Monday, 15 April 2024

అభావము - ఆభావాతీతము

 

అభావము - ఆభావాతీతము

మనము భగవంతుడననేమియో, బహుకాలమునుండి యోచించు చుంటిమి. కొందరు భగవంతుదు లేడందురు. ఇది నాస్తికవాదన. భగవంతుడు లేడను వాదన. నేను భగవంతుదు లేడంటే, అది సరియైన దనే నాభావన. ఎందుకంటే దీనివెనుక సత్యతత్త్వము దాగున్నది. మనమెప్పుడు "లేదు" అంటామో, ఉన్నదన్నభావన దానివెనుకే వుంటుంది. అది సత్య తత్త్వభావనౌతుంది. ఒకవేళ "ఉన్నది" అంటే దానివెనుకే "లేదు’ అన్నభావన వుంటుంది. అటువంటప్పుడు లేదనేవారు సరియైన ఆలోచన లోనే వున్నట్లు సాధారణముగా నీవు నిర్ధారణకు వత్తువు. మనం లేదన గానే ఆఆలోచన నుండి అవతలకు దుమికి సత్యతత్త్వన్ని అందుకుంటాము. "లే" మరియు "దు" అను రెండక్షరములు కలిసి అభావాభిప్రాయానికి వత్తుము.లేదు లేక లేడు అన్నపదం ఉత్పన్నంచేసిన ప్రకంపనలతో మనం అభావమైపోతాము. అభావమైపోతే సత్యతత్త్వం మన ముందుంటుంది. అందులో యేవిధమైన స్థితివుండదు. లేడుఅన్న పదప్రకంపనలలో, మనం లీనమైనప్పటికి తత్సంబంధమైన చర్య యొక్క ప్రకంపనల ఆనుభూతి యేమాత్రముండదు. అది అభావస్థాయి యొక్క రెండవస్థితి. మూడవ స్థాయిని నేను వివరింప గలను. కానీ నావివరణ యెంత స్పష్టముగా నున్నను, జనులు దూరముగా పారిపోవుదురు. కనుక చర్చించ దలచుకోలేదు.

 అభావమై పోవుటెట్లు? నేటిగురువుల వలెనేను నాలుగడుగులు ముందుకేసినట్లైన మీకుబాగా అర్థమై యుండెడిది. నేటిగురువులు దీక్షనిచ్చేసమయంలో వారుకొన్ని పాత్రలు వస్త్రములు అధమంలో అధమం ఒకరూపాయి దక్షిణైనా సమర్పించమంటారు. చదువుకున్నవారు యీ కారణంగ ఆగురువులను తిరస్కరిస్తారు. మీకున్నదంతా నాకిచ్చేయండి అని నేనడిగితే, నన్నుమాత్రమెందుకు తిరస్కరించరు? జనులునన్ను గజదొం గ యని అనుకోకుండ వుండగలరా? నన్నునేను సమర్థించుకొనుటకు, నాఆలోచనను కొద్దిగా మార్చుకొని కొన్నిసార్లు "మీరందరు కలసి నన్ను దోచుకపొండి"అంటాను. ఇచ్చిపుచ్చుకోవడం దీపిడీ కాదగదా? నేను మీకున్నది దోచేసి, నావద్ద కలదంతయు అదేవిధంగా మీరూ దోచుకపొండి అనినేనంటే, నామీద నమ్మకం గలవారు యేవిధమైన అడ్డంకి చెప్పరను కుంటాను. ఇప్పుడు కొంత ముందుకెళితే తెలుస్తుంది. నేనుమీకున్నది దోచేసి దానికి బదులుగా మీరునన్ను దోచుకోండి అనడంవల్ల, నష్టానికి యెవరొప్పుకుంటారు? బహుశా యిందులో మీరే నష్టపొతారు. ఎందు కంటె, నేనిప్పటికే మాగురువర్యులచే దోచేయబడ్డాను. అటువంటప్పుడు మీరెవరిని దోచుకున్నారు? అనినన్నడగవచ్చు. ఇప్పటికే మీకర్థమయిందను కుంటాను. మీరునన్ను దోచుకుంటే మీరు చాలామందివ్యక్తుల (నేను దోచుకున్న అనేకుల) సంపదకు అధిపతులౌతారు. కానీ నేను తొలి పందెంలోనే ఓడిపోయాను. దోచుకున్నదంతా నన్నుగెలిచిన ఆయన (దైవాని) దైపోయింది. అటువంటప్పుడు యీ యిచ్చిపుచ్చుకోవడంలో మీకు లభించేదేముంటుంది, శూన్యం,సున్నా.

 జీవులందరికి "పూజ" జీవితంలో ఒకభాగం. అంతేగాదు, అది వారివిధి. వారు ఆస్థాయి దాటి, అటువంటిదే మరొక విధి (కర్తవ్యం) నిర్వహింపవలసి వస్తే, అంటే మరోమాటలోచెప్పాలంటే, సాధారణంగ ప్రకృతి యేదోఒక పనిలో జీవులను (మనుషులను) నిమగ్నంచేస్తుంది. ప్రపంచం తగుస్థాయికి చేరుకున్నట్లైతే, ప్రకృతి నిస్తేజ మౌతుంది. ఆత్మచలనము వలన చైతన్యము నిత్యమై సంరక్షింపబడుతూ సమత కొనసాగింపబడుతుంది. మనిషి ప్రకృతివలెనే, ప్రకృతితోపాటే నిస్తేజమైతే, అప్పుడతడు జనులకొఱకు చైతన్యాన్ని ఉత్పన్నంచేస్తాడు. అతడు ప్రకృతి యొక్క యంత్రమై పనిచేస్తాడు. ప్రకృతిలో అతడు, తగుస్థానంలో యిమిడిపోతాడు. ప్రకృతిశక్తి కొంతవరకు యిట్టి యంత్రములపై (ప్రకృతి కార్య నివాహకులపై) పనిచేస్తుంది, ఆశక్తి, వ్యక్తి సంపాదించిన స్థాయి కనుగుణంగా వుంటుంది. ఆస్థాయి అతని కెక్కడనుండి సంప్రాప్తమైనది, యెలా ఉత్పన్నమైనది? ఈస్థాయి అతని సక్రమ కార్యనిర్వహణకనుగుణంగా లభిస్తుంది. అతని అలవాట్లలోని మితత్వము (సమన్వయము) వలన కలుగుతుంది. మళ్ళీయిది ప్రకృతి నియమముల సక్రమానుసరణవల్ల కొనసాగుతుంది. ఎవరైతే ప్రకృతి నియమాలను చక్కగా పాటిస్తారో, వారికి ప్రబలమైన సహాయ మందుతుంది. ఈప్రకృతినియమాలు యెచట యేర్పడతాయో ఆ హద్దు వరకు చేరిన తర్వాత కేంద్రమునుండి తగినంత సహాయం అందుతుంది. ప్రకృతినియమాలను చక్కగా అనుసరించితేనే, అతడు ధర్మబద్ధంగా యేర్పరుపబడియున్న ఒకరేఖ  ఆధారంగా కాస్తా అటూయిటూ పైకిక్రిందికి అతడు కదులుతూవుంటాడు.   

 కనుక మనమందరం ప్రకృతికి సమాంతరంగా పయనించవలసి వుంటుంది. తద్వార ప్రకృతిసహాయం పొందగలుగుదుము. లేదా పురోగతి కొఱకు మనం అనుసరిస్తున్న మార్గంలో ప్రకృతి సహాయం పొందియున్న మహ నీయుని సహాయం పొందవలసి యున్నది.

   నీవు తెలియజేసినదాన్నిబట్టి గమనిస్తే, నీవునా యెడబాటును సహించలేక పోతున్నట్లు తెలియుచున్నది. బహుశా నీవునా శరీరానికిమాత్రమే దూర మయ్యావు. నీ అంతర్గతంగా లోలోతులకువెళ్ళి గమనిస్తే అంతటా నేనే కనబడతాను. కాస్త ఆలోచిస్తే నీహృదయమందే నన్ను నీవు దర్శింపగలవు. ఇప్పటి నీజీవితంలో సరైన జీవనవిధాననికి కట్టుబడితేచాలు నీవిపరీత స్వప్రాంతచింత వదలిపోతుంది. అలాకాకపోతే, నేను సదా నీవెంటనున్నా నన్న తలంపుతో నీవు కొనసాగితే, చాలావరకు నీసమస్య తొలగిపోతుంది. నేను దక్షిణ భారతానికి పయనమై వెళ్ళినరోజులు జ్ఞాపకానికి వస్తున్నాయి. అప్పుడు మాగురువర్యులు యెల్లవేళలా నాతో మాట్లాడుతున్న నాసహచరుల వలె నాలోనే వున్నాడన్న తలంపుతో వుండిపోయాను. ఆయన బాహ్య రూపాన్ని చూడలేకపోయినా నేనొక అంధునివలె నున్నాననిపించింది. అంధుడు తనసహచరుని రూపంచూడలేడుగాని, అతడు తన సహచరునితో పరస్పరం మాట్లాడుకుంటూ సమయం గడపగలడు. నీవు పరిపూర్ణస్థాయికి యింకనూ చేరలేదు గనుక కనీసం నేను నీదగ్గరేవున్నానన్న భావనతోనైనా వుండు. భగవంతుడు నీకనుకూలుడై యుండుగాక! నీకు ఆధ్యాత్మిక పురోగతి కలుగజేసి, ప్రస్తుతం నేనున్న స్థితినిసైతం అధిగమించి మున్ముందుకునీ ఆధ్యాత్మిక ప్రయాణం సాగుగాక.

 (శ్రీరాంచంద్రజీ వారు ఒక అభ్యాసికి వ్రాసిన లేఖయొక్క సారాంశమిది. డా:శ్రీవాత్సవగారి "డివైన్ మెసేజెస్" అను పుస్తకమునుండి గ్రహింప బడినది)  

Monday, 25 March 2024

నాకార్యము – నావిధానము

 

నాకార్యము – నావిధానము

                                                             రచన:-పూజ్యశ్రీ రామచంద్రజీ మహరాజ్ , షాహజాన్ పూర్  

 నేనేమంత గొప్ప అనుభవముగల వాడినికాను. నాకేమీ తెలియదన్నదే నాకు తెలిసిన విషయము. నేను నాస్వంతపుస్తకము మాత్రమే చదివితిని. అందులో జ్ఞానము అడుగంటి యున్నది. నేను గ్రుడ్డిగా ముందుకుసాగితిని. నేనేమిచేయువున్నానో, ఏదారిన తిరుగాడు చున్నానో కూడా నాకుతెలియదు. నేను మీకోసం యిప్పుడు సూచించినంత మాత్రంకూడా  నాధ్యేంపై నాకవగాహనలేదు. నాదృష్టి కేవలం ఆపవిత్రమూర్తిపై మాత్రమే నిలచియుండినది. ఆయనకే నాహృదయమర్పించితిని. నా దృక్పదంలో వేరొక ప్రయోజనమే లేక ఆయనకే నన్ను నేనర్పిపించుకొంటిని. ఇప్పటికీ నాస్థితి అలాగేవున్నది. కానీ ఒకచిన్న వ్యత్యాసమున్నది. అదేమంటే, అప్పటి విచక్షణకూడా యిప్పుడు లేదు.

 అంధుడు యేమీ చూడలేడు. నేనూ అంధుడనై, యేఅనుభూతిగానీ, చూడాల్సిందిగానీ లేకుండా పోతుంది. చూడకూడని వాటిని చూడకుండా వుండటానికి భక్తసూరదాసు తనకళ్ళను పొడిచేసు కున్నాడు. నేను నాదృష్టినంతా ఆయనవైపునకే మరల్చాను. తద్వారా ప్రాపంచిక విషయభారము నాహృదయముపై పడలేదు.

