DOWNLOAD BOOKS
DIVYA VAANI:
దైవేచ్ఛ – మానవేచ్ఛ
దైవేచ్ఛ మానవేచ్ఛ మధ్య విభేదమేర్పడినప్పుడే మానసిక
శారీరకవ్యధలేర్పడు చున్నవి----బాబూజీ మహరాజ్.
మానవుడు తనఇష్టమొచ్చినరీతిలో ప్రవర్తించుస్వేచ్ఛ భగవంతుడనుగ్రహించినాడు.
అయినప్పటికిని జీవితములో మన పూర్వసంస్కారములే మన
యిచ్ఛనుపయోగించుటను నిర్ధారించుచున్నవి. దురదృష్టవశాత్తు మానవ జీవితలక్ష్యమును
సాధించుదిశగాకాక సహజమార్గప్రార్థనలో తెలిపినట్లు ప్రాపంచిక స్వల్పవాంచ్ఛా
పరితృప్తికై మనఇచ్ఛ, కోరికలదాసునిగా మనలను మార్చుచున్నది. మన స్వతంత్రే చ్ఛను మనమెంత
తెలివిగా ఉపయోగించినను,
ఆశించినఫలితము దక్కనపుడు నిరాశకులోనై నకారాత్మక ప్రవృత్తిని రేకెత్తించుచున్నది.
ఫలితము, ఆశించినరీతిలో వున్నట్లైన, అత్యుత్సాహపడుదుము. ఆశించినదానికి అనుకూలమైనా ప్రతికూలమైనా, యెట్లైనను, మనస్సుపై వాటిముద్రలు పడితీరును. వాటిని అదేపనిగా మాటిమాటికి తలచుకొనుటవలన, అవి గట్టిపడి (ఘనీభవించి) పోవును. ఈవిధముగా
జన్మజన్మలనుండి పేరుకపోయి, సంచితములైవచ్చి తిరిగి మరల మరల
పుట్టుచు మరణించుట కాస్పదమైనవి. ఈసంస్కారములలో (ముద్రలలో) కొన్ని పరిపక్వతజెంది, మన అనుభవమునకు (భోగమునకు) వచ్చును.
అవి మనమాశించినట్లుండక పోవచ్చును.
మనిషి మామూలుగా స్వార్థజీవి. తనభవిష్యత్తుతానెఱుగడు. తనకు ప్రతికూలముగా, తనఇచ్ఛకు వ్యతిరేకముగా జరిగిన సంఘటనలు, నిజానికవి అతని మేలుకు,క్షేమున
కేర్పడినప్పటికి, అవి తనఇచ్ఛకు, భగవదిచ్ఛకు మధ్యగల విభేదముగా తలచును. ప్రస్తుతానికి జరిగినవన్ని మనకు ప్రతికూలములు, అయిష్టములైన వైనను, అవన్ని మనమేలుకే
జరిగినవి. మనం బాహ్యదృష్టి కగుపించినవే నిజమనినమ్మే నైజంగలవార మగుటవలన, మన అంతర్వాణి తరచు మనలను తప్పుచేయనివ్వకుండా హెచ్చరిస్తున్నప్పటికిని, మనమాఅంతర్వాణిని ఖాతరు చేయుటలేదు.
అందువల్ల మనం క్రబద్ధముగాని మలినమనస్సు నిర్దేశించినట్లు
చేస్తూ,
దుర్బలులము వశముతప్పిన వారమై పోవుచున్నాము.
ఇట్టి అంతర్గతవిభేదస్థితినుండి బయటపడవలెనన్న, మనల్నిమనం ఆమహాప్రభుని (గురువర్యుని) ఇచ్ఛకు సమర్పితులం కావడమే పరిష్కారమార్గము. ఆయన ఈచ్ఛకు సంపూర్ణముగా లోబడి, మనల్నిమనం
సమర్పించుకోవడంవల్ల సమస్యలనెదుర్కొనుటకు, పరిష్కరించుకొనుటకు
వలయు సహాయము లభించడమేగాకుండా, మన నెరవేరనిఆశలు, కోరికలఫలితముగా గలిగిన వేదనలు నిరాశానిస్పృహల భారము నుండి ఉపశమనము
పొందుదుము.
