Saturday, 4 November 2023

బోధామృతము

 

బోధామృతము

మనిషియొక్క కుర్పు, యీవిశ్వముయొక్క కూర్పు ఒక్కటిగనేయున్నవి. ఈవిశ్వము రూపుదాల్చుటకు వెనుక లెక్కలేనన్ని సూక్ష్మ, సూక్ష్మాతిసూక్ష్మ ప్రతిరూపములున్నవి. ఆవిధంగానే యీమానవస్థూలశరీరము వెనుకగూడా సూక్ష్మ, సూక్ష్మాతిసూక్ష్మ రూపముల అస్తిత్వములున్నవి. అన్నిటికంటే బాహ్యరూపమీ స్థూలశరీరము. దీనివెనుక సూక్ష్మశరీరము, కారణశరీరములున్నవి. ఈమూడుశరీరములేగాకుండా, గణింపశక్యముకానన్ని సున్నిత ము, సూ క్ష్మమునైనవున్నవి. విజ్ఞులు వీటిని శరీరములనక ఆత్మకు చుట్టుకొనియున్న సున్నితపొరలనిరి. నిజానికి యీసున్నిత సూక్ష్మపొరల కొక్కకదానికి ఒక్కోపేరుపెట్టుట అసాధ్యమైయున్నది. అవి అసంఖ్యాకములు. సూక్ష్మాతిసూక్ష్ష్మమైన వాటినుండి స్థూలాతిస్థూలమైన యీపొరలన్నికలసి భౌతికప్రపంచపు నకలుప్రతిగా లేక సంపూర్ణవిశ్వంభర భగవానుని ప్రతిరూపముగా అనగా ఏకబిందువు (సున్న) ఆధారముగా ఏర్పడిన బహువృత్తసముదాయముగా మనిషి వ్యక్తమగుచున్నాడు.

  -- శ్రీరామచంద్రాజీ, షాజహాన్‍పూర్.  ("ఆధ్యాత్మ జ్ఞాన్" జూలై-సెప్టంబర్ 2023 లో ప్రచురించబడినది)

 💥💥💥  

 అత్యంతముఖ్యము మరియు అపజయమెఱుగని సాధనము ప్రార్థన. భక్తిప్రేమలతో మనల్నిమనం సమర్పించుకొని (శరణాగతిపొంది) చేసిన ప్రార్థన ఆభగవంతునితో మనకు సంబంధమేర్పరచును. ప్రార్థనతో మనప్రభువునెదుట మనం వినయముతో దాసునివలె నిలబడి, మనవాస్తవస్థితిని విన్నవించుకొని, ఆయన ఇచ్ఛకుసంపూర్ణముగా మనల్నిమనం సమర్పించుకొందుము. ఇదే సరైన ప్రార్థన. ఆమహాప్రభుని ఇచ్ఛతోమనం సంపూర్ణసంతృప్తిని పొంది జీవించవలెను. అత్యవసరమైనవాటికై లేమితో మనస్సు విపరీతముగా కలత జెందినప్పుడుతప్ప, అల్పములైన ప్రాపంచికవస్తు సముపార్జనమునకై, భగవంతుని ప్రార్థించుట అవివేకము. మనల్నిమనం సంపూర్ణముగా మరచిపోయినస్థితిలో ఆమహాత్ముని, ఆసర్వశక్తిమంతుని, ఆసంపూర్ణాత్మకుని మాత్రమే, పూర్ణముగా మనస్సు లగ్నముచేసి, ప్రేమలో మునిగిపోయి, సర్వదా ప్రార్థించవలెను. ఇదిమాత్రమే సరియైన ప్రార్థనావిధానము. ఈస్థితిలో చేసిన ప్రార్థన ఆమహాప్రభువు వినకపోవుటగానీ, అనుగ్రహించక పోవుటగానీ జరుగనే జరుగదు - శ్రీరామచంద్రాజీ, షాజహాన్‍పూర్  ("ఆధ్యాత్మ జ్ఞాన్" జూలై-సెప్టంబర్ 2023 లో ప్రచురించబడినది)

v  

భగవంతుడు లేడన్నఆలోచనతో మనమెప్పుడూ వుండరాదు. ఉన్నాడన్న యోచనతోనే మనముండవలెను. అసలాదైవమే మనజీవితలక్ష్యము. మనందరము దైవమువైపునకే పయనించుచున్నాము. లేదంటేకొందరము తెలిసి మరికొందరము తెలియకనే అటువైపునకు పయనించుచున్నాము. ఎఱుకతో పయనించువారిస్థితి  నిశ్చలమైన నీటిలో యీదులాటవలె నుండును. అట్లుగాక ఎఱుకదప్పి పయనించువారిస్థితి, ఎడారియిసుకలో కాళ్ళూచేతులు ఆడించువారివలె వుండును. గురువు సాధకునకు దైవమునకు మధ్యవర్తిత్వము వహించును. ఆయన అభ్యాసికి భగవంతునకు ఒకబంధమేర్పరచ ప్రయత్నించును. ఆకార్యము సఫలీకృతమైనంతనే ఆయన కర్తవ్యము పూర్తగును.

v  

జీవితము అర్థవంతమైనది. ఎందుకంటే దానితోపాటు ఒకశక్తి వెలువడుచున్నది. ఆశక్తిని తమలో యిముడ్చుకోదలచువారికి, దివ్యమైన ఆశక్తే తననుగురించి గుర్తుచేయును. ఆధ్యాత్మికజీవనమును అంగీకరించి, ఆవైపునకు మరలదలచుకొనుటతో అసలైన జీవితం ప్రారంభమౌతుంది. ఆజీవితంలోని అత్యంత‍ఉన్నతస్థితే జీవితంలోనిజీవితం. అది ఆజీవితంలోనే యిమిడివుంటుంది. అట్టిజీవితంలోనికి ప్రవేసించడమే మన ముఖ్యకర్తవ్యమై యున్నది. మన అభ్యాసము అట్టిజీవితము వైపునకు మనలను నడిపించును.---(శ్రీరామచంద్రజీ, షాజహాన్‍పూర్‍వారి 80వ జన్మదీనోత్సవం సందర్భంగా గుజరాత్‍లోని అహమ్మదాబాద్ (30 -04-1979)లో వారిచ్చిన  సందేశమునుండి గ్రహించడమైనది. ఆధ్యత్మజ్ఞాన్ అక్టోబర్-డిశంబర్ 2021లో ప్రచురించబడినదది.

 💧💧💧


కోరికలు అంతరించినవనగా సంస్కారములంతరించైనవని అర్థము. ఇక పూర్వసంస్కారఫలితము లనుభవించుటే మిగిలియున్నది. ఇవి జీవితకాలములో  ఒక పద్ధతిప్రకారము అమర్చబడి అనుభవమునకు వచ్చును.—(సత్యోదయము.  ఆధ్యాత్మజ్ఞాన్ ఆక్టోబర్-డిశంబర్2019లో ప్రచురించబడినది


 💛💛💛

  అత్యవసరమైన ప్రత్యేకసందర్భములలో తప్ప సాధారణప్రాపంచిక లాభములకై ఆమహాప్రభువును ప్రార్థించుట అవివేకము. అయినప్పటికిని నియమిత ఫలితములకై ప్రభువును ప్రార్థించుట సక్రమమేయగును. ఇట్టివి మర్యాదా ప్రదమైన నిబంధనక్రిందికి వచ్చును. ఇది మనసర్వస్వము ఆయన కప్పజెప్పి ఆయనను ప్రభువుగా సమ్మతితో అంగీకరించుటను సూచించును. ---(శ్రీరామచంద్ర సంపూర్ణరచనలు మొదటి సంపుటి 1989 నుండి గ్రహింవబడినది. ఆధ్యాత్మజ్ఞాన్ ఆక్టోబర్-డిశంబర్ 2021లో ప్రచురించబడినది)

v  

గృహమే, ఓర్పు వినయముల నలవరచుకొనుట కుపయోగపడు పాఠశాల. సరిగ్గాఆలోచిస్తే ఓర్పు ఒకతపస్సే. అది యితరతపస్సులకంటే ఉత్తమమైనది. కనుక దుఃఖము అసహనమునకు మారు ఉదాసీనవైఖరి నవలంభించుట మంచిది. ఇతరులు తిట్టి చీవాట్లు పెట్టినపుడు అనుతాపమొంది, తప్పుతనదే ననుకొని ఓర్పునలవరచుకొనవలెను. ఓర్పు సహనము అలవడి,ప్రాపంచిక దరవస్థలనుండి విముక్తిపొందుటకు, అరణ్యములకేగుట, జనులతో సంబంధములేకుండా ఏకాంతవాసముగడపుట వంటివి, ఇతరులకుపయోగపడునేమోగాని, మనకుమాత్రము మనకుటుంబసభ్యుల, మిత్రుల  మరియు ఈతరుల చీత్కారములు, ఆక్షేపణలు, తిఉర్స్కారములను ఓర్పుతో సహించిజీవించుటే, మనముచేయు తపస్సు.  (మహాత్మ   రామచంద్ర స్వీయచరిత్ర-1 నుండి గ్రహించబడి.  ఆధ్యాత్మజ్ఞాన్  ఆక్టోబర్-డిశంబర్2019లో ప్రచురించబడినది

                                                                             v  

అతిత్వరితముగా గమ్యముచేరవలెనను ఆతురుత, నిరంతరఆవేదన, కలిగియుండుట అనునవి మనత్వరిత విజయమునకు తోడ్పడు అంశములు. సత్యతత్వమును అనగా అనునిత్యప్రశాంతత, శాంతి పొందునంతవరకు మనమొక క్షణమేని విశ్రమింపదగదు. మనమొక దానిని పొమ్దవలెనను తీవ్రమైన ఆకాంక్ష మనలో దానికై ఎనలేని అశాంతిని కలిగించును. ఆశించినది అందిననేగాని, మనలో ఆతీవ్రఆతురత శాంతించదు.—( సత్యోదయంనుండి గ్రహించడమైనది. ఆధ్యాత్మజ్ఞాన్  ఆక్టోబర్-డిశంబర్ 2019లో  ప్రచురించబడినది)