 మనము (మానవులము) యెక్కడున్నామో, అక్కడనుండి యేవిధమైన జ్ఞానము మనకు లభ్యముగాదు. కడకు అక్కడ మనల్నిగురించి కూడా మనకేమీతెలియదు. మరోవిధంగా చెప్పాలంటే, ఆ స్థంభించిపోయినస్థితి లేక చైతన్యరహితస్థితి సహజంగానే మనలో వుంది. అయితే ఆస్థితి సంపూర్ణసమత్వంలో లేశమైనా మన మనసునకనిపించియుంటే, లేక అనుభవమునకు వచ్చియుండియుంటే, అర్థమైయుండేది. దీని తర్వాతే ప్రతిదీ ఉనిలోనికి వచ్చినది. ఈగమ్యం మనంచేరడానికి మనలో వినమ్రత నెలకొనాలి. ఆ వినమ్రతకూడా మనయెఱుకలో లేకుండా పోవాలి. మనము గొప్పతనానందుకోవాలి, కానీ అదేమిటో కూడా మనకసలే తెలియకుండా వుండాలి. మనకైమనం గొప్పతనాన్ని సాధించి, గొప్పవారనుకుంటే, ఆ ఆలోచనే మనదారిలో అడ్డంకియైనిలచి మనల్ని ముందుకు సాగనివ్వదు. ఎవరుకూడా తనకైతాను యెవరికంటెను, యేవిధంగాను, దేనిలోనూ, యెప్పుడూ గొప్పవాడినని భావింప రాదు. ఈమహద్వాక్యం గమనించండి. "ఏలోపం లేని లోపమసలే వుండదు". ఈ వాక్య మర్థమవ్వడానికి, కొంతవరకు సహాయపడు మరోమాట చెబుతాను, గమనించండి. "నాస్థితి నాకుతెలియదుగానీ, ఒక్కోసారి నాకానందంగానూ, మరోసారి బాధగానూ వుంటుంది. అప్పుడు నేను నిద్రలో కలగన్నబిడ్డవలె యేడుస్తాను లేదా నవ్వేస్తాను.

 ఇతరులకు శిక్షణనిచువారు, అందుకుతగిన స్థాయివరకు చేరకుండానే శిక్షణ నిచ్చినట్లైన, అది వారిపతనానికి దారితీయును. ప్రశిక్షకునికి అనుమతినిచ్చేముందు, అతని హృదయములో నేను ప్రశిక్షకుడను, అధికుడను అనుభారము హృదయముపై వుండరాదు. ఈస్థితి అతడు తన అహాన్ని జయించినపుడు కలుగుతుంది. భగవంతుని ఆజ్ఞలను అమలుజరుపుట తప్ప, యితర మేమియు అతనికవసరమై వుండదు. అతనికి మంచి చెడు, తనవారు పరాయివారు అన్నతేడా వుండనే వుండదు. ఆజ్ఞ అంటేఆజ్ఞ అనునట్లతడు వ్యవహరించును.    

 గురుదేవులకార్యము ఆగదు. ఆధ్యాత్మిక‍ఉద్యమం సంపూర్నస్థయిలో ముందుకు సాగిపోనున్నది. తనుచేరిన యేఆద్యాత్మిక స్థాయితోనూ సంతృప్తిచెందక పురోగమింపవలెను. ఇకచాలుఅన్న భావనను విసరి కుక్కలకు పడవేయవలెను. నేనునాజీవితకాలములో యెప్పుడు సంతృప్తి చెందలేదని మా గురువర్యులు చెప్పిరి. ఆతర్వాత అత్యున్నతస్థాయి చీకటిలో మున్ముందుకు యీదుట తటస్థించినది. వాస్తవానికి యెవ్వరుకూడ అనంతమైన ఆద్యాత్మిక సాగరాన్ని యీది దాటజాలరు. ఇది మహోన్నతస్థాయి ఆత్మలస్థితి. ఇక‍అల్పుల విషయం చెప్పవలసిన పనిలేదు.                                                 

    "పచ్చిగానున్నది పరిపక్వతజెందాలంటే ప్రయాణం చాలాకాలం సాగాల్సిందే"’

 అంతర్గతశక్తి నుపయోగించి సమస్తదోషములను నిర్మూలించవచ్చును. మనిషి తనలోని కొన్నిదోషములను నిర్మూలింపదలచియూ నిర్మూలింప వీలుకాలేదన్నమాట వుండదు. ఒకపురాతన వాక్యం యిట్లున్నది "మనిషికి ధైర్యముంటె భగవంతుని సహాయం వుండనే వుంటుంది". నాకు ఓడజను సార్లకంటె యెక్కువసార్లు మాగురుదేవులను భౌతికంగా కలవడానికి వీలుపడలేదు. కానీ నాఆలోచననుండి ఆయన దూరమైన సంఘటన నా మనస్సుకెప్పుడు కలుగలేదు. నాకుతెలిసి యెల్లప్పుడు ఆయనకు సన్నిహితంగానేవున్నాను. ఆయనకు నచ్చనిపని నావల్ల జరుగుతుందేమోనని భయపడుతూవుండేవాడిని. ఎల్లవేళల నాగురువర్యుల చింతన నాలో వుండటమనేది, సంపూర్ణవిస్వాసముతో గూడివుండేది. నాజీవితభవిష్యత్తు నిర్మాణమునకు యీఅంశములు స్థితులు సహాయకారులైనవి. నేనొక విధానమును మీకుచెబుతాను, అదేమంటే మీకునచ్చనిదేదైనా సంభవిస్తే, అది నాకు వెంటనే తెలియజేయండి , లేదా అదినాదేననుకొనండి. లేదా ఒరోవిధంగా చెప్పాలంటే, అదినా తప్పుగానో లేక లోపంగానోభావించండి. ఈవిధానం చాలాసులువైనది, ప్రతిభావంతమైనది. ఈవిధానం నాసోదర‍అభ్యాసి గురువునెడ తగదని, అమర్యాదకరమని, అసంబద్ధమైనదని వాదించెను. నేను నానీతిని, సద్గుణాలను నాగురుదేవులకు సంబంధంలేకుండా నావేనని తలచి, లేక నాగురువు సంపూర్ణుడుకాదని తలచినట్లైన, నీవుచెప్పినది సబబేనని నేను సమాధాన మిచ్చితిని.

 ఏవిధంగానైనా సరే, ఒకరికొకరం సహాయంచేసుకోవడం మనవిధి. మనుషులు ఒకరికొకరు సహకరించడమంటే, ఒకజీవిలోని వివిధ‍అంగములు పనిజేసినట్లే యగును. వారు ఒకరిపై ఒకరు ఆధారపడియుందురు. నేను హృదయపూర్వకముగా అందరిబాగుకోసం ప్రార్థిస్తున్నాను. మాటసాయంచేస్తాను. ఇంకా అవసరమైతే, అందరికీ తెలిసేటట్ట్లు సహాయపడతాను. ఆధ్యాత్మికస్థితియన్నది సహజంగా హృదయాధారితమైనది. అది భగవంతునిసృష్టిలోని జీవులందరి మేలునకు క్షేమమునకై యున్నది. సరియైనప్రార్థనలో ప్రార్థిస్తున్నానన్న యెఱుకవుండదు. ప్రార్థినామయస్థితి నిరంతరం కొనసాగుతూనే వుంటుంది. ఎఱుకేవుంటే, అందులో అహంకారానికి ఆహుతైపోయే ఆశీర్వాదాంశం వుంటుంది. అంటే నేను దీవించే వాడిని అనే అహం వుంటుంది. ఒకవేళ దీవించు లేక ప్రార్దించువారు కోరినట్లు జరిగిందంటే, ఆప్రార్థించువారు లేక దీవించువారు తమనితాము ప్రత్యేకమైన పూజనీయులమని, యెన్ను కొనబడిన ఘనులమని తలంతురు. ఇక్కడకూడ ఉద్దేశ్యం మంచిదైతే అవశ్యంగా వచ్చేహాని యేమీవుండదు, అసలిట్టిచోట్లన్నిట హృదయమే ప్రాధాన్యత వహించి, అదే గణింపబడుతుంది.

 తనకైతాను ఉత్తమస్థాయి కెదగాలనుకోవడం, యిప్పటి అవసరం. దేనికే గట్టిగా కట్టుబడి వుండాలి. అప్పుడు గమనించి చూడండి, యేమిజరుగుతుందో. అహో! ఇది హిందువులలో అంతర్గతంగా వున్నదే. అయినా వారు యీవిషయం అర్థంచేసుకోలేకపోతున్నారు. కారణం, తెసుకోవడానికి వారికి తీరికాలేదు, తెలుసుకోవాలనే కుతూహలమూలేదు. ముస్లింల ఆలోచన, నమ్మకం ప్రకారం మహమ్మదుప్రవక్త విచారణదినంనాడు నమ్మినవారిని స్వర్గంవెళ్ళుటకు, కానుకగా సిఫారసుచేస్తాడు. వాస్తవానికి విచారణదినం గడచిన తర్వాత అనుగ్రహించబడే స్వర్గంఅనేది అసలుందో లేదో కూడా తెలియదు. 

ఆధ్యాత్మికరంగమునకు వైవిద్యము విషము. మహోన్నతమైనది (దైవం) కలదను భావనకలిగి యుండి కూడా గొప్పవారమనుకుంటే, యిక ప్రేమ విరాజమానంకాదు. అలా కాకుండా మనల్నిమనం అల్పులమనుకుంటే, మన హృదయం ఉన్నతుని సేవించడానికి ఒప్పుకుంటుంది. ఇది శుభకరమైనది. ఒక సాధుపుంగవుడు సెలవిచ్చినట్లు "ఒకవేళ తననుతాను మరొకరికంటే గొప్పవాడననుకొని యితరులను, తక్కువ, హీనులు అనుకుంటే, అతడు తానున్న స్థితినుండి క్రిందకుపడిపోవును . మనము కులమునుబట్టి అంచనావేసి గౌరవించు పద్దతిలో నున్నాము. అన్నికులములు ఒకపెట్టెలోని అరలవంటివి. అవసరమొచ్చినపుడు, పెట్టెనుతెమ్మంటాముగాని అందులోని అరలనుతెమ్మనము. అన్నితెగలు పనివాని చేతిపనులే. కులములన్ని సంఘము యొక్క అనుకూలతకోసం యేర్పడినవే. నీవుపెట్టెను తెరిస్తే, అందులో అరలలోని వస్తువులన్నీ ఒకదానితో మరొకటి సంబంధం గలిగేవుంటాయి. అవికొన్ని చెక్కవైతే, మరికొన్ని ఉక్కు లేక యినుమువై వుంటాయి. కబీరుమహనీయుడు యిలా చక్కగా సెలవిచ్చారు. "అల్పులందరు పవిత్రసాధువుల  పాదములనాశ్రయించి, మోక్షముపొందగా, కులమురీత్యా ఘనుల మను కొన్నవారు, గర్వముతో పతనమై పోయారు.

 కులమనేవేరువద్ద ప్రకృతి గొడ్డలినుంచింది. కాలక్రమంలో కులం తప్పక సమసిపోయుంది.

 మీచూపును అంతరంగంవైపునకు మరల్చండి. మీముందున్న యీప్రపంచం నాది. కనుక మీరు స్వేచ్ఛను అనుభవించండి. నాస్వర్గం యితరులకొఱకు వదలివేశాను. ఇతరులకష్టములు, వేదనలను నావిగా గ్రహిస్తున్నాను. నేనునామోక్షన్ని గురించి పట్టించుకోవడంలేదు. నావద్ద ఒకతెల్లని, మరొకనల్లని పత్రము వున్నవి. నల్లనిదంటే, యితరుల కష్టములు వ్యధలు. నేను వారి శిక్షకునిగా వ్యవహరిస్తున్నాను గనుక ఆనలుపును నేనుపులుముకున్నాను. మీవ్యధలు, బాధలుఅనే పొరలను తొలగించుకోండి. వాటిని నన్ను భరించనీయండి. అవన్నీ నానల్ల పత్రమునకు జమచేయండి, మీరు తెల్లనిపత్రమే స్వీకరించండి.