ప్రతిది ఆమహాప్రభువు (గురువు) నుండే లభించుచున్నదన్న సత్యమునంగీకరించినప్పుడు
మాత్రమే,
మనమాయన వైపునకు మొగ్గుచూపి, ఆయన ఇచ్ఛకు మనల్నిమనం సమర్పించుకొనుటకు సమ్మతించి కడకు శరణాగతి
పొందుదుము. తత్ఫలితముగా సహజమార్గ దశాదేశములలో
మనకివ్వబడిన ఐదవఆదేశము ప్రకారము మనమేలుకై భగవద్వరముగా యివ్వబడిన వ్యధలు
బాధాలనుండి మనము విడుదల పొందగోరము.
శరణాగతిలో, వ్యక్తిత్వము అణగారి, ద్యైతభావముపోయి, ఆమహాప్రభువు (గురువు) ఒక్కడే నిలచియుండును.
ఆయనున్నాడు అంటే అక్కడ మనంలేము. మరోవిధంగా చెప్పాలంటే, ప్రభువుయిచ్ఛ ,
మనయిచ్ఛమధ్య సామరస్యముంటే, ఆయన సర్వకాల సర్వావస్థలలో యెప్పుడూ వున్నాడు. విభేదమున కాస్కారమే వుండదు. "బాధలు వ్యధలు వేదనలు మానవులకే కేటాయింపబడినవి"
అని బాబూజీమహరాజ్ తన ఒకానొక సందేశములో వెలిబుచ్చిరి.
పూజ్యగురువర్యుల రచనలలో, అందునా ముఖ్యంగా
ఋతవాణి,
దివ్యసందేశములలో తెలిపినట్లు, మానవజాతి,
వ్యధలు బాధలనుండి తప్పించుకొనుట జరుగదు.
అవి మానసికమైనవి కావచ్చును లేదా శారీరకమైనవికావచ్చును, అవి మన
పూర్వచర్యలఫలితముగా పేరుకపోయిన ముద్రలు లేక సంస్కారములు. అవి మనం భోగించుటకై వ్యక్తమైనవి. లేదా దైవాదేశమున మనము భరించుటకై వచ్చియున్నవి.
మనము కష్టాలలో వున్నప్పుడు, నిస్సహాయస్థితిలో వ్యధల నెదుర్కొనలేనప్పుడు, బాధలు మిక్కుటముగా వ్యక్తమౌతాయి. అవి మానవజీవితములో విడదీయలేని భాగములు. వాటినుండి యెవ్వరూ తప్పించుకొనజాలరు.
ఎవ్వరూ యేవిధంగానూ మనకు సహాయపడి, కష్టములనుండి గట్టెక్కించలేనప్పుడు, మనం, మన ప్రభువును (గురువును) ప్రార్థిస్తాము. సర్వసామాన్యంగా జనులు భగవంతుని సంతోషపెట్టడానికి, ఆయన
ప్రసాదించినవి మరలా ఆయనకే సమర్పించి, తమ బాధలు
వ్యధలనుండి ఆయన గట్టెక్కించాలంటారు.
ఈవిధమగు సర్వసామాన్యసిద్ధాంతమునకు సహజమార్గ అభ్యాసులుకూడా
అతీతులుకారు. పూర్తిగా దిక్కుతోచని నిస్సహాయస్థితిలో మనం పూజ్యగురువర్యులను
ప్రార్థించమని సలహానిస్తాము.
బాధలు వ్యధలనుండి విముక్తిపొందుటకు నిస్సహాయులమై, వాటిని గురువర్యుల పవిత్రపాదములకడ నుంచుటే మనకున్న మార్గము.