                                                                                      v  

పరిపూర్ణస్వేచ్ఛ మానవులకొరకే కేటాయించబడి యున్నది. ఆస్థితికి మిమ్ములనందరను గొనిపోయెదనని మాగురువర్యులకు యిచ్చినమాట నేను నెరవేర్చ వలసియున్నది. నిమేషమాత్రమున ఎవరిలోనైనను నేను మార్పుతేగలను. అయితే అందులకు వారు నేను విధించిన సాధనావిధానమునవలంభించి అర్హమైనస్థితిని వారియందు ఉత్పన్నముచేసుకొనవలసియున్నది. -  శ్రీరామచంద్రజీ,  షాజహాన్‍పూర్   ఆధ్యాత్మజ్ఞాన్.   జనవరి-మార్చ్ 2022)

v  

ప్రార్థన అనగా పరమాత్మవద్ద యాచించుట. ధ్యానము యాచించినది పొందుట. స్మరణలోనుండుటనగా యోగ్యమైనస్థితిలో నుండుట. ఎఱుకదప్పియుండుటనగా ఉనిఇలోవుండుటే. అభావస్థితిలోయుండుటనగా ఉనికే లేకుండుస్థితి. . -  శ్రీరామచంద్రజీ,  షాజహాన్‍పూర్   ఆధ్యాత్మజ్ఞాన్.   జనవరి-మార్చ్ 2022)

     v  

మానవులందరియెడ మనము సహృదయులమై యుండవలెను. అప్పుడే శక్తి వారిలోనికి  యదేచ్ఛగా ప్రవహించును. ఆధ్యాత్మికపునరుజ్జీవనమునకు ఇది మొదటిమెట్టుగా నేను భావింతును. ఆధ్యాత్మిక భవననిర్మాణము యీపునాదిపైనే నిర్మించవలసియిన్నది. మానవశ్రేయస్సును మనస్సునందుంచుకొని కార్యనిర్వహణ గావింపనెంచినట్లైన ఆపని యదేచ్ఛగా నెరవేరును. అయితే జనులు సరైనవిధానము నవలంభించునట్లు వారిని తీర్చిదిద్ద వలసిన బాధ్యత మనపై యున్నది. జనుల కొఱకై నీవేదైనా చేయదలచినయెడల, అది కోరిక కానేరదు. అది నీకర్తవ్యమగును. మానవజాతినంతటిని ఉద్ధరించవలెనని నేను వాంఛింతును. అటువంటి విశాలహృదయము మాగురువర్యులు నాకొసగినారు. మాగురుదేవుల అభయహస్తము నావెన్నుదట్టి ప్రోత్సహించుచున్నది.--శ్రీరామచంద్రజీ, షాజహాన్‍పూర్‍వారి 80వ జన్మదినంసందర్భంగా గుజరాత్‍లోని అహమ్మదాబాద్‍లో (30-04-1979) యిచ్చిన సందేశంనుండి గ్రహింపబడినది. ఆధ్యాత్మజ్ఞాన్ ఏప్రిల్-జూన్ 2021లో ప్రచురించబడినది.

        💚💚💚 

 ఆధ్యాత్మికత దివ్యత్వలో అంతరించిపోతుంది. దివ్యత్వము దాని నిజతత్వములో అంతరించి పోతుంది.----- శ్రీరామచంద్రజీ, షాజహాన్‍పూర్.

                (ఆధ్యాత్మజ్ఞాన్ ఏప్రిల్-జూన్ 2021లో ప్రచురించబడినది.                                                             💥💥💥
నిరంతరస్మరణ అనుభవమునకు వచ్చునది కాదు. అది చేయవలసిన పని. శ్రీరామచంద్రజీ, షాజహాన్‍పూర్.---  ఆధ్యాత్మజ్ఞాన్ ఏప్రిల్-జూన్ 2021లో ప్రచురించబడినది. 

💧💧💧 

 జీవన్ముక్తుడగుటన్నది, ఆధ్యాత్మికతయందొక అధ్యాయము.- శ్రీరామచంద్రజీ, షాజహాన్‍పూర్. ఆధ్యాత్మజ్ఞాన్ ఏప్రిల్-జూన్ 2021లో ప్రచురించబడినది.

💜💜💜 

అనుభవమే (మనసులోని బాధ, సంతోషమువంటి భావనలు ముఖమున ప్రస్ఫుట మగుటే) దైవభాష, దైవముతో నీవు మాటాడుభాష.

( శ్రీరామచంద్రజీషాజహాన్‍పూర్. ఆధ్యాత్మజ్ఞాన్ ఏప్రిల్-జూన్ 2021లో ప్రచురించబడినది)

 💥💥💥

విశ్వాత్మలో భాగమైయుండిన వ్యక్తిగతాత్మ విడివడి, తనొక ప్రత్యేక ఉనికిగా మార్పుచెందినది. తన వ్యక్తిగత ఉనికియొక్క ఎఱుక లేక అహము, మనిషి కూర్పునకు తొలిపొరయైనది. ఈమొదటి స్థితి తరువాత ఒకటొకటిగా స్థూల స్థూలాతిస్థూల పొరలతో చుట్టుకపోతూ, ఇపుడున్న యీస్థితికి దిగజారినది . తొల్లింటిస్థితికిమరల జేరుకొనుటే మనసమస్య. అందుకొఱకు మన జడత్వపొరలను సాధ్యమైనంతగా తొలగించుకొనుచు వెనుకకు మరలవలెను. భౌతికమైన ఆచరణలు, యాంత్రికపద్దతులు యీవిషయమున నిరర్థకములు. మనకున్న ఏకైకమార్గము, మతపరమైన స్థూలవిధులకు చిక్కువడని ఆధ్యాత్మికతయే. అది మూఢనమ్మకములు, జటిలము, దురభిమానముల కతీతమైయుండవలయును.  శ్రీరామచంద్రజీ, షాజహాన్‍పూర్. ఆధ్యాత్మజ్ఞాన్ ఏప్రిల్-జూన్ 2021లో ప్రచురించబడినది.     

💛💛💛

 తొలుత "బయలు" (స్పేస్) వుండినది. ఆతర్వాత భగవంతుడక్కడ ప్రకటితమైనాడు. సర్వము భగవంతునినుండే ఉత్పన్నమైనదని వేదములు తెలుపుచున్నవి. ఈమాట సరికాదు. బయలు లేనట్లైన భగవంతుడుండుటకు స్థానమే లేదుగదా? - శ్రీరాంచంద్రజీషాజహాన్‍పూర్. ఆధ్యాత్మజ్ఞాన్ జనవరి-మార్చ్ 2020లో ప్రచురితమైనది.

 💧💧💧

సహజమార్గవిధానము మహాప్రళయము వరకు కొనసాగుతుంది.--శ్రీరాంచంద్రజీ, షాజహాన్‍పూర్. ఆధ్యాత్మజ్ఞాన్ జనవరి-మార్చ్ 2020 లో ప్రచురితమైనది.

 💥💥💥

మనసత్సంగములో నేనొక విధానాన్ని ప్రవేశపెట్టదలచితిని. అదేమంటే, సరిగ్గా రాత్రి తొమ్మిదిగంటలకు ప్రతిఅభ్యాసి ఆసమయంలో ఎక్కడున్నా, ఏపనిచేయుచున్నా, ఆపనిని తాత్కాలికంగా నిలిపివేసి ఓ 15 నిముషములు ధ్యానములో కూర్చొని, మనసోదర సోసరీమణులందరూ ప్రేమా భల్తిభావముతో నిండిపోయి, వారిలో నిజమైన విశ్వాసము దృఢమౌతున్నట్లు భావించవలెను. ఇందువల వారికి మహత్తరమైన ప్రయోజనము సమకూరును. వారి స్వానుభవమే వారికిది ఎఱుకపరచగలదు.--ఋతవాణినుండి గ్రహింపబడినది. ఆధ్యాత్మజ్ఞాన్ జనవరి-మార్చ్ 2020లో ప్రచురితమైనది.

(వివరణ:- భారతీయులుమాత్రమే రాత్రితొమ్మిది గంటలకు కూర్చొనగలరు. విదేశీయులు వారి సమయమును భారతకాలమానముతో సరిచేసుకొని ధ్యానముచేసుకొనవలసి యుండును)

 💥💥💥

నేనెవరినైనా ఒక పనిచేయమని ఆజ్ఞాపించినట్లైన, వెంటనే నాసూక్ష్మశరీరము అతనిదేహమున ప్రవేశించి, ఆకార్యము నెరవేర్చును.--(ఇది 08-10-1980 నాడు షాజహాన్‍పూర్‍లో గురు వర్యులు శ్రీరాంచంద్రజీ చెప్పగా గుల్బర్గా ప్రశిక్షకులు సర్నాడ్‍జి వ్రాసికొన్న విషయము) ఆధ్యాత్మజ్ఞాన్ ఏప్రిల్-జూన్ 2022లో ప్రచురించబడినది)

  💚💚💚

వాస్తవమున ఆధ్యాత్మికత అత్యంత సూక్ష్మమైన మానసికస్థితి. దీనితో పోల్చిచూచిన ప్రతీది భారమైనది, జడమైనదిగనే తోచును. గులాబీపుష్పము యొక్క అతిసున్నితమైన సువాసనకూడా ఆధ్యాత్మికత కంటే బరువుగనే యుండును. నేను దీనిని ప్రకృతితో 

 సంపూర్ణసారూప్యమునొందిన చక్కటి ప్రశాంతత మరియు సంయమనముగా పేర్కొందును. ఇట్టి మానసికస్థితిలో ఇంద్రియకార్యకలాపములుశక్తిసామర్థ్యములన్ని నిద్రాణములై అణగారి యుండును. వాటి పనితీరుస్వయంప్రవర్తకమై యదేచ్ఛగా సాగుతూమనస్సుపై ఎటువంటి ముద్రలు పడనితీరున నుండును. సంపూర్ణప్రశాంతత అనునది యిందులోని గొప్పస్థితి యైననూఅసలైన సత్యస్థితి యింకనూ ముందున్నది. అది పరిపూర్ణ ప్రశాంతయొక్క యెఱుకగూడా లేనిస్థితి. అదిమనకు అవసరమైయున్నది. ---శ్రీరాంచంద్రజీషాజహాన్‍పూర్. ఆధ్యాత్మజ్ఞాన్ జూలై-సెప్టంబర్ 2022లో ప్రచురితమైనది.    

                                                                    💟💟💟

సాధనలో పురోగించినవ్యక్తి కేవలమాహారము వలననే జీవింపడు. అతడు తనమనస్సుయొక్క సామర్థ్యములతో కార్యముల నిర్వర్తించును. మరింతముందుకు వెళ్ళినప్పుడు, నిమ్నకేంద్రములను ఉన్నతకేంద్రములు తమ అధీనమునకు తెచ్చుకొనును. మహోన్నత స్థాయిలో వ్యక్తి, కేద్రశక్తివలన జీవించును. దేహము సంపూర్ణముగా దివ్యతనొంది, కేంద్రముయొక్క అధీనమున ప్రవర్తించును. లాలాజీవారి కృపవలన, సహజమార్గమున యిది సాధ్యమగుచున్నది.- శ్రీరాంచంద్రజీ, షాజహాన్‍పూర్. ఆధ్యాత్మజ్ఞాన్ ఏప్రిల్-జూన్ 2022లో ప్రచురితమైనది.    

💜💜💜 

  నేను పెక్కుమందిజనము నావైపునకు రావలెనని ఉత్సాహపడుటలేదు. తమనితాము సముద్ధరించుకొని సమాజమునంతటిని సహజమార్గమువైపునకు ఆకర్షించి అభ్యాసులుగా మార్పుచేయుట కొఱకు నాకు సహకరించ నిచ్చగించి, నా గురుదేవుల మహదాశయమును వ్యాపింపజేసి సఫలీకృతమొనర్చనెంచిన శ్రద్ధాసక్తులుగల సత్యాన్వేషులు నాకు కావలయును.--- శ్రీరాంచంద్రజీ, షాజహాన్‍పూర్.  ఆధ్యాత్మజ్ఞాన్ జూలై-సెప్టంబర్ 2022లో ప్రచురితమైనది.   