 గురువర్యుల కార్యము నిరంతరంగా, యేఅడ్డంకులులేకుండా కొనసాగాలి. నాప్రియతములు ఆయన విధానమును పాటించడముద్వారా ఆయన కార్యక్రమములో పాల్గొనండి. ఆయనచూపిన మార్గము సయైనది. అది మాత్రమే మోక్షము, ఆపైపైస్థితులన్నిటిని మీక.నుగ్రహించగలదు         

  (S.P శ్రీవాత్సవగారి డివైన్ మెసేజెస్ అను పుస్తకమునుండి గ్రహించి, ఆంగ్లమునుండి తెలుగునకు అణువదించడమైనది )    

 

 

Thursday, 21 March 2024

సంసారిక జీవనము - సన్యాసము

 

సంసారిక జీవనము - సన్యాసము

                                                             రచన:-పూజ్యశ్రీ రామచంద్రజీ మహరాజ్ , షాహజాన్ పూర్  

 సంసారికజీవనమునకు సన్యాసమునకు గల విభేదమును గురించినచర్చ బహుపురాతన మైనది. మీకు తెలుసుగదా! మానవజీవిత పరమార్థమును బుద్ధభగవానుడు సాంసారిక జీవితాన్ని త్యజించి సన్యాసియై, అనేకప్రయాసలకు, దురవస్థలకు గురియైనమీదటనే సిద్ధించెనని నాకు చెప్పెను. సాంసారిక జీవితాన్ని త్యజించకనే నాకన్నియు సమకూరెనని, కనుక సన్యసించవలసిన అవసరంలేదని నేనాయనతో చెప్ప సంకల్పించితిని. కానీ బుద్ధభగవానుతంతటి మహనీయునితో ముఖాముఖి నిలచి ఆయనతో మర్యాదగా వ్యవహరించవలసి వచ్చినపుడు, ఆయనను వ్యతిరేకించుటెట్లని ఆలోచనలోపడి, నేను పూజ్యలాలాజీసాహెబ్ వైపునకు తిరిగి బుద్ధభగవానుడు తెలిపిన విషయములను ఆయన దృష్టికితెచ్చితిని. అప్పుడు లాలాజీవారు నన్ను బుద్ధభగవానుడు చెప్పినవిషయములను విను, అంతేగాని వారితో ప్రశ్నోత్తరముల వాగ్వాదమునకు దిగవద్దనెను. అటువంటి అపారమైన ప్రేమకు తార్కాణమైన మాగురుదేవులవంటివారిని నేనెక్కడా కనుగొనలేను గదా!

 నిజానికి రెండువైఖరులూ, సమంజసమైనవే. ఏవేవో ఫిర్యాదులతో నిరంతరం చింతలకు గురిచేయు యింటివారికి, బంధువులకు, ఆప్తులకు యెప్పుడు యెక్కడ యేమిచేయవలెనోయని, ఆంధోళన చెందుదుముగదా! ఆటువంటప్పుడు, యెటువంటి స్వప్రయోజనాన్ని ఆశించక కేవలం కర్తవ్యపరంగా చేయవలసిన పని చేసుకుంటూపోవడమే సరియగువిధానము. ఇంకాచెప్పాలంటే, యేయితర ఆలోచనా మనసునలేకుండ కేవలం యిదినావిధి యనుకొని, దానివలన యేవిధమైన లాభాలోచన లేకుండ కాలంగడప వలసియున్నది. ఈశరీరమున జీవమున్నంతవరకు కుటుంబానికి, ప్రాపంచిక బంధాలకు చిక్కకుండా వుండటం సాధ్యపడదు. అవసరాల కారణంగా, యిదో అదో యేదో ఒకబంధం యేదోఒక సందర్భంలో ఉత్పన్నంకాక తప్పదు. అనేకవిధాలైన గొలుసులు, బంధనములనదగు వేల కథనాలు, యిదిచేయదగును, యిదిచేయదగదు అంటూ జీవనశైలి, నడవడికి సంబంధించినవెన్నో, మనిషిని ప్రభావితం చేస్తూనేవుంటాయి. సాలెగూడువంటి యిట్టి చిక్కులు, సంకటములవల్ల  సరళంగా , నిరాడంబరముగా సాగు ఆధ్యాత్మికత, సహజంగానే కుంటువడుతుంది. మతపరమైన ఆధ్యాత్మికతకు యివన్నీ అడ్డుతగులుతాయి. ఈకారణాలన్నిటివల్ల సహజమార్గముయొక్క సరళత (నిరాడంబరత) కు ఒకముసుగేర్పడినది.

 బుద్ధునితర్వాత ఒక విధానము వెలుగులోనికికొచ్చింది.  నిజానికది, అంతకు ముందునుండే వుండినది, కానీ అంతగా వ్యాప్తిచెదిందియుండలేదు. అదే ప్రేమ విధానము. అందులో మీవైయున్నవన్నీ వున్నవి. ప్రభువునెడ ప్రేమగా అవి సమర్పింపబడియున్నవి. ఒక పర్షియా కవిత్వంలో యీ విధంగా చెప్పబడింది. "నీహృదయం మరొకరి చేతిలోపెట్టి, యేమైనదోయని అయోమయంలో పడిపోయినట్లున్నది" ఇలా జరిగితే అన్నిబంధాలు ఆమహాప్రభునకే తగులుకొని వుంటాయి. ఆయన ఉనికే ముఖ్యమై వుంటుంది. ఆయనపైనే అందరు ఆధారపడివుంటారు. ఇదే జరిగితే యికపై చేయవలసినదేమియూ వుండదు. కఠినమైన తపన అహాన్నిపెంచే అద్భుతశక్తుల నుత్పన్నం చేస్తాయి.  ఆర్జించిన ఉత్తమ పవిత్రతలను సహితం నష్టపరచి మోక్షసాధన కవరోధాలౌతాయి.

 ప్రేమమార్గమేర్పడినప్పటినుండి, ఆత్మనుమరచిపోయి, భక్తిలోయలో ప్రయాణముసాగుటుంది . అదే ఆధ్యాత్మికప్రారంభబిందువునకు చేర్చు అతిసులభమైన మార్గము. అంటే అదే విముక్త సోపానము లేక మోక్షస్థితి. ఒక పర్షియాకవి చెప్పినట్లు, వంగివంగి సాగిలబడిచేయు మ్రొక్కులు అన్నింటియెడ విముఖత జూపు మొండివానివైతే, తన ఉనికినిమరచి ప్రార్థనామయ స్థితిలోనికెళ్ళుటన్నది ప్రేమస్వరూపుల మార్గము.

 వ్యక్తి ఉనికి ప్రభువులో లీనమైపోతే, కుటుంబజీవనము, ప్రాపంచిక బాధ్యతలన్ని మరొకరిచేతి కప్పజెప్పబడి ప్రాపంచిక ఉనికియొక్క ప్రణాళికమొత్తం ఒకవిచిత్ర మార్పును సంతరించు కుంటుంది. ఇక్కడ సంసారికజీవనము, సన్యాసమునకున్న ద్వైతభావము రూపుమాసిపోతుంది . ప్రియునితో కలయిక యేర్పడి బంధనములు తెగిపోయి, మరోరంగు సంతరించుకుంటుంది. అన్నిరకముల శ్రమలు, సంకటములు, చింతలు, ఆత్రుతలన్ని మోక్షమువైపునకు దారితీయు స్వచ్ఛమైన రూపధారణదిశగా వృద్ధిచెందుతాయి. ఇదంతా సులభము సరళమై యున్నప్పటికి వివరించుటకు విషదీకరించిచెప్పుటకు మాత్రము దుర్లభముగా నుండును. ప్రేమికుడనని చెప్పుకోవడం, పశువులు చేలోమేసినంత సులభం. కానీ నిజమైన  ప్రేమ చాలా అరుదు. ప్రేమలోవ్యక్తి తన‍ఉనికినితాను కోల్పోతాడు. అంతేకాదు ప్రేమను కూడా మరచిపోతాడు. అనుకరించడంద్వారా నిజమైనప్రేమను పొందవచ్చుననుటకు సందేహంలేదు. కానీ అనుకరణద్వారా పొందిన ప్రేమకు నిజంగా ఉత్పన్నమైన ప్రేమకు తేడా ఉండనేవుంటుంది.    

 ఎంతచిత్రమిది? నామూడవకుమార్తెగానో నాల్గవకుమారునిగానో మారిపోయామంటూ మనుషులు నన్ను వారిష్టప్రకారం నడవాలంటారు. అయితేవారు, నాస్వంతబిడ్డలు నన్ను వారిష్టప్రకారంనడవాలని ఒత్తిడితెస్తే మాత్రం వారిని (నబిడ్డలను) తప్పుపడతారు. అంటే నన్నువారు తండ్రిగాస్వీకరించి  వారి దురాశను వ్యామోహాన్ని నెరవేర్చుకోవాలని ప్రయత్నిస్తూ, అది వారి భక్తిప్రేమలకు నిదర్శనమంటూ నాబిడ్డాలతో బంధుత్వాన్ని నెరపుతారు. కానీ నాబిడ్డలు వారితండ్రినైన నావద్ద దురాశ వ్యామోహంతో కోరికలు  నెరవేర్చులోవాలని చూస్తేమాత్రం, అదివారి (నాబిడ్డల) అయోగ్యతగా పరిగణించి తప్పుపడతారు. దీనర్థం బిడ్డలదోషాలను పట్టించుకోకుండా వారిని నిర్లక్ష్యము చేయమనికాదుగానీ, భక్తిప్రేమల ముసుగులో చూపుతున్న వంచననుమాత్రం, నిర్మూలించవలసియున్నది. ప్రపంచములోనున్న యిట్టి మేధావుల పద్దతిని, వారితీరును అద్భుతమనాలి.

 ప్రపంచములోని జనుల ప్రాపంచికవాంఛలు నెరవేరడానికి ఆధ్యాత్మికముగూడా ఒకమార్గమైయున్నది. వారిదృక్పదంలో  నిజమైన ఆధ్యాత్మికత కలదంటే, ప్రాపంచిక విషయాలన్నింటిలో విజయముసిద్ధించి, ప్రాపంచికవాంఛలన్నీ నెరవేరాలి. వారు ప్రభువునుండి అన్నిటిని దబాయించి హక్కుగా పొందా లనుకుంటారు. ధనము, గౌరవము, కుటుంబము బిడ్డలక్షేమము, స్నేహితులసహాయము, పొగడ్తలు, బంధుత్వాలు, హోదాలు, జ్ఞానము, నైపుణ్యము, కీర్తి, సంరక్షణ, ప్రాతినిధ్యం మొదలగునవన్నీ సమకూర్చేతీరాలంటారు. నిజమైన ఆధ్యాత్మికత, దైవకృప ఆశించువారు అరుదుగా వుంటారు. వారు తమహృదయాన్ని ప్రభువొక్కనికే సమర్పిస్తారు. వారికి కోరవలసిందేమియు వుండదు. వారికి లభించినదేదైనను, అది వారికి, కష్టనష్టదాయకమైనదైనను సరే, వారుదానిని ప్రభువుప్రసాదమని సమ్మతితో స్వీకరిస్తారు. అట్టివారు పొందలేనిదంటూ యేదీవుండదు. కడకువారు పొందినదేమైనా వుందంటే , దానికోసం పైనచెప్పిన సంపదలన్నీ వారు విసరిపారేస్తారు .  