గమ్యమును దృష్టిలో నుంచుకొని, మన మెపుడు, ఆయనను ప్రార్థిస్తామో, అప్పుడాయన చాలావరకు వాటిని
అంతఃశుద్ధీకరణ,
ధ్యానము మరియు నిరంతరస్మరణ ద్వారా తొలగిస్తారు.
మిగిలినవి వాటిని అనుభవించుట (భోగించుట) ద్వారా నిర్మూలనమగును.
మనకున్నది ఒకేఒకజీవితము ( యీజీవితము) మాత్రమే. కనుక తుదిగమ్యము వైపునకుసాగు ప్రయాణమును, బాధలు,
వ్యధలనుండి తాత్కాలిక ఉపశమనము పొందుటకొఱకు
ఆలస్యముచేసుకొనరాదు. మరోవిధంగాచూస్తే, ఎంతయెక్కువగా వాటిని అనుభవిస్తే, అంతత్వతగా సహజమార్గమున మన పురోగతి సాగును. అంతఃశుద్ధీకరణతో సమర్థవంతముగాను వేగముగాను ప్రయాణముసాగును.
మనజీవితలక్ష్యమైన, ఉత్తమోత్తమ వెలుగులలోకము చేరుటకు, సులభముగా జనన మరణచక్రభ్రమణమును దాటుకొందుము. కష్టములనెదుర్కొనునప్పుడు, మనకు
వాటిననుభవించి, ముందుకుసాగి
బంధనముల నుండి విముక్తిపొందు శక్తిని ప్రసాదించమని పరమపూజ్య
గురుదేవులను ప్రార్థించవలెను. మనం గురుదేవులపై సంపూర్ణముగా ఆధారపడి, ఆయన ఇచ్ఛకు
సర్వము సమర్పించి,
జీవితములో లభించినదంతయు ఆయన కృపతో అనుగ్రహించినదేయని,
నమ్మికతో అంగీకరించి న
యెడల, కష్టములనెదుర్కొను
శక్తి మనకు సమకూరును.
(ఇది ఆధ్యత్మజ్ఞాన్ - 2019
అక్టోబర్-డిశంబర్ పత్రికలో ప్రచురించిన ,Worries, sufferings due to
‘conflict’ between God’s Will and Man’s
will అను వ్యాసమునకు తెలుగుఅనువాదము)
అంతఃశుద్ధీకరణ ప్రాముఖ్యము
రచన : శ్రీ
ప్రశాంత్ శౌరే పూణే .
అనువాదం :శ్రీ పి. సుబ్బారారుడు కడప .
అంతఃశుద్ధీకరణ సహజమార్గసాధనావిధానముననున్న నాలుగువిధులలో
ఒకటి. అంతర్గత శుద్ధీకరణకీ
విధి ఉపయోగపడుచున్నది. ఇందులో అభ్యాసి తన ఇచ్ఛాశక్తి నుపయోగించి తనలోనిచిక్కులు మలినములేగాకుండా
తమస్సు కూడా, బహుకాలమునుండి ఆత్మచుట్టూ ముద్రలు లేక సంస్కారములై
పొరలుపొరలుగా చుట్టుకొనియున్నవాటినెల్లా తొలగించివేయుటకు, గట్టిసంకల్పము చేయును. ఈ మలినములు, చెడుఆలోచనలతో బంధనముల నేర్పరచి
ప్రాపంచికఆకర్షణలకు
లోనగునట్లు చేయుట వలన యేర్పడినవి. ఇవి కేవలం యీజన్మకు సంబంధించినవిమాత్రమే కాదు. మనమెఱుగని గతజన్మలలోనివి కూడా విక్షేపరూపమున వచ్చిచేరినవి.