 💧💧💧

నీవేపని చేయుచున్నప్పటికిని, అది భగవదాజ్ఞకనుక, నావిధిగా (కర్తవ్యముగా) చేయుచున్నాననే తలంపుతో చేయుము. తద్వారా దైవస్మరణ నిరంతరంగా స్థిరంగా వుండునట్లు జేసికొనుము. ఇందువల్ల సంస్కారములు (ముద్రలు) ఏర్పడుట నిలచిపోవును. ఇది నీకుగలుగు ప్రత్యేకప్రయోజనము. నిరంతరముగా దైవధ్యాసలో నుండుటవలన, భగవంతునితో ప్రగాఢసంబంధ మేర్పడును. ఈస్థితి దైవముయెడ ప్రేమనుత్పన్నముచేసి పొంగిపొరలునట్లుజేయును. తద్వార భక్తి క్రమేణ పరిపూర్ణస్థితికి చేరుకుంటుంది. ఈవిధానము నవలంభిఒంచుట అత్యంతావశ్యకము.--- శ్రీరాంచంద్రజీ, షాజహాన్‍పూర్.  ఆధ్యాత్మజ్ఞాన్ జూలై-సెప్టంబర్ 2022లో ప్రచురితమైనది.

💥💥💥 

 సంపూర్ణవిశ్వాసముతో పరతత్వము నభిలషించితివేని, నీవు హృదయపూర్వకముగా ధ్యాసను ఆఅనంతసత్యమునకు సన్నిహితముగా నుండునట్లు చేసుకొనుటొక్కటే నీ కర్తవ్యముగావలెను. అందువలన తక్షణమే నీహృదయమున ప్రేమ భక్తిభావనలు రగుల్గొల్పి నీలోని అణువణువునకు దైవీయశక్తిధార వేగముగా ప్రవహించును. --- శ్రీరాంచంద్రజీ, షాజహాన్‍పూర్.  ఆధ్యాత్మజ్ఞాన్ జూలై-సెప్టంబర్ 2022లో ప్రచురితమైనది.

 💧💧💧

సృష్టిమూలమునందు మానవత్వము, దివ్యత్వమునకు సన్నిహితముగా నుండెను. పరిణామక్రమములో చర్య ప్రతిచర్యల వలన గలిగిన కుదుపుల కారణంగా జడత్వమురూపు దాల్చినది. ఇప్పుడున్న మానవరూపముయొక్క కూర్పునకు సంబంధించిన అంశములన్నింటిని, తొల్లింటి అసలైనస భక్తి ప్రశాంతస్థితికి తీసుకొనివచ్చి దివ్యత్వముతో మరల సాన్నిహిత్యమును పునరుద్ధరింపవలెను. ఈకార్యము సఫలమగుటకు మానవునిలో సరియైన సమతాభావనను ప్రవేశపెట్టవలెను. ఈకార్యమునే మనము సహజమార్గమున నిర్వహించుచున్నాము. --- శ్రీరాంచంద్రజీ, షాజహాన్‍పూర్.  ఆధ్యాత్మజ్ఞాన్ అక్టోబర్- డిశంబర్ 2022లో ప్రచురితమైనది.

💚💚💚

ఈప్రపంచమును, ఉన్నదున్నట్లు గ్రహించనంతవరకు దీనికి, దీనికతీతమగానున్న ఆవలిప్రపంచమునకును ఉన్న తేడామీదనే మన ఆలోచన తిరుగాడుచుండును. ఈతేడా అంతరించిన తర్వాత, సమస్తవిశ్వము ఒకేవిధముగ నున్నట్లుతోచును, అంతేగాక అంతయు నిరామయ ఉజ్వలలోకస్థాయిలో నున్నట్లనుభూతమగును. అసలుసిసలగు నిజమైనసత్తా నిర్ధారణయై యీభౌతికప్రపంచము, ఉజ్వలప్రపంచముల మధ్య ఏతేడా,ఏఅవరోధములేక ఒకే వాతావరణము (ప్రాపంచిక మరియు ఉజ్వల) స్తాయిలన్నిట అనుభూతమగును.  .     --- శ్రీరాంచంద్రజీ, షాజహాన్‍పూర్.  ఆధ్యాత్మజ్ఞాన్ ఏప్రిల్-జూన్ 2022లో ప్రచురితమైనది.  

  💥💥💥

  సేవాత్యాగములనునవి ఆధ్యాత్మికదేవాలయ నిర్మాణమున కుపయోగపడు పరికరములు. దానికి ఆధారపీఠము ప్రేమ కావచ్చును. నిస్వార్థముతో చేసిన ఏపనియైనను అది ఉపయోగకారియే. వాస్తవమున స్వార్థరహితముగాచేయు మానవసేవయే దైవసేవ. --- శ్రీరాంచంద్రజీ, షాజహాన్‍పూర్.  ఆధ్యాత్మజ్ఞాన్ ఏప్రిల్-జూన్ 2022లో ప్రచురితమైనది.  

💞💞💞

 ముక్తి తర్వాత అంతకుమించి చాలాదూరమే పయనించవలసి వున్నప్పటికిని, ముక్తికన్నాతక్కువ స్థితిని జీవితగమ్యముగా స్వీకరించదగదు.--శ్రీరామచంద్ర, షాజహాన్‍పూర్. ఆధ్యాత్మజ్ఞాన్ ఏప్రిల్-జూన్ 2023.

వివరణ:- ముక్తి=జననమరణ చక్రమును దాటుకొనుట.

 💧💧💧

దేహధ్యాస, ఇంకాచెప్పాలంటే ఆత్మధ్యాసనుండికూడా విడుదలపొందితే, అతడప్పుడు ఆతురతతో ఎదురుచూస్తున్న దానిని (పరమాత్మను, గమ్యమును) సమీపిస్తాడు --శ్రీరామచంద్ర, షాజహాన్‍పూర్. ఆధ్యాత్మజ్ఞాన్ ఏప్రిల్-జూన్ 2023.

 💜💜💜

మనము చేరవలసిన గమ్యమువద్ద, ఏవిధమైనశక్తి, బలము,చైతన్యమేగాక ఉత్తేజముకూడా కానరాకపోవుటయేగాక, మనిషి సపూర్ణశూన్యము, సున్నా, అనగా అతడు అభావస్థితిలోనికి ప్రవేసిస్తాడు.--శ్రీరామచంద్ర, షాజహాన్‍పూర్. ఆధ్యాత్మజ్ఞాన్ ఏప్రిల్-జూన్ 2023.

                                                            💥💥💥💥

పరమాత్మను పొందవలెనని నీవు సంపూర్ణవిశ్వాసముతో అభిలషించినట్లైన, నిన్నునీవు ఆఅనంతతత్త్వమునకు హృదయపూర్వక శ్రద్ధాసక్తులతో సన్నిహితముగా నుండునట్లు మలచుకొని, ఆవైపునకే నీధ్యాస నుంచుకొనవలెను. అదొక్కటే నీకర్తవ్యమై యుండవలెను. --శ్రీరామచంద్ర, షాజహాన్‍పూర్. ఆధ్యాత్మజ్ఞాన్ ఏప్రిల్-జూన్ 2023.

     💫💫💫

ఒకసారి బాబూజీ నాకు ఉత్తరం ఇలా రాశారు: "బిడ్డా!  ఇదేమి ప్రపంచామమ్మా! అన్ని వస్తువుల ధరలు పెరిగాయి. అందరికీ జీతాలు పెరిగాయి. కాని నా జీతం పెంచాలని ఎవరూ అనుకోవడంలేదు.  నా జీతం ఏమిటో తెలుసా? మీరంతా నిరంతరస్మరణలోవుంటూ, అతి త్వరగా లక్ష్యాన్ని చేరుకోవాలి. ఆ సహకారమే నా జీతం. ఇలా నాకు ఉత్తరం రాశారు.   

                                                                                        ------ ఒక అబ్యాసిసోదరికి వ్రాసిన ఉత్తరము

 Once Babuji  wrote me a letter as follows: "Daughter, What a world is this! The prices of all things have gone up. Everyone's salary increased. Nobody thinks of increasing my salary. Do you know what my salary is? All of you should be in constant remembrance and reach the goal in the shortest possible time. That co-operation itself is my salary." Like this He wrote to me.        ---- A letter written to an abyasi sister.                                                                                               

 మాయ 

 ప్రజలు దైవాన్ని ఉన్నదున్నట్లుగాక  వారివారి  స్వంత  అభిరుచులకు ఇష్టాలకు అనుగుణంగా వారి మనస్సులలో అనేక కృత్రిమ రూపాలను సృష్టించుకొని ఆరాధిస్తూ, దైవాని మాయపొరల్లో (భ్రమల్లో)చుట్టివేసారు. అందువల్లనే(సాధనాపరమైన)అనేక చిక్కులు (కష్టాలు) ఉత్పన్నమగుచున్నవి.

                                                                                                 -----శ్రీరామచంద్రజీ 

                  నేను జపాన్ని సమర్థించను. అదిపూర్తిగా బాహ్యసంబంధ మైనది. అయితే నేను కూడా కొందరిని జపించమని సలహ నిచ్చాను. కానీ వారి విషయం వేరు. వారు తమప్రగతి కోసం స్వయంగా తమకైతామే ప్రయత్నించే వారు.  అటువంటి వారికుపయోగాపడే సాధనమే జపం. కానీ మన సంస్థలో అభ్యాసి పురోగతి బాధ్యత గురువర్యులే స్వతహాగా తీసుకుంటారు. ప్రాణాహుతిద్వారా అధ్యాత్మికశక్తి నందించి ఆయన యీ కార్యం నిర్వర్తిస్తారు. ఇటువంటప్పుడు అబ్యాసి మిక్కుటమగు భక్తి ప్రేమల కనబరచి గురువుగారి నుండి తనశక్తి మేరకు(ప్రేమ భక్తి కనుగుణంగా) శక్తిని పొందుతాడు. అభ్యాసి తానుచూపిన భక్తి సమర్పణలు ఎంత ఎక్కువైతే అంత ఎక్కువగా ఆధ్యత్మికశక్తి అతనిలోనికి ప్రవహిస్తుంది 

                                ---వాయిస్ రియల్ పార్ట్-2

(Divine messages by Dr. S.P. Srivastava  అను పుస్తకమునుండి గ్రహింపబడినది.

  మోక్షము తర్వాత యింకెంతో సాధించవలసి యున్నప్పటికిని, మోక్షమునకంటే తక్కువ స్థాయిని మనగమ్యముగా నిర్ణయించుకొనరాదు.

మోక్షము=జననమరణ చక్రమును దాటిన స్థితి.

శరీరాన్ని, ఆత్మను అన్న భావననుండి ఏదోవిధంగా బయటపడినట్లైన, తను ఆతురతతో పొందాలనుకుంటున్న, అద్దానికి చేరువౌతాడు.