 ప్రాపంచికత మరియు దైవీయత ఒకదానికొకటి సమాంతరముగా సాగుట, అను నాసిద్ధాంతమును ధనవంతులు, మరియు పరస్పరం యిచ్చుట తీసుకొనుట (లావదేవీల) లో నిష్ణాతులైన వ్యాపారస్తులు గూడా సమర్థిస్తారు. వారికర్థమైనదేమంటే ఇది నూటికినూరుశాతం లాభదాయకం. ఐదువేళ్ళూ వెన్నలోవుండటం" అనే నానుడికి సరిపోతుంది. ఇదే నానుడికి రెండవభాగం తమాషాగావున్నా వారిఆలోననకు సరిగ్గానే సరిపోతుంది.  అది "తలతీసి పళ్ళెరంలో వుంచినా, ఐదువేళ్ళు మాత్రం వెన్నలోనే వుండాలి" యిక్కడ ఐదువేళ్ళు మాత్రం వెన్నలో వుండటమే ముఖ్యం. తలపోయినా పరవాలేదు. అంటే ఎటుచూసినా లాభమే ముఖ్యమన్నమాట. అయితే కబీరుమహనీయుడు చక్కగా యిలా చెప్పారు"నీతలకు బదులుగా భవంతుడు లభిస్తే , అదిచాలా చౌకబేరమే" అన్నారు. కానీ ప్రాపంచికం దైవీయం సమాంతరంగా సాగే సిద్ధాంతం అందుబాటులో వున్నప్పుడు, ఈకష్టం యెవరు కావాలని కోరుకుంటారు. నేనుకూడా యితరమైనా వాటికంటే దీన్నే సమర్థిస్తాను. ఇతరములైనవి దీనికంటే గొప్పపరిష్కారము చూపునవి, సమంజసమైనవి కావచ్చును. వాటి అపరిపక్వత లెక్కలుచూసుకొనేతత్వంగలవారికి ఒప్పుదలగా వుండవచ్చును.  వారువారి హృదయాలను భవంతునివైపు మరల్చినామని, దివ్యత్వముపొంనామని భావిచియుండవచ్చును. దానితోపాటే సంపద, హోదా, గౌరవము కూడా పొందియుండవచ్చును. కానీ యెవైనా తమ అధీనమునకు తెచ్చుకోవడము, జారిపోకుండా నిరోధించడమునకు గలసంబంధము, తేడా తెలిసికొనగల వివేకము వారికుండదు.

 నేనుడంకాబజాయించి చెబుతున్నాను, సర్వంత్యాగం చేయడంద్వారానే సర్వం సాధించవచ్చును. మహత్తరమైన విలువగల ఆధ్యాత్మిక విధానము, స్వంతమునకు సంపాదించుకోవడము గౌరవమైన హోదా పొందడము, ఆధ్యాత్మికతకు విరుద్ధముకాదుగాని, వ్యామోహము, దురాశ మాత్రము ఆధ్యాత్మిక పురోగమనానికి ప్రాణాంతకమైన విషమువంటివి. సర్మద్ అనే సూఫీభక్తుడు చెబుతూ "దీపపుపురుగు యొక్క హృదయవేదన దురాశగల జోరీగ అదృష్టముకాబోదు" అన్నారు. ఖ్వాజాఫకురుద్దీన్‍అత్తర్ అనే ఇరాన్‍కవి ఉదాహరణకూడా  బహుళఖ్యాతి వహించినది. ధర్మదాస్ తనసర్వస్వాన్ని వదులుకున్న తర్వాతనే, కబీర్‍దాసు ఉత్తరాధికారి కాగలిగాడు. నన్నునేను త్యాగంచేసుకున్న తర్వాతనే లాలాజిపేరు శాశ్వతం చేయగలిగాను. అదికూడా దయతోనాకు వారిచ్చిన  తిరుగులేని కానుక. కొందరు, వారు  అనుబంధం లాలాజీగారితో నాకంటే మిక్కుంటంగా అనుబంధం వుండినదని భ్రమపడి వారు నా ఆరోగ్యం బాగుండాలని ఆయనను అర్థించామని చెప్పుకునేవారు. ఇది యెలాగుందంటే "శిషులు చెక్కెరగా మారారు, కానీ వారి గురువుమాత్రం బెల్లంగానే వుండిపోయారు" అన్నట్లున్నది. ఇది నా అదృష్టము. ఏమనిచెప్పేది? నాకేమీ తెలియదన్న విషయం నాకర్థమైంది. ఏది చేయాలో, యేదిజరిగిందో  అదంతా ఆయన దయవల్లేనే జరిగింది. నేనేమి యివ్వాలో, యివ్వడానికేముందో, అంతాకూడా ఆయనపైనే ఆధారపడివుంది. నాఅదృష్టంపై యేడ్వడమెందుకు? వాస్తవం గమనిస్తే  సింహాలు గుంపులు గుంపులుగా వుండవు. హంసలు వరుసలు వసరులుగా రావు. మాణిక్యాలు గోనెసంచులలో నింపుకొని తేరు. సాధుపుంగవులుకూడా గుంపులుగా ఉద్భవవించరు, ఇంతగా నొక్కివక్కాణించటం, తొలుత చెప్పిన విషయం, తర్వాతచెప్పిన విషయం కంటే గొప్పదనిచెప్పుటకు కాదు. ఏదియేమైనాకాని, సూర్యోదయంతో దశదిశలలకు వెలుగులు ప్రసరించాల్సిందే.  అంతేగాని ప్రతివెలుగు సూర్యకిరణాల  కెరటాలవలె వెలుగులు వెదజల్లలేవు.          

(S.P శ్రీవాత్సవగారి డివైన్ మెసేజెస్ అను పుస్తకమునుండి గ్రహించి, ఆంగ్లమునుండి తెలుగునకు అణువదించడమైనది )    

 

 

 

 

Sunday, 17 March 2024

గురుదేవుల ఆశయం

 

గురుదేవుల ఆశయం

                                                                              రచన:-పూజ్యశ్రీ రామచంద్రజీ మహరాజ్ , షాహజాన్ పూర్  

 మీరందరు కలసి నా ఉనికిని విజయవంతం చేయాలని నేను ఆశిస్తున్నాను. లేదా మనమందరం కలసి నా ఉనికిని విజయవంతంచేద్దాం. మీరు వైభవోపేతులైతే, ఇది జరిగితీరుతుంది. అంటే మీరు వెలిగిపోవాలని నా‍ఉద్దేశ్యం. ఆధ్యాత్మిక భైరాగుల వైభవం వారు ధరించు ప్రత్యేకదుస్తులవల్ల సమకూరదు. వారి హృదయవివర్ణమువల్ల కలుగుతుంది. ఈవివర్ణత యెలాకలుగుతుంది? వర్ణములన్నీ కలసిపోయినట్లైన కలుగుతుంది. అది మనకెలా తెలుస్తుంది? అది సమతాస్థితి నెలకొనడంవల్ల తెలుస్తుంది. సమతాస్థితి యెలా నెలకొంటుంది? అది వినయము వృద్ధిచెందుటవల్ల నెలకొంటుంది. వినయమెలా వృద్ధిచెందుతుంది? అది శరణాగతివల్ల వృద్ధిచెందుతుంది. శరణాగతి యెలా వృద్ధిచెందుతుంది? ఆత్మత్యాగం (సమర్పణ) వల్ల లభిస్తుంది. 

 ఉత్తమోత్తమ శరణాగతి అనునది ఆత్మసమర్పణవల్ల ప్రాప్తిస్తుంది. భగవంతుడు లేదా యేదైనాఒక ఆదర్శమును మహోన్నతమైనదిగా గైకొనడంవల్ల అది ప్రారంభమౌతుంది. ఇక్కడ నేను ప్రాధమిక విషయాన్ని చెబుతున్నాను. ఆతర్వాత తమనుతాము అద్దానికి సమర్పించుకుంటారు. అదెలాగంటే, స్నానముచేయించువాని చేతిలోని శవంలాగ. అతడు యిష్టంవచ్చినట్లా శవాన్ని పైకెత్తి, కాళ్ళూ చేతులు అటూయిటూ త్రిప్పి స్నానంచేయిస్తాడు. ఆశవం  యేయిబ్బంది, అడ్డంకి కలిగించదు. ఇటువంటిదే మరొక ఉదాహరణను రామానుజులవారు, వారి వేదాంతగ్రంథమున తెలిపినారు. అదేమంటె,         పిల్లిపిల్లను తల్లి తననోటిలోని పళ్ళసందున యిరికించుకొని ఒకచోటినుండి మరోచోటికి తీసుకపోతుంది. పిల్ల కదలకుండా తల్లికి సహకరిస్తుంది. అహంకారాన్ని బ్రద్దలుకొట్టగల ఔషాదాన్ని నన్నివ్వమంటే, సర్వదోషహారిణి, అతిమధురము సర్వాంగములకు తగినది, పైతెలిపినఊదాహరణ మాత్రమే, అంటే స్నానంచేయించువాని చేతిలోని శవంవలె నుండుటే. నా ఆలోచనలో యింతకంటే మంచి ప్రక్రియ కానరాదు.

 ఒకమహాత్ముని మహత్తు హృదయంలో స్థిరపడితే అహంకారం నిర్మూలింపబడుతుంది. ఇందులో ఒకమర్మంకూడా దాగివుంది.ఒంటె పర్వతంచెంత నిలబడగానే దాని అల్పత్వం తెలిసొచ్చింది అన్నది ఒకనానుడి. ఏమిటా మర్మం? ఒకచిన్న విషయం. మనదృష్టి నట్టే ఆకర్షించింది. అది మనమనస్సు లోనేవుండి, మనలను మరొకరితోపోల్చి అంచనావేస్తుంది. అలా పోల్చుకొని యితరునికంటే తను అల్పుడనని గ్రహిస్తుంది. ఆవిధంగా మన అహంకారం పైన మనం మొదటిదెబ్బ కొట్టినవారమౌతాము. హృదయంనుండి యీ పోల్చిచూడడమనేదే తొలగిస్తే, పురోభివృద్ది అనేభావన హృదయందాటి ముందుకు కదలుతుంది. ఈపోల్చిచూడడ మనే గుణమే, మనమేమవ్వవలసివున్నదో యెఱుకపరుస్తుంది.

 ఎప్పుడైతే మనమేమవ్వాలో అనే ఆలోచన మనలో వేరుదన్నుతుందో, అప్పుడే మనస్సులో అది  మొలకెత్తడం ప్రారంభమై, మనం దాన్ని సాధించాలనే ప్రయత్నం మొదలెడుతాము. అప్పుడే కొంతవరకు మన ఆదర్శముతో మనకు సంబంధమేర్పడుతుంది. ఈహృదయానుబంధం అనగా ఆదర్శంపై ప్రేమ వేరుదన్నడం మొదలై మన ఆలోచన ఆవైపునకు మరలి మనలో నిరంతరస్మరణరగిలి వెనువెంటనే ఒకకొలిక్కి వస్తుంది. నిరంతరస్మరణ కొనసాగడం దృడమౌతుండడంతో దాని వేడి, విద్యుత్తు మనలను ప్రభువుకు పరిచయంచేస్తుంది. అలా ప్రభువుతోగలిగిన పరిచయంవల్ల త్వరితంగా ఆధార అక్షాగ్రమునకుజేరి మనలో నెలకొంటుంది. సహజమైన మార్గంలో మున్ముందుకు కదిలితే, యిదంతా యెంత సహజంగా, సరళంగా వున్నదో అర్థమౌతుంది. ఇంత ప్రయోజనకరమైన మివ్వన్నీ నాకు తెలిసి మీదరికి చేరుస్తున్నాను. ఇదంతా జరగడం మీచేతుల్లోనేవుంది. ప్రభునుండిసహాయం, అనగా భగవంతునిసహాయం, ఆయన అక్షాగ్రాలు నీలోపలా బయటయేర్పడియుండి, నీకు సహాయపడుతూనే వున్నాడు. 