కనుక ప్రతిదినం, సాయంత్రం ఒకఅరగంట
శుద్ధీకరణవిధిని నిర్వహించడం అతిముఖ్యము. లేకపోతే అభ్యాసి పురోగమించినప్పటికి అతని పాతసంస్కారములు
వెనక్కులాగుతాయి. ఆద్యాత్మికప్రగతి సక్రమంగా సాగాలంటే మనదేహాంతర శుద్ధీకరణ తప్పనిసరి. ఆధ్యాత్మికప్రగతి నాశించదలిస్తే,
అభ్యాసి గురువుగారికి సహకరించితీరాలి. మనం శ్రద్ధగా సాధనలోని, ధ్యానము,
శుద్ధీకరణ, ప్రార్థన, నిరంతరస్మరణ పాటిస్తూ గురువుగారికి సహకర్తించాల్సిన అవసరమున్నది. తద్వారా మనమాయనతో సంబంధమేర్పరచుకొనుట
జరుగును. అప్పుడాయన కృపాధార నిరంతరంగా మనలోనికి ప్రవహించి తిరిగి సంస్కారములేర్పడుటను
నిరోధించును.
బాబూజీ వ్రాసినట్లు, అభ్యాసి పూర్వసంస్కారముల
నిర్మూలన, గురువుల
కర్తవ్యమే. అయినప్పటికీ అభ్యాసి తన దురాలోచనలతోను, చెడునడత
ద్వారాను తిరిగి జడత్వములోనికి జారిపోకుండా జాగరూకుడైయుండుట
అత్యంతావస్యకము. కనుక జాగ్రత్త చాలాముఖ్యము. అంతఃశుద్ధీకరణ ప్రతిదినము చేసుకొనుచుండినచో, యేవిధమైన
ముద్రలు పడకుండా,
సంస్కారములేర్పడుట జరుగనిస్థితికి అభ్యాసిచేరుకొనును.
ఆత్మవిశ్వాసంతో, నిశ్చయంతో
శుద్ధిప్రక్రియ జరగాలి. శుద్ధిప్రక్రియ పూర్తికాగానే వ్యక్తి తేలికదనాన్ని అనుభవములో పొందాలి.
అనుదినధ్యానం, అంతఃశుద్ధీకరణ వలన మనలోని అస్థిరత, చపలచిత్తాన్ని పోగొట్టుకోగలము. ప్రశాంతత శాంతి మనయందంతటా నెలకొనాలి. మనలోని ముద్రలన్ని కడిగివేయబడగానే హృదయభారం తొలగిపోతుంది.
సమర్థవంతమైన శుద్ధీకరణ, రాత్రి
నిద్రించుటకుముందు చేయుప్రార్థన వల్ల ఉదయధ్యానం యేవిధమైన ఆలోచనల తీవ్రతలేకుండా
సజావుగా సాగును.
ఒకసారి కర్నాటకరాష్ట్రంలోని గుల్బర్గకేంద్ర ప్రశిక్షకసోదరునికి
చెబుతూ బాబూజీ శుద్ధీకరణప్రక్రియ జరుగునపుడు మరియు పూర్తవ్వగానే
యేమౌతుందో యిలా తెలియజేశారు. "హృదయంలో శూన్యమేర్పడి, ఆశూన్యప్రదేసమంతా భగవత్కృపతో
నింపబడుతుంది"
అంతఃశుద్ధీకరణప్రక్రియలో చేసే సంకల్పం లేక ప్రయోగించే ఇచ్ఛాశక్తి ధ్యానప్రక్రియలోకూడా
అభివృద్దికితోడ్పడి నిరంతరస్మ రణతో శక్తివంతమౌతుంది. ఈరెండు సూత్రములతో గురువుగారి కృపాప్రవాహం
నిరంతరంగా కొనసాగుతుంది. గురువుగారు చెప్పినట్లు "పాతవాటిని విఛిన్నంచేయడం ఆధ్యాత్మికశాస్త్రంలో ఒకఅధ్యాయం" అది గురువుగారి బాధ్యత. సత్యతత్త్వమార్గంలో, పూర్వసంస్కారముల విఛిన్నావసరమున అభ్యాసి సహకారమందించడం అవసరం.