  ఎక్కడ అన్నివిధములైన శక్తులు, అధికారము, చేష్టలు, యింకాచెప్పాలంటే చైతన్యముకూడా తొలగిపోయి, మనిషి సంపూర్ణ‍అభావ, శూన్య లేక సున్న (పూజ్యము) స్థితిలోనికి ప్రవేశిస్తాడో, అదే అతడు చేరవలసిన తుదిస్థానము

పరమాత్మను పొందవలెనన్న సత్‍సంకల్పము కలిగియున్నట్లైన, హృదయపూర్వకముగా సత్యసంధతతో ఆవైపునకు మరలి, అనంతసత్యముతో సన్నిహితసంబంధము కలిగియుండుటొక్కటే కర్తవ్యమై యుండవలెను

మనము యెందుండి ఉద్భవమైతిమో ఆ సత్యసత్త్వములో లీనమగుటకొఱకే జీవన మియ్యబడెను. మనతోబాటే తెచ్చుకొన్న ఆ అనంతసత్యసత్వమునకు సన్నిహితముగానుండి, అనంతములో కలసిపోవుటకు, మనఆలోచనలకు స్వేచ్ఛనియ్యవలయును. దీనిని నిర్లక్షముచేసినట్లైన, అనంతసత్యతత్త్వమూలమునకు గాక మనయోచన చర్యలకు కట్టుబడిపోదుము.

 మనమున్న యీస్థితికి మనమే కారణము. కనుక మన భవితవ్యమెక్కువగా మనమీదనే ఆధారపడియున్నది. కాలము, వయస్సుతో నిమిత్తము లేనిదై చిదాత్మ, ఎప్పుడూ వయసుమీరినదైపోదు. కనుక ఆధ్యత్మికతకు ముసలితనమడ్డుకాబోదు. మనిషి తనజీవితములోని అన్నిదశలలో ఆధ్యాత్మికంగా యువకుడుగనే యుండును. అందువల్ల ఆధ్యాత్మికరంగమున, ఏది సాధించడానికైనా వయసు మీరిపోయినదనలేము.

 సృష్ట్యాదిన (మూలమున) మానవత్వము దైవత్వమునకు సన్నిహితముగా నుండినది. మనిషి తన పురోగమనకాలమున, చర్య ప్రతిచర్యల కారణమున కలిగిన కుదుపులవల్ల, స్థూలత్వమును సంతరించుకొనెను. దైవత్వముతో తిరిగి సంబంధమేర్పరచుకొనుటకు, మన నిర్మాణములోని అంశములన్నింటినితొల్లింటి నమ్రత ప్రశాంతతకు తీసుకొనిరావలెను. దీనిని సాధించుటకు మనలోనికి తగిన సమతను చొప్పించవలయును. దీనినే సహజమార్గమున మనమవలంభించుచున్నాము.              

 ప్రాపంచిక జీవనములోని గృహసంబంధమైన చిక్కులు, వ్యధలే మనకు ఓర్పు సహనమలవడుటకు శిక్షణనిచ్చుచున్నవి. అందుకే గృహమే ఒక శిక్షాణాలయమని, మాగురువర్యులు చెప్పుచుండెడివారు. గృహస్థజీవనములోని, ఒడిదుడుకులను ఓర్పుతో భరించడమే గొప్పతపస్సు. అది తపస్సులన్నింటిలో అత్యుత్తమమైనది. ఒడిదుడుకులేర్పడిన పరిస్థితులలో కోపతాపములకు లోనుగాక తప్పునాయందే వున్నదన్న తలంపుతోయుండి, యితరులతో వాదించి నిందించక, ప్రశాంతచిత్తముతో, ఓర్పుతో మెలగవలెను. మన మిత్రుల బంధువుల తిట్లు చీవాట్లను ఓర్పుతో భరించుటే ఘనతపస్సు. అవే విజయమునకు తిరుగులేని సాధనములు.

 ప్రశాంతతాస్థితియందుండికూడా దైవసాక్షాత్కారమునకై తపనపడుచుండు నతడే నిజమైన సాధకుడు.

మనకార్యకలాపములనింటను, యోచనలో ఆ మహోన్నతశక్తితో విడివడని సంబంధము గలిగియున్నట్లనుభూతిచెందవలెను. సమస్తచేష్టలు, కార్యకలాపములన్నిటిని, శక్తివంచనలేక సేవించనెంచిన మన మహనీయప్రభువు, మనకప్పగించిన పనులని, అవి నిర్వర్తించుట మన కర్తవ్యమని భావించినట్లైన, అవి సులువుగా నెరవేరును.

   ప్రభువును (గురువును) తన స్వంతప్రభువుగా అంగీకరించి, మనిషి ఆయన సేవలో సదా నిమగ్నమగుటయందే, అతని పరిపూర్ణత (perfection) ఉన్నది.

                                                                                  ----శ్రీరామచంద్రజీ, షాజహాన్ పూర్    (ఆధ్యాత్మజ్ఞాన్ (అక్టోబర్-డిశాంబర్) 2023 నుండి గ్రహించి తెలుగున కనువదించడమైనది)

          సత్యతత్త్వమునకై కలిగిన ప్రగాఢవాంఛ వ్యక్తిని సరియైనమార్గమునకు మళ్ళించగలదు. అది నిద్రావస్థలోనున్న వ్యక్తికి నూతనజీవితమునిచ్చి, మానవులకొఱకు కేటాయించిన మహోన్నతస్థాయిని చేరుటకు సిద్ధపరచును.

  నాహృదయము మీఅందరికోసం ఇక్కడగానీ మరెక్కడైననుగానీ మీతో జతచేయబడియున్నది. అది అనతికాలములోనే హృదయముల ప్రభావితము చేయుటకు ప్రకృతిసిద్ధముగా, నిరంతరనిశ్శబ్దమున స్పందనలను కలుగజేయుచున్నది.

 అందులో (దైవంలో) కలిగినక్షోభయే సృష్టికిమూలము. అదిమానవునిలో మనస్సుగా తెలియబడుచున్నది. దానిమూలములో అంతర్గతముగా, క్షోభలోనుండిన ఇచ్ఛాశక్తియే యున్నది.

 యోచనాశక్తియే ఆధ్యాత్మికతకు మూలము. దాని‍ఉపయోగమును సూర్యవంశపురాజగు దశరథునికి డెబ్బదిరెండుతరములకు పూర్వమొక ఋషి (పతంజలి) చే కనుగొనబడెను. దానినే రాజయోగ మనుచున్నాము. అంతిమస్థాయిని తిరిగిపొందుటకదియే మార్గమని ఆఋషి కనుగొనెను.

మనలోరాజైయున్నది ఆలోచనయే. అదే మనలో ముఖ్యముగా యోగ్యతను పెంపొందించి గమ్యమునకుచేర్చును.

ఆధ్యాత్మికత విలువ జనులకు తెలియడంలేదు. కారణం సంఘంగానీ, తలిదండ్రులుగానీ అటువంటిదేమీ వారికి బోధించిచెప్పలేదు. ప్రజకు విద్యగరిపి, వారు సరియైనమార్గము నెన్నుకొనునట్లు చేయుట మనకర్తవ్యమైయున్నది. మానవసమాజమునకు మనమేదైనా మంచిచేసినట్లైన అది కోరిచేసిన కోరికగాదు. అది మనకర్తవ్యము. మనయెడల వారు వారివిధులను సక్రమముగా నిర్వర్తించినా, నిర్వర్తించకపోయినా, మనముమాత్రము మానవజాతి సముద్ధరణకు మనకర్తవ్యమును మనము నివహించితీరవలెను.

 నిజానికి ఆధ్యాత్మికము మహోన్నతమానసిక స్థితి. దానితో పోల్చిచూచినట్లైన ప్రతీదీ బరువుగానూ, గాఢమైనదిగానూ తోచును. అత్యంతసున్నితమైన గులాబీపుష్పసువాసనకూడా దీనితోపోల్చినట్లైన, జ్ఞానేద్రియములకు భారముగనే తోచును.

 ప్రతి ఆత్మ (జీవి) సంతోషముగాను, ప్రశాంతముగాను జీవించుటన్నది, మరుగుపరచబడియున్న ప్రకృతిసిద్ధాంతము. మనము దానికి విరుద్ధముగా పనిచేయుట, ఆయన (భగవంతుని) విశ్వమును చెడగొట్టినట్లే యగును. 

మనము దివ్యశక్తినుండి ఉద్భవించితిమి. అదే మనకాధారమై యున్నది. కానీ అది కనుమరుగైపోయినది. మనల్నిమనం సంరక్షించుకొనవలెనన్న అద్దానిని తిరిగి పొందవలసియున్నది.

బంధనములనుండి స్వేచ్ఛను పొందుట  ఆత్మయొక్క సహజపరితాపమై యున్నది. ఎప్పుడైనా అలా చిక్కులనుండి విడివడుటకిష్టపడనివారుండిన, వారికిక పరిష్కారమే లేదు.

సహజమార్గవిధానము అకస్మాత్తుగా ఉద్భవించినదికాదు. ఇది ఆతురతతో యెదురుచూచుచున్న మానవజాతికి, దయతో అనుగ్రహించబడినది. సహజమార్గముగాక యేయితర సాధన, ఆరాధన (పూజ) కూడా మానవజీవితకాలములోని అతితక్కువసమయములో సత్‍ఫలితముల నివ్వజాలదు. సహజమార్గము మాత్రము అందుకు కట్టుబడియున్నది

                                                                                                                                                                    ----శ్రీరామచంద్రజీ, షాజహాన్ 

 (ఆధ్యాత్మజ్ఞాన్ (జనవరి-మార్చి) 2024 నుండి గ్రహించి తెలుగున కనువదించడమైనది)

 

Saturday, 14 October 2023

అహంకారపు వివిధస్థితులు

అహంకారపు వివిధస్థితులు 
రచన - శ్రీరామచంద్రాజీషాజహాన్‍పూర్.  
తెలుగుసేత - పి. సుబ్బరాయుడు, ప్రశిక్షకులు

 

         వివిధపరిధులలో  మనిషిలోని అహంకారమేయే స్థితులలో వుండునో పాఠకులు నిర్ణయించుకొనుటకీ విషయముపై కొంతచర్చించుట అనవసరము కాదనుకొందును. అహంభావము మనిషిశరీరము నుండే ఉద్భవించును. ఇట్టిభావనతో పనిచేయుచున్నప్పుడు నేనే (ఈశరీరమే) యీకార్యము నెరవేర్చుచున్నానన్న స్థూలమైన యోచనతో నుండెదరు. ఇది అధమాధమమైన మోటుస్థాయులోనున్న అహము. ఈస్థాయిలోని వ్యక్తిచూపు (దృక్పదము) శరీరముపైనే వుండును. అతని ఆలోచన, భావనలో దేహమేకర్త. అంతకుమించి అతడాలోచించడు. భౌతికదేహముతప్ప, అంతకుమించిన అవగాహన అతనికుండదు. ప్రపంచములోని సామాన్యజనులస్థితి యింతమాత్రమేయై యుండును.