   నీమాట ఆకొసకుచేరి అక్కడనుండి దివ్యధార నీవరకుచేర్చే సాంకేతికవిద్య యిదే. లేకపోతే సోదరా! గంపక్రింద బంధింపబడియున్న ఆడచిలుక యెంత అరచిగీపెట్టినా యెవరు వినిపించు కుంటారు చెప్పు? అరచిగీపెట్టేవారి స్వరంవినడానికి, వారినిచూడటానికి, దైవమునకు చెవులు కళ్ళులేవు. అన్నింటికి దైవమునకున్న సాధనమొక్కటే. సోదరా! ఆఖరుకు మనంకూడా అదేకొసకు చేరవలసియున్నది. మనంకూడా ఆమాదిరే (దైవం మాదిరే) అవ్వాలంటే మనచెవులు కళ్ళు పనిచేయకుండా పోవాలిసిందే మరి. అదే భగవత్సాక్షాత్కారము. ఇదివిని నీవుగానీ లేక ఇతరులెవరైనాగాని యేదోఒక సాధనంతో మీచెవులు కళ్ళు పొడిచేసుకుంటా రేమోనని నేను భయపడుచున్నాను.

 మీరు విషయం అర్థంచేసుకున్నారని భావిస్తున్నాను. మన మహోన్నతగమ్యం (చేరవలసిన ఆదర్శం) వలె మనంమారాలి. అది ద్రువాగ్రాలమధ్య దైవప్రేమప్రవాహంచేరి నిండినప్పుడే సాధ్యమౌతుంది. నిరంతరస్మరణమనే విద్యుత్‍ప్రవాహం హృదయాతరాళమునకు,మన గమ్యము (ఆదర్శము)నకు మధ్య  అనుసంధానముగా యేర్పడ వలసియున్నది. అతిముఖ్యావసరం నెరవేరు అదృష్టం కలిగితే, ఆస్థితి, సరిగ్గా ఒకకవి వర్ణించినట్లీ విధంగా వుంటుంది. “ఏజ్ఞానేంద్రియాల అవసరంలేకుండానే విజయాలు అరచేతికందుతాయి” అదెలాగంటే, ఆత్మ, మనంచేరస్వలసిన ఆదర్శం (గమ్యం) సహజంగా ఒకేతీరుగ ఒకటైవుంటాయి. భగవంతుడు మీకు దీన్నిపొందగలిగే ధ్యైర్యమనుగ్రహించుగాక! అందుకనువగు సహాయం భగవంతుడు మీకందించుగాక!

 ఈఆద్యాత్మికసాధన ఆద్యంతం బంగారమునకు సువాసన కలిగినట్లవ్వాలి. అలాకావాలంటే అదృష్టవశాత్తు, ఆదర్శం లేక మహోన్నతగమ్యం, ఒకమానవరూపంలో లభిస్తే, అదికూడా  మాగురువర్యులైన పూజ్యశ్రీ లాలాజి వారైతే సుసాద్యమౌతుంది. ఈఅదృష్టంకోసం హృదయంద్రవించి కన్నీటిపర్యంతమైన ప్రార్థనామయ పిలుపు కావాలి. లేదంటే యేవిదమైన ఆంక్షలకు లొంగని ఆమహాప్రభుని దయ, ఆయన తీయటియిచ్చపై అది ఆధారపడి వుంటుంది. వ్యక్తిగతంగా చేయాల్సిందేదైనా వుందంటే, అద్దానినిగురించి కబీరుమహనీయుడీ విధంగా సెలవిచ్చారు "ఆయన్ను పొందిన వారందరూ కన్నీటితోనే పొందారు" అనగా అతడు మనకంటికెలా కనబడినా, అమాయకత, కన్నీటిపర్యంతమైన దీనత, బాధాతప్తహృదయము అతనికుండాలి. ఇక ఆయన దయవిషయానికొస్తే, అది యిలా చక్కగా వివరింపబడింది.

 "దయామయుడైన భగవంతుడు, ఆయనకైఆయనే యీమహత్‍ప్రాప్తి మనకనుగ్రహించునేగాని, యేవ్యక్తి భుజబలం వల్ల యిది సాధ్యమగునది కాదు. 

  నాకుప్రాప్తించిన యీఅదృష్టము మీకందరికీ ఆమహాప్రభువనుగ్రహించుగాక. తదాస్తు!

  (S.P శ్రీవాత్సవగారి డివైన్ మెసేజెస్ అను పుస్తకమునుండి గ్రహించి, ఆంగ్లమునుండి తెలుగునకు అణువదించడమైనది )    

 

Thursday, 14 March 2024

వినమ్ర సేవ

 

వినమ్ర సేవ

                                       రచన:-పూజ్యశ్రీ రామచంద్రజీ మహరాజ్ , షాహజాన్ పూర్.   

 గమ్యముచేరే యాత్రలో నీవునాకు సహచరునివైనందుము నేనమితానందభరితుడ నయ్యాను. త్రోవలో నన్ను తోడుగాగైకొని నాసేవలు గైకొన్నావు. కానీ మధ్యలో యేమైనదో యేమోగాని నాసేవలుగైకొనడాన్ని నీవు నిర్లక్షంచేసినావు. నేనునీకు సహాయం చేయలేనని అనుకొని వుండవచ్చు. నేనునా విద్యుక్తధర్మంగా చెబుతున్నాను. ఉనికిలోనికొచ్చిన ప్రతిఆత్మయొక్క ముఖ్యకర్తవ్యమైన సత్యమార్గమును మాత్రము నీవు విడువవద్దు. నీవునీ ప్రాపంచికవిధులను చక్కగా నిర్వర్తిస్తూ అత్యిముఖ్యమైన భగవత్సాక్షాత్కారమార్గాన్ని నిర్లక్ష్యంచేయడం సరికాదు. ప్రియతమా! నీవు చేస్తున్నపని యెట్లున్నదంటే గవ్వలుయేరుకుంటూ, రాజ్యాధికారాన్ని వదులుకున్నట్లున్నది.

 ఆధ్యాత్మికత సులువుగా అందరికి అందుబాటులోనున్నది. శిరస్సునావైపునకు త్రిప్పితేచాలు అర్థమైపోతుంది. సంపూర్ణముగా నీకైనీవు లీనమైనంతనే నీవు వెదుకుయున్నదేదో అది నీచెంతనే వుంటుంది. పదివేలగొంతులు యెలుగెత్తి స్తుతించవచ్చు గాని, వారిస్వరం భగవంతునకు వినిపించదు. ఎందుకంటే ఆయనతో వారి హృదయాలు అనుబంధింపబడిలేవు. కాలం మనకెంతో అనుకూలమైయున్నది. ప్రకృతి ఔదార్యముగలదై దైవస్పందనలు యిక్కడ అక్కడ ప్రతిచోట అంతట వ్యాపింపజేసి మన అనుభవమునకు దెచ్చుచున్నది. నీకు అనువైన విధానములో జీవించయత్నించి, నిన్నునీవు మరచిపో. మన విధానాన్ని అనుసరిస్తున్నారా లేదా అనినేను పరిగణన లోనికితీసుకోను. ప్రతిఒక్కరు రవికాంతిలోనికి వచ్చి వారి గమ్యమునువారు చేరవలెనని, అందరికొఱకు నేను ప్రార్థిస్తాను.

 యోగమార్గము నిశ్చితమైనది. అది యితర విధానములకు భిన్నమైనది. అది నిలో స్వచ్ఛమైన దివ్యత్వమును పెంపొందించును. భగవంతుడు సూక్ష్మమైనవాడు. మనంకూడా భగవంతుని వలె సూక్ష్మతజెందాలి. అదే కలయిక లేక యోగం. స్ఠూలపద్దతిలో సాగు ఆరాధనలు, మానుకుంటే యోగం సిద్ధిస్తుంది. ఎందుకంటే నీవు చేరవలసినస్థలంలో ఏది గొప్పకాదు. దివ్యస్థాయికి చేరవలెనన్న, ప్రతీది నీవు వదులుకోవలసిందే. భగవంతుడు సరళుడు. అత్యంతసరళమైన విధానముననే భగవత్సాక్షాత్కారము సాధ్యము. ఈమాట మనము మరింతగా సూక్ష్మత జెందుటకు ప్రేరణ నిచ్చుచున్నది. స్థూలత జెందితే మనం వెనుకబడి పోదుము. నేను వస్తువుల నిజస్వరూపమును మీదృష్టియందుంచుచున్నాను. నిజమైన మార్గదర్శి (గురువు ) లభించి, ఆయనను సమ్మతితో అనుసరించినటైన భగవత్సాక్షాత్కారము ఒకజీవితకాలములోనే సాధ్యమగును. భగవంతుడే మనకు సరియైన మార్గదర్శి లభించునట్లు సహాయపడగలడు. అదికూడ మనలో సాక్షాత్కారము కొఱకు తపన తీవ్రతరం దాల్చినపుడు మాత్రమే సాధ్యపడును. సద్గురువు లభించెనన్న అనతికాలంలోనే విజయం లభించినట్లే. అన్వేషకునికి సరియైన మార్గదర్శి లభించినట్లైన అతడు సహజంగానే మార్గదర్శికి (గురువుకు) తన్నుతాను తనవిధిగా  సమర్పించుకుంటాడు. సమర్పణమన్న ఎఱుకకూడాలేకుండా పోతేనే సమర్పణ (శరణాగతి) పరిపూర్ణమౌతుంది. ఈతుదిదశను పొందాలంటే, మనం హృదయాంతరాళమున భక్తిని పెంపొందించుకోవాలి.

 యోగమున కవసరమైన సూత్రములు, విధానములనేర్పరచి యిచ్చుట, ఒక యోగసాధనోపదేశికునిగా అది నాబాధ్యత. ప్రత్యేకయోచనా విధానమును యోగము అనుమతించుచున్నది. ఒక పద్ధతిన జనులు యోగము నభివృద్ధిపరచుకున్నారు. అది మహోన్నతులైన వ్యక్తులనుత్పాదించినది. కనుక దీనికి వ్యతిరిక్తముగా యేఒక్కరు కూడా మాట్లాడ సాహసింపరు. నేనొకవిధానమున యోగాన్ని అనుసరిస్తున్నాను. నాకు సాధ్యమైనంత ఉత్తమసేవలందించడానికి, నాసహచరులను యీయోగాన్ని అనుసరించమని చెబుతున్నాను. ఈయోగ విధానము మాత్రమే బంధనములను ధ్వంసముజేయగలదు. ఎందుకంటే, ముఖ్యమైన ఆలోచనాశక్తి యీవిధానమున శుద్ధజీవవాహినిగా పనిజేయుచున్నది. అభ్యాసులు వారి బంధనములను విడిపించుకొనుటలో నేను సహాయపడతాను . మీరు యీజన్మలోనే మోక్షముపొందు స్థాయికి ఎదిగి రావాలన్నదే నా ఆశయము.

 నేనేమిటో నాకుతెలియదు. అయితే నాకైనేను మానవజాతికొక సేవకుడననుకొని, ఆవిధంగానే సేవచేస్తున్నాను. రెండుసంవత్సరాల సాధనానంతరం నాసహచరుడైన ఒక సమర్ధుడు, యితరులను తనసోదరులుగా భావించడం నేర్చుకున్నానన్నాడు. అతనికి జవాబిస్తూ, నేను సామాన్యులకు సేవచేయడం ఇరువదిరెండు సంవత్సరాల శ్రద్ధాపూర్వక సాధనానంతరం నేర్చుకున్నానన్నాను. మరోమాటలో చెప్పాలంటే, నాకు సేవా అన్న తలంపురాగానే నేనుమాత్రమే సేవకుడను, మీరందరు ప్రభువువులు అనుకున్నాను. ఇదే మనస్సును క్రమపరచు ఉత్తమమార్గము. నా సహచరులందరి లోనూ యిదేయోచన వుండాలనుకుంటున్నాను. అందులోనూ ప్రశిక్షకులలో యీభావన ముఖ్యంగా వుండితీరాలి. ప్రశిక్షకులలో యీభావనలోపించి, క్రమశిక్షణలేనివారైతే సంస్థ ప్రాణమే నశిస్తుంది. మనం యెలాప్రేమించాలో  నేర్చుకోవాలి. భక్తి హృదయానికి సంబంధించినది. పొగడ్తలు మేధస్సుకు సంబంధించినవి. ప్రశిక్షకుని క్రమశిక్షణారాహిత్యాన్ని యేవిధంగానూ నేను సహించజాలను. సందేహమేలేదు, నేను ఆధ్యాత్మికతను ప్రపంచవ్యాప్తం చేయాలనుకుంటున్నాను. అయితే నేను మాగురువర్యుల ఆదర్శమును యేవిధంగానూ వదులుకోవడానికి సిద్ధంగాలేను. అందుకే సంస్థ ఆదర్శమును భవిష్యత్తులో భంగపరచి, యితరుల యెదుట కించపరచుటను, నేను సహించజాలను. మానవప్రాతినిధ్య మార్పులెక్కడైనజరిగేవే. కానీ నిజసిద్ధాంతములు మాత్రం కాలగమనంలో మారిపోవడానికి వీలులేదు.  