మానవజాతికి బాబూజీ యిచ్చిన మొదటిసందేశంలో యిలా సెలవిచ్చారు.
వ్యక్తి తనకుతాను యెలా మేలుచేసుకుంటాడో పరిశీలిద్దాం.
ప్రపంచం సూక్ష్మపరమాణువుల కలయికవల్ల యేర్పడింది.
అవి (పరమాణువులు) చాలాదట్టంగా మరియు చీకటిగానున్నవి. అయితే వాటిమధ్య మిణుకు మిణుకు
మంటున్న కాంతికూడా యున్నది. అది పురుషుడు ప్రకృతి ప్రక్కప్రక్కనే యుండునన్న సిద్ధాంతమును
నిర్ధారించుచున్నది. తెలివి, వివేకముగలవారు దివ్యత్వమువైపునకు
మరలి, కాంతిదిశకు దృష్టిసారించి ప్రయోజనము పొందగలిగారు. మిగిలినవారు ప్రాపంచికవస్తు ఆకర్షణకు లోనై చీకటిపరమాణువులతో
సంబంధమేర్పరచుకొని దృడమౌతూ ఆత్మచుట్టూ పొరలపైపొరలలను చుట్టుకొనుచూ పోయిరి.
వారు మాయప్రభావము స్థిరపడుటకు తగు సారవంతమైన భూమిని
కల్పించిరి. అందువల్ల ఆప్రభావము
శరీరఅణువులపైబడి , అది పొరలపై కేంద్రీకృతమై,
అందుండి మెదడుమధ్యభాగమున ప్రతిఫలించినది.
ఇదే సంస్కారములేపడుటకు కారణమైనది. ఆసంస్కరములే లోనికిచిచ్చుకొనిపోయి పరిసరములకు, మనస్సు తగులుకొని వ్యక్తిప్రవృత్తులకు ఊతమిచ్చినది.
తద్వారా అతడు చెడునుండి మరింతచెడుకు లోనైపోయెను.
ఈస్థితిలో గురువర్యుల శక్తిమాత్రమే అతని అంతర్గత తమస్సును తొలగించి రక్షించ సమర్థము.
కేవలమొక కనుచూపుమాత్రమున సాధకునిలో
తేలికదనాన్నుత్పన్నంచేయగల అద్భుతశక్తిమంతుడు మాత్రమే నిజమైనగురువు. తొలుత నేరుగా చీకటివైపునకు సాగు, సాధకుని ఆలోచన, వెలుగును అంతరంగమున గ్రహించునట్లు జేసి, కాంతివైపునకు ఆమహనీయుడు మరల్చును.
తద్వారా అతనిని వెలుగులకుగొంపోవుదారి సుగమమై అతనిలోని
అంతర్గతశక్తితో, ఆదారిన ప్రయాణముసాగించుటకు
తోడ్పడును.అందువల్ల అతని సమస్య పరిష్కారమై అతనికి వ్యతిరేకముగా పనిచేయు శక్తులనుండి
రక్షింపబడి అతనిమేలుకై వున్నవాటిని గ్రహించమొదలిడును.
(ఇది ఆధ్యత్మజ్ఞాన్ – 2024 జనవరి –మార్చి పత్రికలో ప్రచురించిన, Importance of Cleaning in Sahaj Marg Sadhana అను వ్యాసమునకు తెలుగుఅనువాదము)
పూజ్యలాలాజీ మరియు మన ఆధ్యాత్మికప్రగతి సోదరీసోదరులమైన మనమంతా యిక్కడ యీదినం (ఫిబ్రరవరి 14/ బుధవారం 2024) మన ఆదిగురువులైన పూజ్యలాలాజీవారి 1...