              ఇప్పుడు నీవు సరైన అవగాహనకు వత్తువు. కార్యములన్నియూ వాటికవేజరిగిపోతూ, వాటిని చేయుచున్నదెవరోకూడా నీ ఊహకురాదు. కార్యములు నిర్వహించుచున్నది నీశరీరముగానీ, మనస్సుగానీ, లేక మరోవిధానములో గానీ జరుగుచున్న విషయమేమీ నీ ఊహకురావుగానీ, ఏదోవిధంగా కార్యములు, నిర్వహింపబడుతున్నట్లు మాత్రము గమనింతువు. ఈస్థితిలో ఏలా? ఎవరివలన? లేక ఏవిధానమున కార్యములు నిర్వహింపబడుతున్నవన్న ఆలోచన నీ మనస్సున అసలే అంకురించదు.

 నీవు మరింత పురోగమించినట్లైన అస్సలు వీటికిసంబంధించిన ఎరుకే నీకుండదు. ఈకారార్యములేవైనను ఎలా జరుగుచున్నవోనన్న విషయము, పని మొదలగుటకు ముందుగానీ, పనిజరుగుచున్నప్పుడుగానీ, పూర్తైన తర్వాతగానీ, నీఎరుక లేకనే అవసరమునకు తగినట్లు వాటికైఅవే జరిగిపోవుచుండును. ఈవిషయము బాగా అర్థమగుటకు ఒక ఉదాహరణనిత్తును.

 ఒకమనిషి నిద్రించుచుండును. అతనిని దోమలుగానీ చీమలుగానీ కుట్టును. అతనికి కండూతి (జిల) కలిగినట్లై తనచేతితో అవసరానికి తగినట్లు కుట్టినచోట రుద్దుకొనును. గానీ యిదేమిమే తెలియకయే నిద్రావస్థలో మునిగియుండును.

 నిద్రావస్థ

 ఇప్పుడతనికి నిద్రలోజరిగిన విషయమేమీ తెలియదు. అతడుచేసినపనికి ముందుగానీ, చేయుచున్నప్పుడు గానీ, పనిపూర్తైనతర్వాతగాని, ఏమిజరిగినదో మేల్కొనినతర్వాత అసలే ఎరుగడు. ఇట్టిస్థితిని పొందినట్లైన, అనగా మేల్కొనివుండగనే నిద్రావస్థ పొంది, ముందుకు పురోగమించి, అన్ని పరిస్థితులలో అవసరానికి తగినట్లు కార్యకలాపాలు నెరవేరుస్తూ, కార్యము దానికర్తకు సంబంధించిన ఎలాంటి ఎరుకలేక జీవిస్తుంటాడు. అటువంటప్పుడతడు చేసినపనులకు సంబంధించిన సంస్కారములు, అవి ఏవైనప్పటికినీ అతనికంటుకొనవు. తదనంతరము అతడొక ఉనికిగామాత్రముగా మిగిలియుండును.

 ఇవే అహముయొక్క వివిధస్థితులు. ఇవన్నీ కేంద్రస్థానములోనికి ప్రవేసిస్తుండగనే, దాదాపు అంతమై పోవును. నేను దేనినైతే ఉనికి లేక స్వేచ్చపొందిన (విడుదలపొందిన) ఆత్మయొక్క ఉనికిఅంటున్నానో అదిమాత్రము అక్కడకూడా ఉండనేవుంటుంది. సర్వముఅంతమొందు మహాప్రళయమున మాత్రమే అది పూర్తిగా అంతర్ధానమైపోతుంది.

 అయినప్పటికినీ సున్న (పూజ్యము) అనునదిమాత్రము అప్పటికినీ మిగిలే వుంటుంది. అంటే విడుదలపొందిన ఆత్మల‍ఉనికితోపాటూ మిలిన వాటి‍ఉనికి మరియు అస్తిత్వములోవున్న ప్రతీదీ ఆకొక్కటిలో (దైవంలో లేక పూజ్యంలో) లీనమై వాటి వ్యక్తిత్వఉనికిని కోల్పోయినప్పటికినీ, ఇదొక్కటి (పూజ్యం లేక సున్న) దానికైఅదే ఒక ఉనికి లేక అస్తిత్వమైయుండి సమయమాసన్నమైనప్పుడు నూతనసృష్టిగావిస్తుంది.

 ("రాజయోగ ప్రభావము" అను పుస్తకముయొక్క మూడవ ముద్రణ-1968లో 42-44 పుటలలోవున్న యీ విషయము "ఆధ్యాత్మ జ్ఞాన్" జూలై-సెప్టంబర్ 2023 లో ప్రచురించబడినది) 


   


 

 

 

 

Thursday, 1 June 2023

మార్గదర్శకుని ఆవశ్యకత

 

మార్గదర్శకుని ఆవశ్యక   

శ్రీ రామచంద్ర షాజహాన్ పూర్  

భగవంతుడు  గణింపశక్యముకానన్ని విశ్వముల సృష్టించెను. గురుత్వాకర్షణశక్తితో వాటన్నిటిని ఒకదానితో మరొకటి అనుబంధము కలిగియుండునట్లమర్చెను.  అట్లనుబంధము కలిగియున్నవన్నీ  మూలకారణమై యున్న  మరోమహావిశ్వముతో అనుబంధించబడియున్నవి. ఈమహావిశ్వముకూడా దాని ఉపాదాన కారణమునుండి అవతరించినది. ఆదిమ మూలకారణముతో అనుబంధమేరరచుకొని గగనతలమున అశరీరములతో సమస్తమునూ ఉనికిలోనికి తెచ్చుకొనియున్న ఆమహావిశ్వమునుగూర్చియే నేను తెలియజేస్తున్నాను. మనిషియొక్క మూలముగూడా అదే ఆదిమమూలమే. అంటే ఉనికిలోనికి వచ్చియున్న శక్తులు, మరియితరములన్నియు  మానవునియందున్నవి.

ఆదిమ మూలాధారము

ఉనికిలోనున్న సమస్తముయొక్క కలగలుపే మనిషి. అందుచేతనే అతడు మహాశక్తిసంపన్నుడు. అతనియందున్న,  ఆమహాశక్తితో ఉనికిలోనున్న  యేవిశ్వమునైనను, తునాతునకలు చేయగలడు. అతనిలోని అణువులు ఒక్కో ప్రత్యేకవిశ్వముతో అనుసంధింపబడియున్నవి. మనిషి, తాను ఆదిమమూలముతో  సంబంధమేర్పరచుకున్నంతనే శక్తులన్నింటిపై  ఆధిపత్యం  వహిస్తాడు. మనిషిలోని చక్రములకు సంబంధించిన బిందువులుగాని, ఉపబిందువులుగానీ తమ అధీనములోని ప్రత్యేకవిశ్వములపై ఆధిపత్యము కలిగియుండుటేగాక  వాటినికూడా శక్తివంతము గావింపగలవు. చక్రములయొక్క  వివిధ ఉపబిందువులతో అనుసంధింపబడియున్న చిన్నవిశ్వము సహితము మనపురోగమనమును అడ్డగించి అవరోధమై నిలచును. మనము ఒకబిందువునుండి మరోబిందువుదశకు పయనింతుము. మనము ఆవలి బిందువు చేరవలెనన్నచో  బిందువులమధ్యనున్న దూరమును (విశ్వమని కూడా అనవచ్చును) అధిగమించవలెను. అలావెళ్ళునపుడు ఆప్రాంతములోని భోగమును (అనుభవించవలసిన వాటిని) పూర్తిచేయక తప్పదు. ప్రతిబిందువువద్ద యీపరిస్థితి తప్పనిసరి. ఈవిధంగా మొత్తంప్రయాణం పూర్తిచేయవలెనన్న చాలా సమయమే పట్టును. ఈసమయం తగ్గవలెనన్న, ఒకమహోన్నతశక్తి గురుత్వాకర్షశక్తిని తగురీతిన మరల్చి మన ప్రయాణమునకు సహకరించవలెను. సామాన్య ప్రయాణములకు సహకరించుశక్తి భౌతిక(స్థూల)మైనది. కాని మనిషిలోని శక్తి భౌతికతలేని ఆధ్యాత్మిక(సూక్ష్మ)మైనది. భౌతికత(స్థూలత)ఎంతతగ్గితే శక్తి అంతగా పెరిగి మరింత ప్రతిభావంతమౌతుంది.

భగవదనుగ్రహము

ఇప్పుడు మనకోసం దీనినెలా ఉపయోగించుకోవడమన్నది తర్వాత గ్రహించవలసిన విషయం. ఒక మహోన్నతశక్తితో దగ్గరి సంబంధమేర్పరచుకుంటే, యీపని మొదలుపెట్టబడుతుంది. దీన్నే మరోమాటలో అనుబంధం లేదా ప్రేమయనవచ్చును. ఇప్పుడు విషయం తేటతెల్లమైపోయింది. అడ్డముగానున్న పరదాల నన్నిటిని చీల్చి తొలగించగల మహోన్నతశక్తితో అనుబంధమేర్పరచుకుంటే, మన దారిలోని అవరోధాలు తొలగిపోగలవన్న నిర్ణయమునకు వచ్చితిమి. అయితే తర్వాతి బిందువును చేరుకొనుటకు ముందు, మధ్యస్థప్రదేశమును క్షుణ్ణముగా అనుభవమునకు తెచ్చుకొని, చుట్టివచ్చి, భోగము పూర్తిగాబడిన గాని, పురోగమించుట సాధ్యపడదు. స్వశక్తిచే యీపనికి పూనుకున్నట్లైన మధ్యలో చిక్కుబడిపోయి అక్కడే నిలచిపోవును.  అయినప్పటికీ  కొందరివిషయములో మినహాయింపు వుండనే వుంటుంది. కానీ అట్టివారు చాలా అరుదు.  అసాధారణ శక్తిసామర్ధ్యములు  వరముగాపొంది, భగవదనుగ్రహము మెండుగాగలవారికి మాత్రమే యిది సాధ్యము. ఇప్పుడెవరి శక్తి యీచిక్కులన్నిటిని అధిగమింపజేసి ప్రయాణపము సజావుగా సాగునట్లు  జేయగలదు? ఆదిమమూలముతో విడివడని సంబంధమేర్పరచుకున్న, మహనీయునిశక్తి వలననే యిది తప్పక సాధ్యపడగలదు. అందుకొఱకు  అటువంటి మహనీయుని చెంతచేరవలెనుగదా! తప్పక చేరవలెను. ఇప్పుడతనిని నీప్రభువనిగానీ, సేవకుడనిగానీ యెట్లైననూ పిలవవచ్చును. ఆయన మాత్రము, నీబోధకుడు,మార్గదర్శి లేక సాధారణముగా లోకము పిలచునట్లు గురువు కావచ్చును. కానిమ్ము, నీవాయనకు యేస్థాయినిచ్చి, యేదృక్పదమున గైకొన్నను సరియే, అదేమంత ముఖ్యముగాదు

 బిందువుల లేక ఉపబిందువుల మధ్యనున్న అడ్డంకులు అనగా అవరోధములు నిజమునకు లెక్కకుమిక్కుటముగా నున్నవి. వాటన్నిటిని సంపూర్ణముగా అనుభవమునకు దెచ్చుకొని(భోగించి) ముందుకు సాగవలసియున్నది.  సమర్థుడు శక్తివంతుడునైన గురువు సహాయమున యీ అనుభవించుట (భోగించుట) చాలావరకు తగ్గించబడి ఆ ప్రదేశములందు అభ్యాసి స్వల్పకాలము మాత్రము నిలచి ముందుకుసాగుటవల్ల అతని సమయము శ్రమ కలసివస్తాయి. గురువుసహాయమువల్ల భోగము (అనుభవించవలసినవి) ఎలా నిస్సారములగుచున్నవి? ఇది చూచుటకు చిత్రముగను అసంబద్ధముగను గానవచ్చును.  అభ్యాసి చేరియున్న ప్రదేశముయొక్క  ప్రభావమువలన అతనిచుట్టూ బంధనములేర్పడి పూర్తిగా చిక్కువడిపోవును. ఈబంధనములు త్రెంచబడక పురోగమనము అసంభవము. ఒకవేళ తన స్వప్రయత్నమువలన కొంత ముందుకుపోయినను, మరలా అతడు క్రిందికి జారిపోవును.

