురాణములలో కృష్ణపరమాత్మకు సంబంధించి వివరింపబడియున్నవి. "నేను" ప్రబలముగానున్నట్టి ఎఱుక శరణాగతిస్ఫూర్తికే ఆటంకము కలిగించును. అది ఆశించినఫలితములనుగాక తద్విరుద్ధములైన ఫలితములనిచ్చును. ఒకపులి తాను పులినన్న బావము కలిగియున్నపుడు, దానిపిల్లలపైగూడా అది గుర్రుగానుండును. మనిషి తాను మనిషినన్న భావముతోనున్నపుడాతడు, దయ్యమువలె యితరులను హింసించును. సంపూర్ణశరణాగతిపొందితిననిన సహజముగా సర్వమానవాళికి తాను శరణుజొచ్చితినన్నభావన ఎఱుకలోనికివచ్చి, తద్విషయము గ్రహించనారంభించును. పరిపూర్ణశరణాగతి గలిగనంతనే, సహజసిద్ధంగా శరణగతియను భావనే మరచియుండును. ఒకాభ్యాసి సహజసిద్ధతకొఱకే ముఖ్యంగా జాగరూకుడైయుండవలెను. శరణాగతి మరియు సహకారమురెండూ కవలబిడ్డలు.


అభ్యాసి రెండువిధముల పురోగమించును. అంటే ప్రాణాహుతిప్రసారమువలన మరియు స్వశక్తివలన. రెండూ ముఖ్యమే. ఒకప్రశిక్షకుడు ప్రవేశపెట్టిన వెలుగులో అభ్యాసి వివిధకేంద్రములకు చేరుకొనును. ఉన్నతస్థాయిబిందువులవద్ద, అభ్యాసి ఒకవిధమగు ప్రకంపనలననుభూతిచెందును. ప్రశిక్షకుడుచేయు మరొకపని, అభ్యాసిని వివిధస్థానములకు కేంద్రములకు పురోగమింపజేయుట. తమ స్వప్రయత్నమున యీ పురోగతి సాధించువారరుదు. సహజమార్గమున మాత్రమే, శిక్షణాక్రమమున అభ్యాసికి సక్రమమార్గమునేర్పరచి ప్రశిక్షకుడు ఆధ్యాత్మిక ప్రయోజనమును సిద్ధింపజేయును. కనుకనే ప్రశిక్షకులుచేయవలసినపని మిక్కుటముగానున్నది. గురువు మరుయు ప్రశిక్షకులసహాయము లేకుండా అభ్యాసి ఉన్నతోన్నతస్థానముల నధిగమించజాలడని నేను నొక్కివక్కాణించున్నాను. ఎందుకనగా జీవము ఉన్నతస్థాయినుండి నిమ్నస్థాయికి దిగివచ్చినది. మరోవిధంగా చెప్పాలంటే, అది తన స్వశక్తితో క్రిందికిదిగుచున్నది. సూక్ష్మమైనశక్తి చాలాబలమైనది. అభ్యాసి తనస్వశక్తితో ఉన్నతస్థాయికి ఎగబ్రాక ప్రయత్నించేకొలది అతడు క్రిందికి నెట్టబడుచుండును. అందులకు కారణమాతడు సూక్ష్మశక్తిని గ్రహింపకుండుటే. తగినసమయములలో కొంతవరకు అభ్యాసి ప్రయత్నించగలడుగాని,ఆతర్వాత తనకైతాను ముందుకుపోజాలడు. ప్రశిక్షకునకు కేంద్రములు మరియు వాటికున్నశక్తికి సంబంధించిన జ్ఞానమున్నది. కనుక ప్రశిక్షకుడు తనపనులన్నిటిని సక్రమముగా చక్కదిద్దుటకాతడు, నేరుగా తనకు లభించు దివ్యశక్తిని గ్రహించి పనిచేయును. ఒకవేళ అభ్యాసి తనస్వశక్తితోనే కొంతముందుకుసాగినా,గురువును అలక్ష్యము చేసినట్లైన, ఒకస్థాయితర్వాత అతనిప్రయాణము వంకరలువోయి దారిలో ముడులేర్పడి ముందుకుకదలుటకాటంకమైపోవును. దీనిని కేవలమొక ప్రాణాహుతిప్రసారము ద్వారామాత్రమే సరిచేయవీలగును.


ప్రార్థన యొక్క ప్రాముఖ్యత 

ప్రశిక్షకుని ముఖ్యమైనపనిముట్టు మనశ్శక్తి. అయినను అభ్యాసి మంచిఫలితముల నందుకొనుటకు, తగినపద్దతులుండనేవున్నవినేను సంస్థలోని ప్రశిక్షకులను వారి అనుభవములందివ్వమని అర్థించుచున్నాను. ప్రశిక్షకులు అభ్యాసులకొఱకు ధ్యానము, ప్రార్థనలను విధానములను అనుసరించుచున్నారు. అభ్యాసియొక్క ఉన్నతికొఱకు ప్రశిక్షకుడు తదితర విధానములనుకూడ వినియోగించును.