  పరిపూర్ణమనుజుడు అందరి క్షేమాన్ని ఆకాంక్షిస్తాడు. ఎవరిపైనా అతనికి ఈర్ష ద్వేషముండదు. జనులు పుడతారు చనిపోతారు. అదే జననమరణ చక్రము. ఎవరు వినమ్రులై సమర్పణ భావముతో స్వార్థము విడనాడి, భగవంతునకు అనుసంధింపబడి వుంటారో వారిని తరతరాలుగా జనులు జ్ఞాపకముంచుకుంటారు. ప్రభువునెడ దాసుడెలా ప్రవర్తిస్తాడో, అలా అందరియెడల మన ప్రవర్తన వుండాలి. మనతీరు, నడవడి యితరులకు ఆదర్శప్రాయమై ఆందరియెడ అణకువతో మెలగి, వారు మనలను అహంకారరహితులుగా తలంచవలెను. నీవు గురువును హృదయపూర్వకముగా ప్రేమించినట్లైన, తత్‍ప్రభావము యితరుల మనస్సులలో ప్రబలముగా కనిపించి, ఇనుమయస్కాంతమునకు ఆకర్షింపడినట్లు మనవైపునకు వత్తురు. జనులందరి క్షేమమునకుగాక తనస్వార్థమునకు మాత్రమే ప్రాధాన్యతనిచ్చువాడు సంఘసేవకు తగడు. 

 సుదీర్ఘములైన ఉత్తరములు చదువుటవలన నేనలసిపోవుదు ననుకొనవద్దు. నాసహచరుల ఆధ్యాత్మికస్థితుల విషదీకరణలను ఆహ్వానిస్తాను. వారు వాటిని వ్రాసేక్రమంలో ఆ ఆద్యాత్మికస్థితులలో మునిగిపోయి వుండుటవలన వారికది ఉపయోగకారియే యగును. ఈవిధంగా వారు సాధనలో వారున్న ఆధ్యత్మికస్థితులను అర్థముచేసుకోగలరు. అందువల్ల వారిలో గ్రాహకశక్తి లేక అనుభవశక్తి పెంపొందుతుంది. నీవు నారూపమును ధానించాలా? లేక మాగురురూపమును ధ్యానించాలా? అని అడిగావు. ఈవిషయమై నాదృక్పదమును తెలియజేస్తాను. గురువు పరిపూర్ణుడైతే, అతనిరూపంపై ధ్యానించడంవల్ల హృదయం అమృతంతో నింపబడుతుంది. గురువు అయోగ్యుడైతే శిష్యునిపురోగతి ఆగురువు స్థాయిని మించిపోజాలదు. గురువు జడుడైతే, శిష్యుడు పాషాణమౌతాడు. అంతేగాకుండా గురువు శిష్యుల జడత్వాన్ని తొలంగించువిధానాన్ని తెలియనివాడైతే, అతనిపై శిష్యులు ధ్యానం చేయడంద్వార ఆ అసమర్థగురువు చెడిపోగలడు. శిష్యులజడత్వం ఆ అసమర్థుని గురువులో ప్రవేశిస్తుంది. కనుక దయచేసి యిట్టి విధానము నవలభించుటకు ముందే నేను తెలిపిన విషయములను పరిగణనలోనికి తీసుకోగలరు.

 నేను గురువునుకాను, గానీ మానవాళికి సేవకుడను. మాగురుదేవుల సూచనమేరకు, నేను నాసహచరులను సేవించుచున్నాను. ఎవరికంటెను నేను అధికుడనుగానని తలంచెదను. ఏమహోన్నతశక్తి కొఱకు వెదుకుచున్నారో అది వారిలోనేయున్నది. ఈస్వభావమే నీవు సహజమార్గసంస్థయందు  కనుగొందువు. నీవు హృదయపూర్వకముగా, మనఃపూర్వకముగా ప్రభువుకు శరణుజొచ్చిన  ఆమహాప్రభువుయొక్క సామ్రాజ్య మంతయూ నీదైపోవుట నిశ్చయము.

( శ్రీ S.P శ్రీవాత్సవగారి డివైన్ మెసేజెస్ అను పుస్తకమునుండి గ్రహించి, ఆంగ్లమునుండి తెలుగునకు అనువదించడమైనది )


Thursday, 7 March 2024

సహజమార్గమున నిజజీవితామృతము

 

సహజమార్గమున నిజజీవితామృతము

రచన-శ్రీ రవికుమార్, ప్రశిక్షకులు,రాయచూర్.

 మనపూజ్య గురువర్యులు శ్రీరామచంద్రజీ మహరాజ్‍వారు రచించిన సత్యోదయములోని మొదటి అధ్యాయాన్ని ముగిస్తూ వారు "నిజజీవితముయొక్క అమృతము, ఎప్పటికప్పుడు అవసరానికి తగిన స్థాయికి తననుతాను యెవడు చేర్చుకోగలడో అతనికి మాత్రమే లభ్యము" అని వ్రాశినారు. అందులో సూచించిన అమృతమంటే యేమిటి? అవసరానికి తగినట్లు తనకైతానుపొందవలసిన స్థాయి యేది? వీటిని గురించి తెలుసుకోవలసి యున్నది. పూజ్యబాబూజీ అంతిమసత్యస్థితి గనుక సందర్భానుసారముగా వారు వాడిన మాటలకు లోతైన అర్థం ఉంటుంది. ఈసందర్భంలో సుధ లేక అమృతము అంటే, అదివారి దివ్యప్రాణాహుతి.  అది అత్యంత తేలికైనది, సూక్ష్మమైనది. అంతకు ముందుటివాక్యములో వారు ఆ అమృతముయొక్క ప్రభావమును సూచిస్తూ యిలా వ్రాశారు. "సంపూర్ణముగా బంధవిముక్తి పొందవలెనన్న, మనము దైవలక్షణములకు సన్నిహితములగు సున్నితము, సూక్ష్మముగా పరిణతిచెందుటకు తపనపడుతూ పూర్తిగా దైవమువలె  మారవలసియున్నది."

 స్వేచ్ఛ నుండి స్వేచ్ఛ

బాబూజీవారి 80 వ, జన్మదినవేడుకల సందర్భంగా  గుజరాత్‍లోని అహమ్మదాబాద్లో 1979 ఏప్రెల్ 30 న, వారిచ్చిన సందేశములోని 3వ,పేరాలో  "సమ్మతితో ఆధ్యాత్మికజీవనము వైపునకు మరలుటే జీవిత ప్రారంభము. దాని అత్యుత్తమస్థితి, జీవితమందలిజీవితము. అది జీవితమందే దాగియున్నది మనమా జీవితమునకై ప్రయత్నించవలెను. అందులోనికి ప్రవేశించవలెను. మన అభ్యాస మంతయూ ఆ జీవనమునకు చేర్చునదై యుండవలెను, అని వారు ఉద్బోధించిరి. కనుక మనభౌతిక జీవితములో వారిజీవితం (ప్రాణం) ఉండుటే నిజమైన జీవితము. అదే అవసరమై పొందవలసిన స్థాయి లేక నిజమైన జీవితలక్ష్యము. అది సాక్షాత్తూ గురుదేవులే. ఒక అభ్యాసిగా మనకు గురుదేవులే నిజమైన లక్ష్యము. అయితే నిజమైన వారి సహజమార్గవిధాన సభ్యులుగా, వారి ఆశయమే మన ఆశయమై యున్నది.  వారు యేలక్ష్యము కొఱకు మానవునిగా అవతరించిరో ఆలక్ష్యమే మనజీవిత లక్ష్యము.

 జీవితమంటే యేమిటి?

బాబూజీవారి 79 వ, జన్మదినవేడుకల సందర్భంగా కర్ణాటకలోని బెంగుళూరులో 1978 ఏప్రెల్ 30న, వారిచ్చిన సందేశములోని 3వ, పేరాలో యిట్లు సెలవిచ్చిరి  "భగవంతుడీ ప్రపంచమును సృష్టించి అందులోని ప్రతిపుష్పమూ వికాసముచెందునట్లొనర్చెను. అయితే కాలముయొక్క కొరడాదెబ్బలు, భగవంతుని ఆశయమును విస్మరించునట్లు చేసెను. కనుక కొందరు జీవితాశయమును సుఖానుభవముగానూ మరికొందరు విసుగుజనించునదిగానూ తలంచిరి” అసలు జీవితమంటే యేమిటి అన్నది ప్రశ్న. జీవితకాలమంతయూ శాశ్వతముగా ఉన్నానన్న తలంపుతో, ప్రతిదశలోను ఉనికి పరిమళమును ఆస్వాదిస్తున్నదేదో అదే జీవితము.

 జీవరాశులేవైనపటికిని, అవి మానవులైనా, జంతువులైనా అన్నీ దైవస్వరూపాలే. సహజమార్గసాధన ద్వారా మనం బాబూజీవలె మారి, వారిలోని దైవగుణాలైన స్వచ్ఛత, ప్రేమను మనము వెలువరించవలసి యున్నది. మన జీవితలక్ష్యమైన మనగురువర్యులు మనదృష్టిపథంలో లేనట్లైన, మనం వారి ప్రేమను పొందలేము. అందుకొఱకు వేరెక్కడో అనవసరముగా వెతుకులాడు కొందుము. మనం సహజమార్గ విధానంద్వారా వారియెడల ప్రేమగలిగి యుండిన మనమూ అట్టిప్రేమను ప్రసరింపజేతుము. "అందరిని ప్రేమించువారిని (గురువును) ప్రేమించుము తద్వారా మనమందరిని ప్రేమింతుము"

 మనదృష్టిని వారి (గురువు) వైపునకు మరల్చి వారిపైనే నిల్పినట్లైన, సహజమార్గసారము లేక అమృతము, మనలను బంధనములన్నింటినుండి విడిపించును. ధ్యానము నిరంతరస్మరణ జీవనవిధానమై, మన ఉనికి యొక్క ఆశయము అదే అయితే, మనకు సత్యతత్వము లేక గురువర్యులే దృక్పదంలోవుంటే, మనము వ్యధలను సులువుగా భరింపగలుగుదుము. ప్రతీది మన కర్తవ్యముగా భావించి నిర్వర్తించినట్లైన, మనము బంధనము నుండి విడుదలబొందుదుము. మనం ప్రాపంచికవస్తువులను, వాటి సద్వినియోగం కొఱకు మాత్రమే సేకరించుకొని యుండుట వలన, నిజమైన వైరాగ్యమును పొందుదుము. మనకున్నటువంటి లేక సంప్రాప్తమైనదంతయు ఆమహాప్రభువు పవిత్రనిధియనీ, దాని నిర్వహణాబాధ్యత మనవిధియని తలంతుము .