సమర్థ గురువు

ప్రత్యక్షానుభవమున గ్రహించిన విషయమేమంటే,  చాలామంది సాధువులీ ఆవరోధములను దాటలేదు. ఒకవేళ ఎవరైనా దాటినారన్నా, వారు కేవలం తొలిమలి ఆవరోధములను మాత్రమే దాటియుండవచ్చును. తర్వాతవారు అక్కడే చిక్కుకొని బయటపడుదారి కనరాక అవస్తలు బడుచుందురు. అందుకుకారణం వారి గురువులో శక్తిసామర్థములు కొరవడియుండుటే. వారిగురువు తన అసాధారణ శక్తిచే వారిని విడిపించి బయటపడవేయలేని వాడైయున్నాడు. ఇక తమ స్వశక్తిపై ఆధారపడినవారు, తొలిమలిస్థానములలోనే చిక్కులలోబడిపోతున్నారు.  కనుక మనమున్న స్థానముల అనుభవమును (భోగమును) పొంది అవతలికి దాటుకొనుటకు సమర్థగురువర్యులు మనకు వెన్నుదన్నుగాలేకున్న  సాధ్యపడదుగదా? నిజానికి భోగము(అనుభవించుట) అనగా కేవలము మనచెడుకార్యములవల్ల గలిగిన  ఫలితముల నుభవించుటే గాదు, తనను చుట్టుకొని విడివడలేని స్థితికిదెచ్చిన  బంధనములు గూడా  విప్పుబడవలెను. అట్లు జరగ వలెనన్న  తాను బంధనప్రభావమునకు లోనుగాని స్వేఛ్చననుభవించుచుండవలెను. అప్పుడు మాత్రమే తను అవతలిబిందువునకు చేరుకోగలడు. అది సాధ్యపడవలెనన్న సమర్థగురువర్యుల సహాయమత్యావశ్యకము.

 

కొందరు తమకైతామే ఆధ్యాత్మికశిక్షణాయత్నము చేసుకోవచ్చునన్న తప్పుడుఆభిప్రాయముతో నున్నారు. కనుకనే, నేనీవిషయమై వివరణ యియ్యవలసి వచ్చినది. ఆవిధంగా తమకైతామే యత్నించువారు కేవలం కొద్దిదూరమునకే పరిమితమైపోదురు. అదికూడా వారు ప్రత్యేక దివ్యశక్తులు వరముగాపొంది, ఆశక్తితో అవరోధములను స్వతహాగా అధిగమించగలరు. కానీ నిజమునకట్టివారు అరుదు. చాలా అరుదు. ఇందుకు పరిష్కారము, తనసహచరులలో తగిన శక్తిసామర్థ్యములుగల మహనీయుని సహాయము పొందితీరవలెను. అటువంటప్పుడు ఆమహనీయుని (గురును) దృష్టిని తనవైపునకు ఆకర్షించుకొని  ఆధ్యాత్మికోన్నతికి తోడ్పడునట్లు,  తనలో తగినసామర్థ్యమును ఉత్పన్నముచేసుకొనితీరవలెను. అది భక్తి ప్రేమలద్వారా మాత్రమే సాధ్యము. అందరు భక్తి ప్రేమలు పాటించుటన్నది ముఖ్యాంశము. కనుక మనగమ్యమేమిటో మనకె ఱు క పరచి,  దానిని  మనకందుబాటులోనికి తేగాలిగిన  శక్తిమంతుడగు మహనీయుని (గురుని) యెడ భక్తి ప్రేమలు కలిగియుండుట అత్యంతావశ్యకము.  

(Adhyatm  gyan  - April June 2023 . Necessity of Guide)

Friday, 17 February 2023

సహజమార్గంలో శిక్షణావిధానము

 సహజమార్గంలో శిక్షణావిధానము

                                                                                                    --- శ్రీరామచంద్రజీ

ఉనికియొక్క చైతన్యమొనర్చబడిన భాగమే జీవము. మనమెప్పుడు మనవంతు చైతన్యస్థితిని బహిర్గతమొనర్చితిమో అప్పుడే భౌతిక నికి తనపన్నులంటినీ ప్రారంభించినది. తొలుత అది దివ్యత్వముతో అధికాధికముగా అనుసంధింపబడి వుండినది. అందుండే జీవము పొడసూపినది. జీవమువృద్ధిచెంది క్రియాశీలత మొదలై దానినైజమునకణుగుణముగా మున్ముందుకుసాగి రానురానూ యిప్పటికి మనం మన సమత్వగుణం కోల్పోయి, సమతదప్పినస్థితికి చేరితిమి.


జీవమునకు అనుసంధింపబడియున్నది గనుక చైతన్యము చాలాశక్తివంతమైనది. కనుకనే దాని దురుపయోగము అప్రయోజనకరమై ప్రతికేంద్రమూ తననిజతత్వమును గోల్పోయి వైరుధ్యములను గ్రహించనారంభించినది. తత్కారణమున శరీరనిర్మాణమంతయూ మానవపరిశ్రమాలయమై, మనమంతవరకు గ్రహించినదంతయూ బహిర్గతమొనర్చ మొదలిడినది. ఈప్రక్రియ అనేక సంవత్సములు కొనసాగినది. జీవితకాలము ముగియగానే, మనము సమకూర్చుకొన్న జడత్వప్రభావమునంతయూ గైకొని మరొకదేహధారులమైతిమి. ఈవిధంగా ప్రతిపుట్టుకయందునూ జడత్వచర్యలు హెచ్చించుకొనుచూ తుదకాచర్యలే మనమైపోతిమి. ప్రతినరములకూడలీ ఒకద్రువమై వ్యతిరిక్తవాతావరణముతోకూడిన మార్పుల నుత్పాదిస్తూ పోతిమి. ఈవిధంగా మనచేష్టలు వరుసగా మిక్కుటమై మనదేహకేంద్రములు  బలపడిపోయినవి. తత్ఫలితముగా మనము ఒక్కోవిషయమున ఒక్కోరీతిగా మనకేంద్రముల యొక్క ఆజ్ఞలకు దాసులమైపొతిమి. 


మనజీవితము ఆధ్యాత్మికతనుండి దూరమునకు జరుగుతూ,కడకు జడమై పూర్తిగా చెడిపోతిమి. పరిస్థితులప్రభావముననో లేక భక్తజన సహవాసముచేతనో దివ్యత్వపుతెమ్మెర నాస్వాదించి,మనమున్న యీస్థిని తొల్లింటిస్థితితో పోల్చిచూడ నారంభించితిమి. అప్పుడు మనకింతకంటే మహత్తరస్థితులున్నవన్న విషయ మర్థమైనది. 


మనపూర్వపు వాస్తవస్థితిని తిరిగిపొందుటకు మార్గమన్వేషింప మొదలిడితిమి. తగినవ్యక్తికై వెదకితిమి. ఈఆలోచన అంతర్గతకేంద్రములను స్పృశించి తుదకది అన్నికేంద్రములలో కాననైనది. మరోమాటలో చెప్పాలంటే,మమాధ్యాత్మికతను స్పృశించినంతనే కేంద్రమునందలి మూలపదార్తముతో ఒకవిధమైన కదలికగలిగి తదైనరీతిలో ప్రతిస్పందించి, తత్ఫలితముగా నిజమైన ఆధ్యాత్మిక్కగురువు కడకు దారిచూపుతుంది. అట్లుగాక మనం తప్పుదారిపడితే, ఆధ్యత్మికముసుగులోనున్న మోసగానివైపునకు మరలుదుము. భగవత్సాక్షాత్కారముకొఱకే మనమారాటపడుచున్నట్లైన సరియైనగురువు లభించితీరును. అదృష్టవశాత్తూ మనకు సంపూర్ణమైన ఆధ్యాత్మికగురువు లభించియున్నారు. ఇకమనం మన సమతదప్పిన ఆలోచనలతో నిర్మించుకున్న ద్రువములన్నిటిని నశింపజేయు కర్తవ్యము గురువుదేయగును. అందువల్ల దూర్తవర్తనము నిలచిపోయి మనం సరైన ఆధ్యాత్మికవిధానమున పురోగమింతుము. ప్రతిదీ క్రమబద్ధమై తొల్లింటి నిజస్థితికి గొంపోవు బాధ్యత గురువుగైకొనుటద్వారా మనలో దివ్యత్వపుటెఱుక గలుగనారంభించి అదిమనవాటాగా మనకు లభించును.   


   శరణాగతి మరియు సహకారం

గురువు తనకర్తవ్యముగాభావించి స్వచ్ఛము, దివ్యమునైన తనస్థితిని అభ్యాసిలో ప్రవేశపెట్టి పురోగమింజేయును. ఆయన యీపనుకై మననుండి సహాయ సహకారములాపేక్షించి కొన్నిపద్దతులను నిర్దేశించెను. అందులో అతిముఖ్యమైనది ధ్యానము. ఈవిషయంలోకూడా ఆయన అభ్యాసికి సహాయపడును. ధ్యానమనగా మనసు యెక్కడెక్కడో తిరుగుటమాని కేంద్రముపై నుండునట్లలవాటుచేయుట. దీనికొఱకు హృదయముపై ధ్యానముచేయుటను నిర్ధారించిరి. అలా ఎందుకుచేయమనిరో మనపుస్తకములలో వ్రాయబడియున్నది.కనుక మరలాయిక్కడ నేను చెప్పదలచుకోలేదు.