ప్రార్థనయొక్క అవసరమేమంటే, ప్రార్థనచేయుసమయమున ఒక వినమ్రభావమున నుందుము. అది శరణాగతికి అతిసమీపస్థితి. సులభముగా శరణాగతి చేయలేనప్పుడు, యీవిధానముపయోగపడును. తర్వాతివిషయములు వాటంతటవే సమకూరుచూ పోవును. సందర్భానుసారమో లేక అలవాటుగానో వ్యక్తి మనస్సులో ఉద్రేకమునకు తరచూ గురికాబడును. అతడీపరిస్థితినుండి బయటపడటానికి ఒకగురువు నాశయించును. గురువు ఒకానొక పద్దతినవలంభించమనును. మాగురువర్యులైన లాలాజీ వారి వ్రాతచీటీలో సూచిస్తూ, ఒకప్రామాణిక గ్రంథానుసారము మానసికరుగ్మతకు పరిష్కారము చూపుట సరికాదనెను. ఇటువంటిసమస్యలకు ఒకమహాత్ముడీవిధమగు పరిష్కారముచూపి సఫలుడాయెనని వివరించవచ్చును.ౠజువుచూపెనుగాన ఆవిధానము సరియైనదే కావచ్చును. అయితే దివ్యజ్ఞానోదయమైన గురువుచూపిన పరిష్కారమేదైనప్పటికిని అది నిస్సంకోచముగా సరియైనదే అయివుండును. సహజమార్గవిధానములో పనిచేయుకర్తవ్యము   ప్రశిక్షకునిదైతే సత్ప్రవర్తకుడుగా మారుట  అభ్యాసిపనియైయున్నది.


నైతికధైర్యమే ఆధ్యాత్మికతకు ఆధారము. అదివ్యక్తి నీతివంతుడైనపుడే ఉదయించును. చూచుటకడెంత మహాత్ముడుగా అగుపించినను అతని ప్రవర్తన నీతివంతము గానియెడల, అతనిఘనత అనుమానాస్పదమేనని మాగురువర్యులు చెప్పెడివారు. అట్టివ్యక్తి ఆధ్యాత్మికతనిసుమంతైనా శ్వాసించికూడా ఎఱుగడని చెప్పుదును. నైతికత యనగా శక్తియుక్తులన్నియు సత్కార్యములకై సమతాస్థితినందియుండుటయే.ఈస్థితి అహంభావమునకు దూరమైనపుడు మాత్రమే ఉదయించనారంభించును. కనుక యిదే పరమావధిగా మతవిధానములన్నియు యేర్పడినవి. ఇందుకొఱకు సహజమార్గ విధానములు అత్యంతసులభతరములై యున్నవి. అహమునకు అధికప్రాధాన్యతనిచ్చిన నైతికత చెడిపోవును. కనుకనే "నేను" (అహాన్ని) ను భగవంతునివైపు మరల్చుట ప్రశిక్షకుడు పోషించు ముఖ్యభూమిక.


మనసు మార్పుచెందుటద్వారా జనించిన స్థౌల్యస్థితే యీ ఆహము. ఈవిషమును మరింతవిషదముగా చెప్పి, సామాన్యులకుసైతం అవగాహన కల్పించవలెనన్న, అది (అహము) ఒకవ్యక్తిగతశక్తిగా మారి ఒకప్రత్యేకతను సంతరించుకొన్న ఉనికి యని నేనుచెప్పదలచితిని. మనం ఒకసద్గురువు అధీనంలో ఉన్నట్లైన, మనిషి మహనీయుడుగా మారుటకవసరమైనవన్నియు వాటికైఅవే సంప్రాప్తమగును. వాస్తవమున మనపద్దతిలో నిద్రాణస్థితిలోనున్న అభ్యాసిలో దివ్యత్వముచొప్పించు విధానములు  ప్రశిక్షకునకివ్వబడినవి. అభ్యాసి విధిగ స్మసరణలోనున్నయెడల, అది అతనికత్యంత సహాయకారియగును. దట్టమైనపొరలను తొలగించి దివ్యత్వము వికసింపజేయు కార్యమును గురువు నిర్వహించును. ప్రశిక్షకునికి ఆత్మవిశ్వాసము లేనప్పటికిని తాను ప్రసారముచేయు, ప్రాణాహుతి సూక్ష్మగ్రాహ్యమగు వెలుగును ప్రసరింపజేయును. మనంద్సరిలో ఒకేఒక దివ్యశక్తి పనిచేయుచుండుటయే యిందులకు కారణమగుచున్నది.  తీర్చిదిద్దుట ప్రశిక్షకుని కర్తవ్యము. మనసంస్థలోని ప్రశిక్షకులందరు గురువులమనిగాక సాటివ్యక్తులమను నిస్వార్థబుద్ధితో బాగుగా పనిచేయుచున్నందున, నాకు సంతోషముగా నున్నది. ఈభావము మరితగా వృద్ధిచెందునుగాక!     

(ఆధ్యాత్మజ్ఞాన్ 2022 ఏప్రిల్-జూన్ త్రైమాసపత్రికలో ఆంగ్లంలో వెలువడిన "method of Training in Sahaj Marg" అనే వ్యాసమునకు తెలుగు అనువాదము. )       

పూజ్యలాలాజీ మరియు మన ఆధ్యాత్మికప్రగతి

  పూజ్యలాలాజీ మరియు మన ఆధ్యాత్మికప్రగతి సోదరీసోదరులమైన మనమంతా యిక్కడ యీదినం (ఫిబ్రరవరి 14/ బుధవారం 2024) మన ఆదిగురువులైన పూజ్యలాలాజీవారి 1...