 శాంతి మరియు ప్రశాంతత, సహజమార్గముద్వార సుసాధ్యము. అది వ్యకపరచుటకు వీలుకానప్పటికి, హృదయమున మాత్రమనుభూతి జెందుదుము. ఆయన ప్రాణాహుతిప్రసార స్పందలద్వారా ధ్యానమున ఆయన ఉనికిని అనుభూతిచెందుదుము. ఆయననుండి యేదోకాకుండ, ఆయననే ఆకాంక్షించినట్లయిన  ఆయన, ఆయనమాత్రమే రుచిలేనిరుచి స్థితితో మనలను ఆశీర్వదింతురు. ఆయనతో ఏకీకృతమవడంవల్ల, పక్షపాతరహితంగా, అందరము ఒకేవిధమైన భావనలు కలిగి వుందుము.

 బాబూజీ తన 79వ, జన్మదినంనాడిచ్చిన అదేసందేశంలో చెబుతూ, "మనం దుఃఖసమయంలో సహితం సంతోషంగా వుండాలి. అన్నిపరిస్థితులలోను ఆనందంగావున్నవాడే, నిజమైన సంతోషి. అది సత్పురుషునిలో ఒకభాగమైయుండును" అన్నారు. ఆయనతో, ఆయనలో మనంవుంటే, ఆనందం దానికైఅదే మనలో వికసిస్తుంది.

 ఉదయించే సమయం

ఒకవ్యక్తి జీవితలక్ష్యాన్ని సాధించాలంటే అతనికి పూజ్యబాబూజీ వంటి సంపూర్ణస్థాయి గురువు లభించాలి. ఆ గురువు చూపిన విధానాన్ని అనుసరించాలి. ఆమహనీయుడు కేంద్రము లేక భూమా నుండి అవతరించడానికి కారణమైన వారి ఆశయసాఫల్యత కోసం కృషిచేయాలి. బాబూజివారి 82వ, జన్మదినోత్సవం మలేషియాలోని  కౌలాలంపూర్‍లో 1981 ఏప్రెల్ 30న, జరుపుకున్న సందర్భంగా వారిచ్చిన సందేశంలో యిలా సెలవిచ్చారు. "మనసంస్థ ముఖ్యోద్దేశ్యము, వ్యాప్తిలోనున్న అనాధ్యాత్మిక స్థానంలో సహజమార్గముద్వారా  ఆధ్యాత్మికతను నెలకొల్పాలి. తద్వారా "నిద్రావస్థలోనున్న జనులారా! మేల్కొనండి. ఇది సూర్యోదయసమయం" అన్న గురువుల మేల్కొలుపుతో జాగృతపరచాలి. సంస్థసభ్యులు ప్రేమ, సహనం, సహకారంతో పనిచేస్తే, సంస్థ ఆశయం తప్పక నెరవేరుతుంది. అటువంటి, సూర్యునివలె ప్రకాశించు వ్యక్తులు సంస్థకొఱకు నాకుకావాలి. మన విధానము సరియైనదని తెలిస్తే, జనులు వారికైవారే ఆకర్షింపబడి సంస్థలో ప్రవేశిస్తారు”.

 బాబూజీ వంటిగురువు లభించాలని వ్యక్తులు ప్రార్థించాలి. సంస్థ ఆశయసాఫల్యతకై వారికృపనాశించాలి. అదే ప్రపంచ ఆధ్యాత్మికపునర్జీవనమునకు దోహదపడి, అణగారిన హృదయులను ఉత్తేజపరచి, మానవ జీవితలక్ష్యము వైపునకు మరల్చగలదు. తద్వారా విలువలతోగూడిన నాగరికత స్థాపింపబడును.

 బాబూజీగారితో అనుసంధింపబడి, అమృతమగు ప్రాణాహుతిని గ్రోలి, ఆధ్యాత్మికప్రగతిని బడసి, నిజమైన మనిషిగా మారినందులకు నిజంగా మనమెంతో అదృష్టవంతులము, ఆశీర్వదించబడినవారము.

 తేనెటీగలకు భూమి ఒకపూదోట. అందులోని పూలపైతిరుగాడి మకరందమును (అమృతము)గ్రహించి వాటితెట్టెలో దానిని తేనెగా రూపొందించుకుంటాయి. ఆవిధంగానే మన ప్రాపంచికజీవనాన్ని దివ్యజీవనంగా మార్చుకొనుటకు, బాబూజీగారి ప్రాణాహుతిని గ్రహిస్తున్నాము.

 భక్తి ప్రేమలతో మనల్నిమనం పూజ్యగురువర్యులకు సమర్పించుకున్నట్లైన, వారితో ఒక ప్రత్యేకబంధుత్వ మేర్పడి, మనమెవరమో, యేమిటో, యెందుకు మనిషిగా జన్మించితిమో తెలుసుకోగలిగితిమి. ప్రార్థన, ధ్యానము, శుద్ధీకరణ, నిరంతరస్మరణ అను యీనాలుగు సహజమార్గపువిధులను మనఃపూర్వకముగా అనునిత్యము పాటించినట్లైన, భగవంతుని సృష్టి, స్థితి, లయములలో మనకర్తవ్యమేమిటో మనకు అవగతమౌతుంది.

 అనంతమువైపు సాగు మనఆధ్యాత్మిక ప్రయాణములో, బంధవిముక్తికొఱకు ఆత్మను జాగృత పరచుటనునది ప్రారంభదశ. విజయమునకై చేయు పోరాటము ఆత్మోన్నతిలో ఒక‍అంశమే. అది మోక్షమునకు దారితీయును. అంతేగాక తదనంతర దశలను దాటించుచు, నిజగమ్యము లేక స్వదేశము వైపునకు తీసుకెళ్ళును. అంటే అది సృష్ట్యాదిన మనమీ రూపుదాల్చిన స్థానమునకన్నమాట. నిజానికీవిశ్వమున రూపుదాల్చిన ప్రతీది తమమూలమునకు తిరిగి చేరవలెనని ఆకాంక్షిస్తున్నది. అయితే ఆప్రక్రియ ప్రకృతినిబంధనల ప్రకారం దేశకాల పరిమితులకులోబడి జరుగుచున్నది.

 మనము మోక్షముతోసహా అనేకదశలను దాటుచూ సహజసాక్షాత్కార మార్గమున పురోగమిస్తున్నప్పుడు, మన గురువర్యులు దివ్యచైతన్యము లేక మూలతత్త్వమేయని తెలిసి , అనుభవమున గ్రహింతుము. సహజమార్గప్రార్థన తుదివాక్యములో చెప్పినట్లు ఆయనే (గురువే) మనలను గమ్యముచేర్చు యేకైకస్వామి, యిష్టదైవము.

 నిజమైనగమ్యము వైపునకు సాగుచూ, దివ్యత్వముజెందుటకై పదార్తము శక్తిగా మార్పును సంతరించుకొనుచుండుటను గమనించిన, అది (సహజమార్గము దృష్ట్యా) రాజయోగప్రభావ ప్రకటితమని తెలియుచున్నది

 (కడప బసంత్ (14-02-2024) లో శ్రీ రవికుమార్, ప్రశిక్షకులు,రాయచూర్ వారు ఆంగ్లములో యిచ్చిన ఉపన్యాస పాఠమునకిది తెలుగు అనువాదము- అనువాదం :- శ్రీ పి. సుబ్బరాయుడు, ప్రశిక్షకులు, కడప ) 


 

Friday, 1 March 2024

భగవత్‍సాక్షాత్కారము

 

భగవత్‍సాక్షాత్కారము

                                                  ----శ్రీరామచంద్రజీ, షాజహాన్ పూర్ 

ఉన్నదొక్కటే ఆత్మ అనుభావనను కాదని, అనాత్మ లేక, లేనిఉనికి, శున్యము (సున్న) ఉన్నదను వివాదరహిత భావనను స్థిరపరచుకొన్న తవాత, కష్టరమైన  భగవత్‍సాక్షాత్కారమును తగినవిధంగా నిర్వచించు కార్యమును చేపట్టవచ్చును. అనాదిగా భరతదేశమున ప్రముఖంగా భగవత్సాక్షాత్కారమే అత్యంత ముఖ్యధ్యేయంగా (పురుషార్థంగా) ప్రకటింపబడింది. కాని భగవత్‍భావన వలెనే భగవత్‍సాక్షాత్కారము కూడా, హేతువాదదృక్పదము, సద్భావశాస్త్రసమ్మతితో ఆలోచించు మనిషి, ఆమాట అనగానే మర్మములనెడి పొరలలో చిక్కుకొని ఒకనిర్ణయమునకు వచ్చుటకు విసుగుపడుచున్నాడు. అందుకే భగవత్‍సాక్షాత్కారమునకు తగిన నిర్వచనము, అనువగు అన్వయము, సత్యశోధనకు శాస్త్రజ్ఞులకుపయోగపడురీతిన హేతువాదస్థాయి అవగాహనకు, తగినట్లుండవలెనని, నాబుద్ధికి తోచినది.

 సామాన్యముగా మాట్లాడుకొను భాషలో, సాక్షాత్కారము మనస్తత్వ క్రమమగు విజ్ఞానమును సూచించును. ఏదియేమైనా భారతీయయోచనా విధానములో, సాక్షాత్కారమందు, మూడుగానున్న జ్ఞాన, దర్శన, ప్రవేశ లేక అనుభూతికల్గుటయై యున్నవి. వాడుకలో సాధారణంగా మొదటి రెండింటినిమాత్రమే సూచించుచున్నారు. కానీ భారతద్రష్ఠలు సరియైన అర్థమున, భగవత్‍సాక్షాత్కారమన  కేవలము భగవంతుని హేతువాదదృష్ఠ్య అధికారికముగా తెలిసికొనుటేగాక (శూన్యము,సున్నా లేక అనాత్మగా) యధార్థము గ్రహించి, దర్శించి క్రమముగా భగవంతునిలో కలిసిపోయిరి. ఇక మనము భగవంతుని సున్నాగా (పూజ్యముగా) నిర్వచించితిమి. ఇంతకూ అనాత్మను తెలిసికొనుట, అదిగా మారిపోవుట అనగా దేనిని సూచించును? ఆత్మయననేమి? అన్న ప్రశ్నతో ప్రారంభిద్దాం. అపరిపక్వ (మొరటు) అవగాహనతో మామూలుగా ఆత్మను శరీరమనుకొందుము. నవ్య  మనస్తత్వశాస్త్రము ప్రకారము జీవిగా (నిర్మితశరీరము గలదిగా) భావింతుము. ఈదశలో ఒకవిధమగు అవగాహన వుండును. భారతద్రష్ఠల అపరిపక్వ (మొరటు) దృక్పదము ప్రకారము ఆత్మలు  (ప్రాణులు) దేహానుభూతిలోనుండు శక్తితో  ప్రవర్తిల్లుచుండును. అటువంటి వ్యక్తి శారీరక ప్రేరణలకు సుఖదుఃఖములకు దాసుడైయుండును. గతించిపోయిన ప్రముఖులలో, సోక్రటీసు లేదా గాంధీ ఉదాహరణ చూడుడు. వారు తమ్ముతామెఱిగి జీవించిరా? ఒకజీవిగా లేక శరీరముగా కాక అంతకుభిన్నముగా ప్రవర్తించిరా? ఖచ్చితంగా చెప్పాలంటే, స్వభావసిద్ధమైన మరియు  పరిగ్రహించిన ధోరణులతో సంఘటితమైన వ్యవస్థగా వారు దాదాపు స్థిరీకరింపబడి యుండిరి.