నేను నిర్దేశించినట్లు అభ్యాసి హృదయముపై ధానముచేయును. అయినప్పటికినీ గురువుపై ఆధారపడు తత్వము తప్పక అభ్యాసికలిగియుండును. ఈ సక్రమమైన మార్గంలో కష్టమేదైనా వున్నదంటే, అది శరణాగతియే. అదికూడా నేరుగా గైకొనుటయందున్నది. జనులు మామూలుగా ఆలయమునకెళ్ళి అందలి విగ్రహమునకు సాగిలబడి శరణుజొచ్చితిమని మాటలలో పలుకుచుందురు. ఇది శణాగతి కానేకాదు. పులివెంటబడగా ఒకబాలుడు పరుగెత్తి తల్లిఒడిచేరినట్లున్నది. తల్లి అతనిని పులిబారినుండి రక్షించగదోలేదో తెలియదు. భగవంతునిపై సంపూర్ణముగా ఆధారపడితినన్న దృఢనిశ్చయమే అత్యుత్తమ శరణాగతి. నేను తొలుతచెప్పినట్లు సమర్థుడైన గురువుపైసమర్పితభావముననుండుట ముఖ్యము. శరణాగతియందు సామాన్యముగా తాను, శరణాగతి పొందుచున్నాననని తెలియుచుండును. ఇక్కడ ముఖ్యముగా నేను అన్నభావముకలిగి ప్రవర్తించుచుందుము. ఈ నేనెను విదళించివేయవలెను. లేనియెడల యీవిధానమున నేను అన్న అహము పెంపొందునేగానీ శరణాగతివుండదు. సరైనభావనతో దైవముపైగల భక్తియొక్క ఫలితమే శరణాగతి.


ఉనికియొక్క అంతర్గత అనుసంధానమే నిజమైన భక్తి. భక్తియే అతిముఖ్యమైన సాధనము. అత్యంతవిశేషమైన పరమభక్తిలో అభ్యాసి ప్రేమిస్తున్నాడనిగాని, అసలెందుకు ప్రేమిస్తిన్నాడో కూడా యెఱుగనిస్థితిలో నుండును. ఇటువంటి సంఘటనలు మనపురాణములలో కృష్ణపరమాత్మకు సంబంధించి వివరింపబడియున్నవి. "నేను" ప్రబలముగానున్నట్టి ఎఱుక శరణాగతిస్ఫూర్తికే ఆటంకము కలిగించును. అది ఆశించినఫలితములనుగాక తద్విరుద్ధములైన ఫలితములనిచ్చును. ఒకపులి తాను పులినన్న బావము కలిగియున్నపుడు, దానిపిల్లలపైగూడా అది గుర్రుగానుండును. మనిషి తాను మనిషినన్న భావముతోనున్నపుడాతడు, దయ్యమువలె యితరులను హింసించును. సంపూర్ణశరణాగతిపొందితిననిన సహజముగా సర్వమానవాళికి తాను శరణుజొచ్చితినన్నభావన ఎఱుకలోనికివచ్చి, తద్విషయము గ్రహించనారంభించును. పరిపూర్ణశరణాగతి గలిగనంతనే, సహజసిద్ధంగా శరణగతియను భావనే మరచియుండును. ఒకాభ్యాసి సహజసిద్ధతకొఱకే ముఖ్యంగా జాగరూకుడైయుండవలెను. శరణాగతి మరియు సహకారమురెండూ కవలబిడ్డలు.


అభ్యాసి రెండువిధముల పురోగమించును. అంటే ప్రాణాహుతిప్రసారమువలన మరియు స్వశక్తివలన. రెండూ ముఖ్యమే. ఒకప్రశిక్షకుడు ప్రవేశపెట్టిన వెలుగులో అభ్యాసి వివిధకేంద్రములకు చేరుకొనును. ఉన్నతస్థాయిబిందువులవద్ద, అభ్యాసి ఒకవిధమగు ప్రకంపనలననుభూతిచెందును. ప్రశిక్షకుడుచేయు మరొకపని, అభ్యాసిని వివిధస్థానములకు కేంద్రములకు పురోగమింపజేయుట. తమ స్వప్రయత్నమున యీ పురోగతి సాధించువారరుదు. సహజమార్గమున మాత్రమే, శిక్షణాక్రమమున అభ్యాసికి సక్రమమార్గమునేర్పరచి ప్రశిక్షకుడు ఆధ్యాత్మిక ప్రయోజనమును సిద్ధింపజేయును. కనుకనే ప్రశిక్షకులుచేయవలసినపని మిక్కుటముగానున్నది. గురువు మరుయు ప్రశిక్షకులసహాయము లేకుండా అభ్యాసి ఉన్నతోన్నతస్థానముల నధిగమించజాలడని నేను నొక్కివక్కాణించున్నాను. ఎందుకనగా జీవము ఉన్నతస్థాయినుండి నిమ్నస్థాయికి దిగివచ్చినది. మరోవిధంగా చెప్పాలంటే, అది తన స్వశక్తితో క్రిందికిదిగుచున్నది. సూక్ష్మమైనశక్తి చాలాబలమైనది. అభ్యాసి తనస్వశక్తితో ఉన్నతస్థాయికి ఎగబ్రాక ప్రయత్నించేకొలది అతడు క్రిందికి నెట్టబడుచుండును. అందులకు కారణమాతడు సూక్ష్మశక్తిని గ్రహింపకుండుటే. తగినసమయములలో కొంతవరకు అభ్యాసి ప్రయత్నించగలడుగాని,ఆతర్వాత తనకైతాను ముందుకుపోజాలడు. ప్రశిక్షకునకు కేంద్రములు మరియు వాటికున్నశక్తికి సంబంధించిన జ్ఞానమున్నది. కనుక ప్రశిక్షకుడు తనపనులన్నిటిని సక్రమముగా చక్కదిద్దుటకాతడు, నేరుగా తనకు లభించు దివ్యశక్తిని గ్రహించి పనిచేయును. ఒకవేళ అభ్యాసి తనస్వశక్తితోనే కొంతముందుకుసాగినా,గురువును అలక్ష్యము చేసినట్లైన, ఒకస్థాయితర్వాత అతనిప్రయాణము వంకరలువోయి దారిలో ముడులేర్పడి ముందుకుకదలుటకాటంకమైపోవును. దీనిని కేవలమొక ప్రాణాహుతిప్రసారము ద్వారామాత్రమే సరిచేయవీలగును.


ప్రార్థన యొక్క ప్రాముఖ్యత 

ప్రశిక్షకుని ముఖ్యమైనపనిముట్టు మనశ్శక్తి. అయినను అభ్యాసి మంచిఫలితముల నందుకొనుటకు, తగినపద్దతులుండనేవున్నవినేను సంస్థలోని ప్రశిక్షకులను వారి అనుభవములందివ్వమని అర్థించుచున్నాను. ప్రశిక్షకులు అభ్యాసులకొఱకు ధ్యానము, ప్రార్థనలను విధానములను అనుసరించుచున్నారు. అభ్యాసియొక్క ఉన్నతికొఱకు ప్రశిక్షకుడు తదితర విధానములనుకూడ వినియోగించును.


ప్రార్థనయొక్క అవసరమేమంటే, ప్రార్థనచేయుసమయమున ఒక వినమ్రభావమున నుందుము. అది శరణాగతికి అతిసమీపస్థితి. సులభముగా శరణాగతి చేయలేనప్పుడు, యీవిధానముపయోగపడును. తర్వాతివిషయములు వాటంతటవే సమకూరుచూ పోవును. సందర్భానుసారమో లేక అలవాటుగానో వ్యక్తి మనస్సులో ఉద్రేకమునకు తరచూ గురికాబడును. అతడీపరిస్థితినుండి బయటపడటానికి ఒకగురువు నాశయించును. గురువు ఒకానొక పద్దతినవలంభించమనును. మాగురువర్యులైన లాలాజీ వారి వ్రాతచీటీలో సూచిస్తూ, ఒకప్రామాణిక గ్రంథానుసారము మానసికరుగ్మతకు పరిష్కారము చూపుట సరికాదనెను. ఇటువంటిసమస్యలకు ఒకమహాత్ముడీవిధమగు పరిష్కారముచూపి సఫలుడాయెనని వివరించవచ్చును.ౠజువుచూపెనుగాన ఆవిధానము సరియైనదే కావచ్చును. అయితే దివ్యజ్ఞానోదయమైన గురువుచూపిన పరిష్కారమేదైనప్పటికిని అది నిస్సంకోచముగా సరియైనదే అయివుండును. సహజమార్గవిధానములో పనిచేయుకర్తవ్యము   ప్రశిక్షకునిదైతే సత్ప్రవర్తకుడుగా మారుట  అభ్యాసిపనియైయున్నది.


నైతికధైర్యమే ఆధ్యాత్మికతకు ఆధారము. అదివ్యక్తి నీతివంతుడైనపుడే ఉదయించును. చూచుటకడెంత మహాత్ముడుగా అగుపించినను అతని ప్రవర్తన నీతివంతము గానియెడల, అతనిఘనత అనుమానాస్పదమేనని మాగురువర్యులు చెప్పెడివారు. అట్టివ్యక్తి ఆధ్యాత్మికతనిసుమంతైనా శ్వాసించికూడా ఎఱుగడని చెప్పుదును. నైతికత యనగా శక్తియుక్తులన్నియు సత్కార్యములకై సమతాస్థితినందియుండుటయే.ఈస్థితి అహంభావమునకు దూరమైనపుడు మాత్రమే ఉదయించనారంభించును. కనుక యిదే పరమావధిగా మతవిధానములన్నియు యేర్పడినవి. ఇందుకొఱకు సహజమార్గ విధానములు అత్యంతసులభతరములై యున్నవి. అహమునకు అధికప్రాధాన్యతనిచ్చిన నైతికత చెడిపోవును. కనుకనే "నేను" (అహాన్ని) ను భగవంతునివైపు మరల్చుట ప్రశిక్షకుడు పోషించు ముఖ్యభూమిక.


మనసు మార్పుచెందుటద్వారా జనించిన స్థౌల్యస్థితే యీ ఆహము. ఈవిషమును మరింతవిషదముగా చెప్పి, సామాన్యులకుసైతం అవగాహన కల్పించవలెనన్న, అది (అహము) ఒకవ్యక్తిగతశక్తిగా మారి ఒకప్రత్యేకతను సంతరించుకొన్న ఉనికి యని నేనుచెప్పదలచితిని. మనం ఒకసద్గురువు అధీనంలో ఉన్నట్లైన, మనిషి మహనీయుడుగా మారుటకవసరమైనవన్నియు వాటికైఅవే సంప్రాప్తమగును. వాస్తవమున మనపద్దతిలో నిద్రాణస్థితిలోనున్న అభ్యాసిలో దివ్యత్వముచొప్పించు విధానములు  ప్రశిక్షకునకివ్వబడినవి. అభ్యాసి విధిగ స్మసరణలోనున్నయెడల, అది అతనికత్యంత సహాయకారియగును. దట్టమైనపొరలను తొలగించి దివ్యత్వము వికసింపజేయు కార్యమును గురువు నిర్వహించును. ప్రశిక్షకునికి ఆత్మవిశ్వాసము లేనప్పటికిని తాను ప్రసారముచేయు, ప్రాణాహుతి సూక్ష్మగ్రాహ్యమగు వెలుగును ప్రసరింపజేయును. మనంద్సరిలో ఒకేఒక దివ్యశక్తి పనిచేయుచుండుటయే యిందులకు కారణమగుచున్నది.  తీర్చిదిద్దుట ప్రశిక్షకుని కర్తవ్యము. మనసంస్థలోని ప్రశిక్షకులందరు గురువులమనిగాక సాటివ్యక్తులమను నిస్వార్థబుద్ధితో బాగుగా పనిచేయుచున్నందున, నాకు సంతోషముగా నున్నది. ఈభావము మరితగా వృద్ధిచెందునుగాక!     

(ఆధ్యాత్మజ్ఞాన్ 2022 ఏప్రిల్-జూన్ త్రైమాసపత్రికలో ఆంగ్లంలో వెలువడిన "method of Training in Sahaj Marg" అనే వ్యాసమునకు తెలుగు అనువాదము. )       

Thursday, 16 February 2023

అంతఃశుద్ధీకరణ,cleaning

 అంతఃశుద్ధీకరణ

                                                                                                     -- శ్రీరామచంద్రజీ

లాలాజీవారిసాటిలేని అనుగ్రహమువలన మనకొక శిక్షణావిధానము లభించినది.అది సాటిలేని ప్రతిభావంతమని నేను నొక్కివక్కాణించగలను.అది మహదాశ్చర్యకరము సరళమునైన విధానమై యుండుటకు గలహేతువేమిటో మీకు తెలియునా? అదే మనసంస్థలో అనుసరిస్తున్న అంతఃశుద్ధీకరణ విధానము.

వాస్తవమునకు మనపూర్వసంస్కారములే మనల నణగద్రొక్కి, మన నడవడిగామారి సరిదిద్దుకొనలేని స్థితిలో పడవైచినవి. మనంమన గతసంస్కారములకు బానిసలమైపోతిమి. మనంస్వతంత్రంగా ఆలోచిస్తున్నామని ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నామని అనుకుంటున్నాముగాని యిదంతా భ్రమ. మనం ప్రతివిషయంలోను మనగతంచేత నియంత్రబడుతున్నాము.ఈపరిస్థితులలోవున్న వ్యక్తిని మనమెలా మార్చగలము? 

ఇది లాలాజీవారి గొప్పదనము. ఈఅంతఃశుద్ధివిధానముద్వారా గతంయొక్క ప్రభావమును పూర్తిగా నిర్మూలించేస్తాము. అయితే యీపని ఒక్కసారిగాకాక క్రమేణాజరుగుతుంది. ఇదెంతటి గొప్ప వరమో గమనించండి. మారితీరాలని ఒకవ్యక్తి బోధించటంవల్ల ప్రయోజనమేమున్నది? అయినా ప్రతియొక్కరూ మారాలనే అనుకుంటారు. కానీ వారికిది సాధ్యంకానిపని. ఎందుకంటే మనస్సు గతంతో నియంత్రించబడుతున్నది. గత సంస్కారాలతో కూడియున్న మనస్సును శుద్ధీకరించడం వలన మార్పుతీసుకొనిరావచ్చునన్న విషయం మీరు గమనించవచ్చును. ఈ విధంగా గతమ్యొక్క ప్రభావంనుండి విడుదలపొందుట అభ్యాసికి సాధ్యమగును. 

వాస్తనమునకు యిదే మనకున్నబంధనము. మన గతసంస్కారములు (ముద్రలు) మన ప్రవృత్తులకు మూలమగును. వీటిని మార్పుచేసికొనుట మనకు కష్టమనిపించును. ముద్రలను పరిశుభ్రపరచినట్లైన ప్రవృత్తులను సులభముగా సవరించవచ్చును. అనేకుల విషయములో దానికైఅదే జరిగిపోవును. అటువంటప్పుడు ఆలోచన ఆచరణ తగురీతిగాను (సరిగ్గాను) సహజంగానూ రూపుదిద్దుకొనును. అనగా ప్రాణాహుతిప్రసారంతోనే అన్నీ సరిదిద్దబడవు. శుద్దీకరణ అతిముఖ్యము. లేకపోతే అభ్యాసి పురోగమించినా, గతసంస్కారములు వెనక్కు లాగుటవలన పతనమగు ప్రమాదము వుండనేవున్నది. పురోగతి నిరాటంకముగా వుండాలంటే, మన అంతర్గత నిర్మలీకరణ అత్యంతావశ్యకము. అందుచేతనే నేను ప్రశిక్షకులకు యీవిషయంగా మరింతశ్రద్ధవహించమని చెబుతూవుంటాను. ఇది అత్యంతముఖ్యాంశము. క్రిందిస్థాయిలో యీపనికై మరింతశ్రమపడవలసివస్తుంది. కనుకనే నిర్లక్ష్యముచేసే పరిస్థితులేర్పడుచున్నవి. అందువల్ల అభ్యాసులకు చేయుసేవ నిరర్థకమౌతున్నది.

మనం అభ్యాసులకు సేవచేయుటకున్నాము. అయినప్పటికీ నిర్మలీకరణ నిర్లక్ష్యముచేయుటవలన, నిజానికి వారికి సేవచేయని వారమౌతున్నాము.

సంపూర్ణసహకారము

ఇది మీమీదే ఆధారపడివుందని నేను మళ్ళీమళ్ళీ మనప్రశిక్షకులకు తెలియజేస్తూనే వున్నాను సంపూర్ణసహకారంవలన  పనిసులువౌతుంది. నేను అభ్యసిని శుద్ధిచేస్తూపోతుంటే, అభ్యాసి మాత్రం జడత్వాన్నిపెంపొందించుకుంటూపోతుంటే, నేనుమాత్రమేమిచేయగలను? మీరు అభ్యసినికూడా సహకరించేట్లు చేయాలి. అతడు తనపురోగతికి సహాయకారిగా వుండేట్లు తనజీవితాన్ని సరిదిద్దుకోవాలి. కూడబెట్టుకున్న గతసంస్కారాలను తొలగించే కార్యాన్ని గురువు నిర్వహిస్తాడు.

కానీ అభ్యాసి అలసత్వంవహించక చురుగ్గావుండి, తనఆలోచనలతో ఆచరణలతో మరింతజడత్వాన్ని పెంపొందించుకొనకుండా వుండాలి. అందుకే మెలకువగావుండటం అవసరం. ప్రతిదినం చేసుకొనే నిర్మలీకరణవిధానాన్ని తప్పక అనుసరిస్తూపోతే, లాలాజీవారి కృపవల్ల ముద్రలేర్పడడం నిలచిపోయేస్థితికి చేరుకుంటారు. ఇక సంస్కారాలేర్పడవు. ఇదిఒక గొప్పస్థితి. కానీ వాస్తవానికిది ప్రయాణంలో ప్రారంభముమాత్రమే.

సంస్కారాలేర్పడటం నిలిచిపోగానే, గమ్యం నీకనుచూపుమేరలో వుంటుంది. గతంలో పేరుకపోయివున్న సంస్కారాల అవశేషాలేవైనా కొన్నిమిగిలిపోయివుండవచ్చును. వాటిసంగతి గురువుగారే చూసుకుంటారు. అది ఆయనబాధ్యత. నేను మరోవిషయం తెలియజేయవలసి యున్నది. మనం శరీరధారులమైయున్నంతకాలం కొంత జడత్వం వుండనే వుంటుంది. ఒకవేళ దేహి సంపూర్ణంగా శుద్ధిగావింపబడితే, ప్రాణం నిలువదు. అట్లని (నవ్వుతూ) జీవితం కొనసాగడం కోసం మనలో జడత్వాన్ని పెంపొందించుకొనరాదుసుమా! ఎప్పుడైతే సంస్కారాలుయేర్పడడం  నిలచిపోతుందో, అప్పుడే గమ్యం, మన దరిదాపుల్లోకొచ్చిందని గుర్తించాలి. అస్థితిలో వ్యక్తి సాధారణజీవితం సాగిస్తూ, వివిధములైన పనులను చక్కగా నెరవేరుస్తూ వుంటాడు. కానీ అతనికి యేవిధమైన సంస్కారములూ అంటవు. ఈస్థితిలోనివానిని నేను జీవించియూ మరణించినవాడని అంటాను. ఈస్థినందుకోవటానికి అభ్యసి తప్పక సహకరించవలసి వుంటుంది. అదెలాగంటే, చెబుతా వినండి. నేనొక అందమైనగులాబీపువ్వును చూశాననుకోండి. ఆహా! యెంతబాగున్నది అనుకుంటాను. అందులో తప్పేమీలేదు. అలాకకుండా మళీమళ్ళీ దాన్నే చూడాలనుకుంటాను. అదితప్పు. గులాబీ అందంపై మక్కువపెంచుకొని తద్వార లోతైనముద్రలు మనసుపై పడనీయరాదు. అలాజరిగితే మాటిమాటికీ దానిదగ్గరకువెళ్ళి చూడాలనిపిస్తుంది. ఇది, యేర్పడినముద్రలు మరింత బలపడేట్లుచేస్తుంది. ఆతర్వాత దాన్ని పొందాలనే ఆకాంక్ష మొదలై ఒకాటాడిస్తుంది. మనంలొంగిపోయామంటే, యిక దానిపనియది మొదలుపెడుతుంది. గమనించిచూడండి. ఒకచిన్న ఆలోచనను అదుపుచేయకుండా సాగనిస్తే, అది కార్యరూపందాలుస్తుంది. పర్యవసానంగా అది నిరాటంకంగా మున్ముందుకు వెళ్ళి, వరుససంఘటనలకు కారణమై, వాటిలో మనం చిక్కుకొనిపోయేట్లుచేస్తుంది. అందుకేమనం జాగరూకతతో చైతన్యవంతులమై వుండాలి.

దరు సాధనమొదలెట్టగానే ప్రశాంతత కావాలంటారు. కానీ వారికి సాంతం నిరంతరాయంగా ప్రశాంతత నివ్వడమెలా సాధ్యమౌతుంది? నిర్మలీకరణకార్యం జరుగుతున్నపుడు, సంస్కారాలు హృదయంనుండి పెగలింపబడతాయి. అప్పుడు, అభ్యాసి కొంతమేర ఆంధోళనకుగురౌతాడు. కేవలం ప్రశాంతతే కావాలంటే, సంస్కారాలు పూర్తిగా పరిశుద్ధంగావింపబడవు. మోక్షంసిద్ధింపదు. మోక్షంసిద్ధించాలంటే, తపనను ఆహ్వానించటానికి సిద్ధంగా వుండాల్సిందేమరి.

(ఆధ్యాత్మజ్ఞాన్ 2022 అక్టోబర్-డిశంబర్ త్రైమాసపత్రికలో ఆంగ్లంలో వెలువడిన "cleaning" అనే వ్యాసమునకు తెలుగు అనువాదము. )         


 


పూజ్యలాలాజీ మరియు మన ఆధ్యాత్మికప్రగతి

  పూజ్యలాలాజీ మరియు మన ఆధ్యాత్మికప్రగతి సోదరీసోదరులమైన మనమంతా యిక్కడ యీదినం (ఫిబ్రరవరి 14/ బుధవారం 2024) మన ఆదిగురువులైన పూజ్యలాలాజీవారి 1...