 నేటి మనస్తత్త్వశాస్త్రరీత్యా, వారుతమ గుణగణము లేక వ్యక్తిత్వపు స్థాయిలో జీవించిరేగాని, సంఘటిత దేహి (దేహములోని ఆత్మ) గా కాదు. ఈస్థాయిలో వ్యక్తి  (దేహధ్యాస గల వ్యక్తి) మానసికధ్యాస (ఆత్మయొక్క ఎఱుక) వైపునకు మరలును. నవ్యమనస్తత్త్వశాస్త్ర ప్రకారము దానిని వ్యక్తిత్త్వధ్యాసగా గుర్తింపవచును. ప్రతిమనిషి జీవిగా మొదలై దాదాపు వ్యక్తిత్త్వముగల ఆత్మగా పరిణతిజెందుతాడు. ఇట్టి పరిణతిజెందిన నిర్దుష్ట ఉదాహరణలుగా సోక్రటీసు, గాంధీలను జూపవచ్చును. ఇట్టి నిర్దుష్ట ఉదాహరణలైన వ్యక్తులను, రెండు స్థాయిలలో జూడనగును. మొదటిస్థాయి అట్టడుగునగల వ్యక్తి, ఒక పశువుగాను లేక అప్పుడేపుట్టిన బిడ్డస్థాయిలో నుండును. రెండవ అత్యుత్తమ కడపటిస్థాయిలో, ఉదాహరణలుగా ఒక సజీవ సోక్రటీసు, గాంధీ, రాణాప్రతాప్ కనపడతారు. వారు అనాత్మగా, మరింతస్పష్టంగా చెప్పాలంటే అతిస్వల్పస్థాయి నిజాత్మగా గోచరిస్తారు. రెండవస్థాయి వరకు ఎదిగిరావడమంటే, ఒకసున్నిత లేక అతిస్వల్ప నిజాత్మసాక్షాత్కారము పొందుటే యగును. ఒకవిధంగా చెప్పాలంటే తొలిస్థాయిలోనుండిన అపరిపక్వ (మొరటు) ఆత్మభావవిచ్ఛేదన వల్లనే  యిది సాధ్యమగును. 

సున్నితత్వపు దశలు

సవివర విశ్లేషణ చేయదలచి, నేనీ రెండుదశలను మాత్రమే ఎన్నుకొంటిని. అవికూడా అనుభవమునకు దగ్గరగానుండుటచేత, యిట్టే చెప్పదలచితిని.  అంతేగాక సాంఘికజంతువైన ప్రతిమానవుని అవగాహనకు యివి అనువుగానున్నవి.  కానీ నిజానికి  ఆత్మయొక్క అతిసున్నితస్థాయిలు గణింపవీలులేనన్ని యున్నవి. సరిగ్గారెండవదశ మొదలవ్వగానే దేహస్మృతి తగ్గిపోయి, కేవలమొక జీవినన్నధ్యాసగానో, లేక ఆత్మచేతి పరికరముగానో  ఎఱుకగలిగి యుండునునేగాని, తనే ఆత్మనన్నధ్యాస వుండదు. అట్లే యింకాస్త ముందుకు వెళితే ఆధ్యాసకూడా  తగ్గిపోయి, మనస్సు మరియు వ్యక్తిత్వధ్యాస గలిగి వుండును . అప్పుడుకూడా తను ఆత్మగాకాక, ఆత్మనావరించి యున్న పలుచనిపొరగా భావించుకొంటాడు. ఈస్థాయిలో దేహస్పందనలైన సుఖదుఃఖములు, స్వతహాగాకలిగిన మరియు పరిగ్రహించిన గుణగణ ప్రవర్తనలన్ని  క్షీణదశకుచేరుకొని మన ప్రభువులస్థాయినుండి మన దాసులస్థాయికి పడిపోతాయి. 

 ఈస్థాయికిజెందిన ఉచ్చస్థితిలో స్థానమేర్పరచుకున్న వ్యక్తి తనలో స్వతహాగానున్న  మరియు పరిగ్రహించిన గుణగణములకతీతుడై వాటి ప్రభావములకు లొంగిపోడు. అనగా వాటి ప్రభావ మతనిపై వుండదు. భారతద్రష్టల సాంకేతికభాషననుసరించి, అతడు స్వేచ్ఛ (మోక్షము) పొందెననవచ్చును.  అతడు తనస్వాభావిక మరియు అలవరచుకున్న గుణములను తొలగించుకొనియుండును. ఇది సామాన్యుల కనుభవమునకు వచ్చు విషయముకాదు.  మరొకరకంగా చెప్పాలంటే కలలుకూడారాని గాఢనిద్రావస్థకు దగ్గరగానుండు స్థితియిది. దీనినే నిర్వికల్పసమాధియని యోగాభ్యాసకులు పిలుతురు. ఈస్థితి స్వల్పకాలము మాత్రమే అనుభూతమగును. ఈస్థితిలో శాశ్వతముగా నుండెడి వ్యక్తి, ఆత్మయొక్క మరింత సున్నితస్థితిని సాక్షాత్కరించుకొని యుండును. తొలిదశలోనుండువ్యక్తి దృష్టిలో, యితడు (అనాత్మ) దైవమునకు మరింతచేరువైనవాడై యుండును. 

    శాస్త్రీయ స్ఫూర్తి

ఇక మూడవస్థాయిని గూర్చి విచారింతము. ఇది కూడా మన ఆధ్యాత్మిక ప్రయాణమున చివరిమజిలీకాదు. ఇంకనూ అసంఖ్యాకములైన దశలను దాటి వెళ్ళవలసి యున్నది. ఆదశలను హేతువాదదృక్పదముతో వివరించుటకు వీలుపడదు. అట్లని అవి అవాస్తవ కల్పితములని కాదుగాని, అవి హేతువాదమునకందనివని మాత్రము సూటిగా చెప్పవచ్చును. కుతూహలముతో శాస్త్రీయదృక్పదము రీత్యా ఎవరైనా యీఅనాత్మ (దైవము) ను వివరింపదలచుకుంటే, వారు యీస్థాయి సాక్షాత్కారానుభవమును నేరుగా పొందుటకు సిద్ధమై రావలసినదిగా ఆహ్వానము పలుకుచున్నాను. అనుభవముపొందిన మీదట వారీ స్థాయి వివరములను తర్కము మరియు సాంప్రదాయశాస్త్రరీత్యా వెల్లడిచేయ ప్రయత్నించవచ్చును.

 ఈసందర్భములో ఎవరైనా ఒక సహేతుక ప్రశ్నవేయవచ్చును. వాస్తవంగా చెప్పాలంటే, యీస్థాయిలోని స్థితులు ఆత్మయొక్క సున్నితము, మరింతసున్నితమునైన సాక్షాత్త్కారమే. ఇంతకూ సంపూర్ణమైన అనాత్మ (దైవము) అనేదేమైనా వుందా? ఉంటే ఆత్మకెప్పటికైనా సాక్షాత్కారం సాధ్యామౌతుందా? పూర్తిగా ఆత్మ అనాత్మగా (దైవంగా) మారిపోతుందా? సందేహమక్కరలేదు. తర్కించిచూస్తే అనాత్మలో ఆత్మ ఇమిడియున్నది. మనమొకసారి ఆత్మ వున్నదన్న సత్యాన్ని, అంటే ఆత్మయొక్క ఉనికిని అంగీకరించి నట్లైతే, అనాత్మనుసైతం లేదనలేము. అసలు ఆత్మభావనే అనాత్మభావనగా మారిపోతుంది. ఇక రెండవప్రశ్నకు వద్దాం. నిజంచెప్పాలంటే అనాత్మ, క్రమేణ తరిగిపోయిన ఆత్మే.

 నేనీవిషయం వాతావరణంలోని గాలిని ఉదాహరణగా తీసుకొని వివరిస్తాను. భూమి ఉపరితలంపైన గాలిపొర బరువుగాను, దట్టంగానువుంటుంది. భూతలంనుండి పైకివెళ్ళేకొద్దీ గాలి పలుచబడుతూ తేలికౌతూ పోతుంది. అయితే గాలిస్థితి, గాలిలేనిస్థితిగా మారిపోతుందా? హేతుబద్ధంగా ఆలోచిస్తే అది అసాధ్యం. ఆత్మ, అనాత్మకు అతిదగ్గరగా వుంటుందేగాని, పూర్తిఅనాత్మ కాజాలదు. అనాత్మముందున్న యీ "పూర్తిగా" అన్నపదమే, ఆత్మ, అనాత్మను యెన్నటికి చేరుకోలేదన్న విషయం ద్రువపరుస్తున్నది. నేనీవిషయాన్ని మరోవిధంగా విషదపరచదానికి గణితశాస్త్ర ఉదాహరణ నిస్తాను.

అంతిమసత్యము

ఒకనాస్తికునిదృక్పదంతో ప్రారంభిద్దాం. నేను దైవాన్ని సున్నాగానూ, ఆత్మను ఒకటిగానూ తీసుకుంటున్నాను. ఆత్మను (ఒకటిని) క్రమేణ దశాంశస్థానముల పరంగా తగ్గించుకుంటూపోతే, అది రానురానూ సున్నా లేక అనాత్మ లేక దైవంస్థానాన్ని సమీపిస్తుంది.(అంటే 0.1, 0.01, 0.001, 0.0001... అలాగా) కానీ దశాంశబిందువు తర్వాత యెన్నిసున్నాలు చేర్చినాసరే, అదిపూర్తిగా సున్నాస్థాయికి తగ్గించబడదు. అయినా యిది తర్కమురీత్యా వాదన. అంతిమసత్యం యిటువంటి  తర్క హేతువాదమున కతీతమైనది. కనుక రెండవప్రశ్నకు సయైనసమాధానం చెప్పడం సాధ్యముగాదు గానీ, అది ఆర్జించవలసిన జ్ఞానమైయున్నది. కుతూహలముగలిగిన సత్యశోధకులు ధైర్యముగా తమంతతాముగా సాధనమున తెలుసుకోవచ్చును.

బుద్ధభగవానుడు, యిటువంటి ప్రశ్నలడిగినపుడు యేమియు మాట్లాడక మౌనమువహించెను. అంతమాతమున ఆయనకీ విషయము తెలియదనికాదు, సరియైన స్థాయికిచేరి, నేరుగా అనుభవ జ్ఞానమున అర్థముచేసుకోవలసినదేగాని, నిమ్నస్థాయిలో జ్ఞానవర్గీకరణతర్కమున వివరించ ప్రయత్నించిన, అది యెంతచక్కగా చెప్పినప్పటికీ  గందరగోళముగనే వుండును. మరింతప్రయత్నించిన, అది విఫలప్రయత్నమై హాస్యాస్పదమగును.

 ఇక విషయము సమగ్రపరతుము. నేరుగా మనకు ఆత్మ (నేను) తెలియును. తారతమ్యవిచారణమున అనాత్మయున్నదనియు మనము సమ్మతింతుము. కానీ దైవమును సకారాత్మకముగా మరొకదానితో పోల్చిచూచు ప్రశ్న ఉత్పన్నమైనపుడు మాత్రము, మనకు దైవముతో పోల్చిచూచుటకేదియు కానరాదు. కనుకనే వేదములు నకారాత్మకముగా ఇదికాదు, ఇదికాదు (నేతి,నేతి) అనియే వివరించినవి.  వ్యక్తి తనస్థాయిలో ఎఱుకగలిగి గ్రహించుశక్తిగలిగి యున్నాడు. దైవమును సాక్షాత్కరింపజేసి కొనగలడుకూడా. అంతేగాని దానిని యింత, యిది, యిదమిద్దమని కొలిచి చెప్పజాలడు. సత్యతత్త్వములోనికి చొచ్చుకొనివెళ్ళిన వ్యక్తి మాత్రమే, సకారాత్మకముగా పోలికతో దైవమును విషదీకరింపగలడు

(ఆధ్యాత్మజ్ఞాన్ (అక్టోబర్-డిశాంబర్) 2023 నుండి గ్రహించి తెలుగున కనువదించడమైనది)

 

          

పూజ్యలాలాజీ మరియు మన ఆధ్యాత్మికప్రగతి

  పూజ్యలాలాజీ మరియు మన ఆధ్యాత్మికప్రగతి సోదరీసోదరులమైన మనమంతా యిక్కడ యీదినం (ఫిబ్రరవరి 14/ బుధవారం 2024) మన ఆదిగురువులైన పూజ్యలాలాజీవారి 1...